breaking news
Fadnavis government
-
మహారాష్ట్ర లాక్డౌన్?.. సీఎం ఫడ్నవీస్ కీలక ప్రకటన
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో జనం పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతుండటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.వదంతులు వ్యాపింపజేస్తే జైలుకే..లాక్డౌన్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కనీసం వాట్సాప్లో వచ్చే మెసేజ్లను ఫార్వార్డ్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తాం’ అని ఫడ్నవీస్ తీవ్రంగా హెచ్చరించారు. ముంబై సహా థానే, పాల్ఘర్, రాయగడ జిల్లాల్లో పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ కేంద్రాల వద్ద జనం ఎగబడుతుండటంతో గందరగోళం మొదలైంది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళనతో బంకుల వద్దకు పరుగులు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.నిందితుడు అరెస్ట్లాక్డౌన్ రాబోతున్నదంటూ ఫేక్ వీడియో సృష్టించి, వైరల్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఉద్రిక్తతలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారత్లో లాక్డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ పరిస్థితులను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అసత్య వార్తలను నమ్మవద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
ఫడ్నవిస్ సర్కారులో చేరిన శివసేన
-
బీజేపీ బలపరీక్షపై కోర్టుకు కాంగ్రెస్
ముంబై: నిబంధనలకు భిన్నంగా శాసనసభలో ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను మూజువాణి ఓటుతో గెలిచిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనుంది. ఇందుకోసం రాజ్యాంగ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనంత్గాడ్గిల్ బుధవారం మీడియాకు వెల్లడించారు.విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఏవిధంగా ఉల్లంఘించిందనే విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు గాడ్గిల్ తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు... పిటిషనర్ విన్నపాన్ని మన్నించేందుకు నిరాకరించింది. తన పిల్పై తుది నిర్ణయం వెలువడేదాకా ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలంటూ పిటిషనర్ సంజయ్ లాఖే పాటిల్ విన్నవించాడు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది.


