breaking news
F-4
-
‘ఫార్ములా’–4 చేదించాడు..
సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ సత్తా చాటింది. టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ టీం రేసర్ అఖిల్ అలీ భాయ్ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కరీ మోటార్ స్పీడ్వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్లో చాంపియన్గా నిలువగా, లీగ్ 2024లో గోవా ఏసెస్ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్ఎల్ రేసులో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. అభిమానులకు ధన్యవాదాలు.. హైదరాబాద్ రేసింగ్ లవర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్ లీగ్కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విజయం నా కెరియర్ను మలుపు తిప్పుతుంది. – అఖిల్ అలీ భాయ్ఈ సీజన్ చాలా కఠినం.. ఈ సీజన్ రేసింగ్ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్కి ట్రోఫీ చేజింగ్ లా మారింది. నేను రేసర్గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్తో పనిలేదు. – లారా క్యామ్స్ టారస్, మోటార్స్ స్పోర్ట్స్ వుమెన్ డ్రైవర్ రేసింగ్తో మంచి అనుబంధం.. నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ ఓనర్గా మారినప్పటికీ మన టీం చాంపియన్ షిప్ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్లో రేసింగ్ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్ ఫెస్టివల్లో వుమెన్ డ్రైవర్స్ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్ రేసింగ్ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్ రేసింగ్లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్గా మంచి క్యారెక్టర్ వస్తే కచి్చతంగా చేస్తాను. – అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్ -
భారత రోడ్లపైకి ఎంవీ అగస్టా బైక్స్
పుణే: ఇటలీకి చెందిన ప్రీమియం హైపర్ఫార్మెన్స్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ఎంవీ అగస్టా భారత్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా ‘ఎఫ్4’, ‘ఎఫ్3’, ‘బ్రుటలె’ అనే మూడు మోడళ్లను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి డిస్ట్రిబ్యూషన్ కోసం కైనటిక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బైక్స్ ధర రూ.16.78 లక్షలు-రూ.35.71 లక్షల శ్రేణిలో (ఎక్స్షోరూమ్ పుణే) ఉంది. ఈ ప్రీమియం బైక్స్ విక్రయాల కోసం కైనటిక్ గ్రూప్ ప్రత్యేకంగా ‘మోటొరాయలె’ డీలర్షిప్స్ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఇవే దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్. ఎఫ్4: దీని ప్రారంభ ధర రూ.26.87 లక్షలుగా ఉంది. ఇందులో 998 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. దీని పవర్ 195 హెచ్పీ. టార్క్యూ 111 ఎన్ఎం. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 2.4 సెకన్లలో అందుకుంటుంది. ఎఫ్3: దీని ధర రూ.16.78 లక్షలు. ఇందులో 800సీసీ 3 సిలిండర్ ఇంజిన్, మల్టీ రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రుటలె: దీని ప్రారంభ ధర రూ.20.10 లక్షలు. ఇందులో 1078 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ను పొందుపరిచారు. దీని పవర్ 144 హెచ్పీ.