breaking news
EVM Chip debit cards
-
ఆ ఎస్బీఐ డెబిట్ కార్డ్లు ఇక పనిచేయవు!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. చదవండి: ఎస్బీఐ గుడ్న్యూస్ మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి కస్టమర్లు ఆయా బ్రాంచ్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది. -
ఆ ఏటీఎం కార్డులను బ్లాక్ చేస్తున్న ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొందరి ఖాతాదారుల డెబిట్ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారాన్ని కస్టమర్లకు మెసేజ్ల రూపంలో అందిస్తోంది. అయితే ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. భద్రతా కారణాల నేపథ్యంలో మ్యాగ్స్ట్రైప్ డెబిట్ కార్డులను ఈవీఎం చిప్ డెబిట్ కార్డులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు బ్యాంకు తన వెబ్సైట్లో పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రతా కారణాలతో మ్యాగ్స్ట్రైప్ డెబిట్ కార్డును శాశ్వతంగా బ్లాక్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకును కాంటాక్ట్ చేయాలని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్(www.onlinesbi.com ) ద్వారా కార్డులను మార్చుకోవాలని బ్యాంకు సూచించింది. ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను బ్యాంకు ఉచితంగానే కస్టమర్లకు అందిస్తోంది. మ్యాగ్నిటిక్ స్ట్రైప్ ఆధారిత ఏటీఎంలు, డెబిట్ కార్డులను ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్లోకి మార్చాలని గతేడాదే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. మ్యాగ్నిటిక్ స్ట్రైప్ ఆధారిత ఏటీఎం, డెబిట్ కార్డులతో జరుగుతున్న మోసాల నుంచి రక్షించడానికి, ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్స్ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. 2017 సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చిప్ కార్డు ఆధారిత ఏటీఎం మోడల్స్లోకి మారాల్సిందేనని తెలిపింది. మ్యాగ్స్ట్రైప్ డెబిట్ కార్డంటే..? డెబిట్ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే, కార్డు వెనుకాల నల్లటి మ్యాగ్నిటిక్ స్ట్రిప్ ఉంటుంది లేదా ముందువైపు చిప్ ఉంటుంది లేదా ఈ రెండూ ఉండొచ్చు. ఈ కార్డులు సిగ్నేచర్ ఆధారితంగా ఉంటాయి. చిన్న అయస్కాంతాలతో ఈ స్ట్రిప్ తయారవుతుంది. దానిలోనే మీ అకౌంట్ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది.