breaking news
explosive items
-
పేలుడు పదార్థాన్ని నోట్లో కుక్కి ప్రియురాల్ని చంపేశాడు
మైసూరు: కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సుమారు 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు. మహిళ మృతదేహం బెడ్పై పడి ఉండగా, ఆమె ముఖం దిగువ భాగం ఛిద్రమైనట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అక్కడి ఫ్లోరంతా రక్తం ధారలుగా కనిపిస్తోంది. ఆమెను హున్సూర్ తాలుకా గెరసనహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. భెరియా గ్రామంలోని ఓ లాడ్జిలో రక్షిత విగతజీవిగా కనిపించింది. ఆ లాడ్జి గదికి ప్రియుడు సిద్ధరాజుతో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన రోజువారీ కూలీతో ఈమెకు వివాహమైంది. అయితే, రక్షిత తన బంధువైన సిద్ధరాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. లాడ్జిలో ఉండగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే సిద్ధరాజు తన వద్ద ఉన్న పేలుడు రసాయనాన్ని ఆమె నోట్లో కుక్కి జిలెటిన్ స్టిక్స్తో పేల్చాడు. ఇలాంటి జిలెటిన్ స్టిక్స్ను క్వారీల్లో బండలను పేల్చేందుకు వాడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పేలడంతోనే ఆమె చనిపోయిందంటూ అక్కడికి వచ్చిన వారితో సిద్ధరాజు కట్టుకథ చెప్పాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పేలుడు సామగ్రి పట్టివేత..ముగ్గురి అరెస్టు
బేతంచెర్ల(కర్నూలు): ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు సామగ్రిని మంగళవారం బేతంచెర్ల పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి సంజామల మండలం నొస్సం గ్రామానికి పేలుడు సామగ్రి తరలుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో బేతంచెర్ల వద్ద టాటాసుమోలో తరలిస్తున్న 5000 ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఐడీఎల్ పవర్జల్ 1249, 500 కేజీల అమ్మోనియా నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నల్లగొండ జిల్లాకు చెందిన వరి కొప్పుల లింగయ్య, కల్లూరు మండలానికి చెందిన ఐతే శ్రీనివాసులు, కర్నూలులోని బళ్లారి చెందిన అందె సత్యాల్రెడ్డిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.