breaking news
Excise Inspector
-
వైన్ షాప్ కోసం కోట్లు కమిషన్ ఇచ్చారు.. మహిళలపై ఎక్సైజ్ CI ఫైర్
-
ఎక్సైజ్ అధికారులపై దాడి
జడ్చర్ల: తనిఖీలకు వెళ్లిన ఎక్సై జ్ అధికారులు, సిబ్బందిపై గుడుంబా తయారీదారులు ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్సైజ్ సీఐ, హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జడ్చర్ల మం డలం కిష్టారం సమీపంలోని ఒంటిగుడిసె తండాలో చోటు చేసుకుంది. గుడుంబా నియంత్రణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, ట్రెయినీ ఎస్ఐ ఉమామహేశ్వ ర్, హెచ్సీ రమేశ్, కానిస్టేబుళ్లు సిద్ధార్థ, వెంకటేశ్ తమ వాహనం లో కిష్టారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బైక్, లూనాపై నలుగురు వ్యక్తులు 20 లీటర్ల గుడుంబాను తరలి స్తుండగా పట్టుకుని విచారించారు. తాము ఒంటిగుడిసె తండా సమీపంలో రాజు నుంచి గుడుంబాను కొనుగోలు చేసినట్లు వారు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరి రాకను పసిగట్టిన నలుగురు తయారీదారులు విచక్షణారహితంగా కర్రల తో దాడి చేశారు. దీంతో సీఐ, హెచ్సీ, ఇద్దరు కానిస్టేబుళ్ల తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ వీరస్వామి కేసు దర్యాప్తు చేపట్టా రు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దాడులకు వెళ్లే సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాయపడిన ఎక్సైజ్ సీఐ బాలాజీ, కానిస్టేబుల్ సిద్ధార్థ -
మెరిటోరియస్ అవార్డుకు దీపిక
నిజామాబాద్నాగారం(నిజామాబాద్అర్బన్): జిల్లాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దీపిక అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 8న రాష్ట్ర ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో మెరిటోరియస్ అవార్డు అందుకోనున్నారు. జిల్లాలో క్లోరోహైడ్రేట్, గంజాయి నిందితులను పట్టుకోవడంలో దీపిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ మేరకు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లాలో కల్తీకల్లు, గుడుంబా అరికట్టడంలోనూ ఆమె పాత్ర ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు నిర్మల్ జిల్లాలోనూ క్లోరోహైడ్రేడ్కు సంబంధించి 16 కేసులు నమోదు చేసి 23.58 కేజీల క్లోరోహైడ్రేడ్ను స్వాధీనం చేసుకున్నారు. 58 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకుగాను ఎక్సైజ్శాఖ ప్రత్యేకంగా మహిళ దినోత్సవం పురస్కరించుకొని అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రెండుజిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది దీపికను ప్రత్యేకంగా అభినందించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ సీఐ
మెట్పల్లిరూరల్: కరీంనగర్ జిల్లా మెట్పల్లి ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ గౌడ్ గురువారం సాయంత్రం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మల్లాపూర్లో గెజిట్ నం.275తో మద్యం దుకాణం నిర్వహిస్తున్న కోటగిరి ఆనంద్ను కొన్ని నెలలుగా లక్ష్మణ్గౌడ్ లంచం కోసం వేధిస్తున్నారు. జనవరి నెలలో మల్లాపూర్లోని ఆనంద్కు చెందిన వైన్సులో ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ గౌడ్ ఉద్దేశ పూర్వకంగా బిల్లులు సృష్టించి, పలువురితో ఫిర్యాదులు చేయించారు. జగిత్యాల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలసి వైన్స్పై దాడి చేసి, షాపును సీజ్ చేశాడు. ఆ కేసులో దుకాణం యజమాని ఆనంద్ అదే నెలలో ప్రభుత్వానికి జరిమానాగా రూ.1లక్ష చెల్లించి మద్యాన్ని తిరిగి తెరిచాడు. అనంతరం రూ.45 వేలను తనకు లంచం కింద ఇవ్వాలని కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం వరకు లంచం డబ్బులు చెల్లించక పోతే మళ్లీ వైన్సుపై దాడి చేసి, కేసులు నమోదు చేస్తానని బెదిరించినట్లు యజమాని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేది లేక ఏసీబీ అధికారులను సంప్రదించానని ఆయన వివరించాడు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు సుదర్శన్ గౌడ్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగనవట్ల గ్రామానికి చెందిన మెట్పల్లి ఎక్సైజ్ సీఐ టమాటం లక్ష్మణ్ గౌడ్ 2005లో ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం పొందారు. సీఐగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహించి, 2013లో బదిలీపై మెట్పల్లికి వచ్చారు. కాగా, గురువారం ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో ఆనంద్ నుంచి రూ.45 వేల లంచం తీసుకుంటు లక్ష్మణ్గౌడ్ మాకు పట్టుబడ్డాడు. సీఐపై కేసు నమోదు చేసి, తమ అదుపులోకి తీసుకొని పలు ఆరోపణలపై విచారించనున్నాం. -
గమ్మత్తు
అనంతపురం క్రైం : జిల్లాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది సిబ్బందితో పనులు చక్కబెట్టిస్తూ జిల్లా కేంద్రాన్ని వీడటం లేదు. సొంత వ్యాపారాలు, ఆట పాటల్లో మునిగి తేలుతూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి మంచి ఆదాయం చేకూర్చే వాటిలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఒకటి. ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మద్యం అమ్మకాలను పెంచాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ మేరకు అధికారులు బ్రాందీ షాపుల యాజమాన్యాలకు లక్ష్యాలు పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తేశామని బయటకు చెబుతూనే.. లోలోన అమ్మిస్తున్నారు. ఇంత చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యాలు చేరడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నాటుసారా, అక్రమ మద్యమే. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పల్లెల్లో నాటుసారా, కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. కొందరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ల తీరు వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు విమర్శలున్నాయి. వీరు వివిధ వ్యాపకాలతో స్టేషన్లకు రెగ్యులర్గా వెళ్లడం మానేశారు. చుట్టపుచూపుగా వారానికోసారో, రెండుసార్లో వెళ్తున్నారు. దీంతో వారి సిబ్బంది కూడా ‘ఆడిందే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే మకాం జిల్లా వ్యాప్తంగా 18 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. అనంతపురం ఈఎస్ పరిధిలో అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కణేకల్, రాయదుర్గం. పెనుకొండ ఈఎస్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, కదిరి, తనకల్లు, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, మడకశిర, కళ్యాణదుర్గం, కంబదూరు, ధర్మవరంలో స్టేషన్లు ఉన్నాయి. వీరిలో కనేకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల, గుత్తి, మడకశిర, పుట్టపర్తి, కదిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి తదితర ప్రాంతాలకు పోయి రావాలంటే దాదాపు సాయంత్రం అవుతుంది. అక్కడికి వెళ్లి వారి పరిధిలోని అక్రమ మద్యం, నాటుసారా తయారి తదితర వాటిని అరికట్టే చర్యలు ఎప్పుడు చేపడతారని కింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వీరు పని చేస్తున్న ప్రాంతాలకు వెళ్లే ముందుగా కొందరు సమాచారం చేరవేస్తే.. ఆ సమయానికి సిబ్బంది అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉంటారు తప్ప మామూలుగా ఆవైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్లు రాకపోవడంతో సిబ్బంది కూడా స్టేషన్ దాటి బయటకు వెళ్లరు. ఇటీవల రాయదుర్గం, కంబదూరు, మడకశిర ప్రాంతాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారుల దాడుల్లో కర్ణాటక నుంచి మన జిల్లాకు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమ మద్యం వ్యాపారానికి ఈ ఘటన ముచ్చుతునక. ఎక్సైజ్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో అక్రమ మద్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్రాంది షాపుల్లో భాగస్వామ్యం కొందరు సీఐలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరిగినట్లు తెలుస్తోంది. మరి కొందరు కొన్ని బ్రాంది షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. లక్షలాది రూపాయల సంపాదన ఉండడంతో ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు పేకాటకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట లాడ్జిలో పేకాట ఆడుతూ అనంతపురంలో రెండు స్టేషన్లలో పోలీసులకు పట్టుబడ్డారు. కొందరిని డ్రాయర్లతో నిలబెట్టడం అప్పట్లో కలకలం రేకిత్తించింది. అమ్మకాలు జరపాలంటూ వ్యాపారుల మెడపై కత్తి గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వం మాత్రం బ్రాందీ షాపుల యాజమాన్యాల మెడపై కత్తి పెట్టి మరీ అమ్మకాలు చేయాలని చెబుతోంది. నాటుసారా, అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే అమ్మకాలు పెంచొచ్చని, వాటిపై చర్యలు తీసుకోకుండా అమ్మండంటూ తమపై ఒత్తిడి తెస్తే ఏం చేయాలంటూ యాజమానులు వాపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులే చేతులు కట్టుకుని కూర్చుంటే తామేమి చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లకే పరిమితమవుతున్న వాహనాలు ప్రతి స్టేషన్కు తనిఖీల కోసం ప్రభుత్వం వాహనం ఏర్పాటు చేసింది. సీఐలు సక్రమంగా వెళ్లని కారణంగా కొన్ని జీపులు ఆయా స్టేషన్లకే పరిమితమవుతున్నాయి. దీనికితోడు విడపనకల్లు, డొనేకల్లు, ఓబుళాపురం, కొడికొండ, తూముకుంటలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల పనితీరు అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక బార్డర్ మొబైల్ పార్టీలు దాదాపు పని చేయడం లేదు. కళ్యాణదుర్గం, మడకశిర, ఉరవకొండలో ఈ బార్డర్ మొబైల్ పార్టీలు పని చేస్తున్నాయి. ఈ పార్టీలు తనిఖీలు చేసేందుకు ప్రస్తుతం వాహనాలు కూడా లేవని తెలిసింది. మొత్తం మీద కొందరు సీఐల పనితీరు ప్రశ్నార్థకంగా మారడం జిల్లాలో ఆ శాఖ ఉన్నతికి అడ్డంకిగా మారిందనడంలో సందేహం లేదని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. విధులకు డుమ్మా వాస్తవమే : కొందరు సీఐలు స్టేషన్లకు సరిగా వెళ్లడం లేదనేది వాస్తవమే. ఖచ్చితంగా అంగీకరించాల్సిన అంశమే. యూనిట్ ఆఫీసర్లు (సూపరింటెండెంట్లు) పట్టించుకోవడం లేదు. వారు తరచూ తనిఖీలు చేసి లేని వారిపై రిపోర్టులు ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోం? ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా స్థానికంగా ఉంటూ అక్రమ మద్యం, నాటుసారా తయారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. యూనిట్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేసేలా సూచిస్తాం. - జీవన్సింగ్, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్