breaking news
Erraguntla - Nandyal train
-
విద్యుత్ వెలుగు.. మార్గం మెరుగు
రాజంపేట: ఇటు వైఎస్సార్, అటు కర్నూలు జిల్లాలకు అనుసంధానంగా నిర్మితమైన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో విద్యుద్దీకరణ పూర్తి అయింది. ఈ యేడాది మార్చి నుంచి లాంఛనంగా కరెంటు రైలింజన్లతో నడిపిస్తున్నారు. రూ.976 కోట్లతో నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గం నిర్మించారు. ఈ మార్గంలో తొలి ప్యాసింజర్ రైలును 2016 ఆగస్టు 20న నడిపించారు. 123 కిలోమీటర్ల మేర.. నంద్యాల –ఎర్రగుంట్ల మధ్య 123 కిలోమీటర్ల మేర రైలుమార్గం విద్యుద్దీకరణ పూర్తి కావడంతో కొత్తరైళ్లను కూడా నడిపించే అవకాశాలున్నాయి. గతంలో డీజిల్ లోకోతో నడిచేవి. ఈ మార్గంలో గూడ్స్రైళ్లు నడుస్తున్నాయి. డీజిల్ ఇంజిన్ల వినియోగాన్ని తగ్గించేందుకు రైల్వేలో విద్యుద్దీకరణకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. గత బడ్జెట్లో ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం విద్యుద్దీకరణకు రూ.150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే, నంద్యాలవైపు నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంద్యాల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల వరకు ట్రాక్షన్ రైలుమార్గంగా కొనసాగింది. 8 కొత్తరైళ్లు నడిచేనా.. నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గంలో కొత్తరైళ్లు నడిచేనా అన్న అంశం నేడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మార్గంలో ధర్మవరం– విజయవాడ ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే నడుస్తోంది. ప్రారంభంలో నడిచిన నంద్యాల– కడప డెమో ప్యాసింజర్ను కరోనా సీజన్లో రద్దు చేశారు. తిరిగి ఆ రైలు ఇంతవరకు పట్టాలెక్కలేదు. రైలుమార్గం విద్ద్యుద్దీకరణ కావడం వల్ల కర్నూలు, కడపల మీదుగా ఇటు తిరుపతికి, అటు గుత్తి, గుంతకల్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు రైళ్లను నడిపించేందుకు (డీజిల్ లోకోలతో పనిలేకుండా) మార్గం సులువైంది. అలాగే కడప నుంచి విజయవాడకు డైలీ రైలును ఈ మార్గం మీదుగా నడిపిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నంద్యాల– ఎర్రగుంట్ల రైలు మార్గం విద్యుద్దీకరణ నేపథ్యంలో మరిన్ని కొత్త రైళ్లను నడిపేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. (చదవండి: సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా? ) -
మోక్షమెప్పుడో..!
జమ్మలమడుగు: జిల్లా ప్రజలకు ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఓ కలగా మారుతోంది. ఈ రైలుకు మోక్షమెప్పుడు వస్తుందా అని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం 1996-97లో మంజూరైంది. 126 కిలోమీటర్ల పరిధిలో రూ.883 కోట్ల అంచనా వ్యయంతో మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 2012 వరకు రూ.558 కోట్లు ఖర్చు చేశారు. పెండింగ్లో 30 కిలోమీటర్ల లైను మిగిలి ఉంది. ఇరవై శాతం పనులు ఈ మార్గం కోసం చేపట్టాల్సి ఉంది. 2012-13లో రూ.63కోట్లు కేటాయించారు. 2013-14లో రూ.30కోట్లు కేటాయించారు. బనగానపల్లె వరకు రైలుపట్టాలు నిర్మితమయ్యాయి. నంద్యాల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నొస్సం వరకు పనులు జరుగుతున్నాయి. రైలు మార్గం మంజూరై 17 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తికాలేదు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ.300 కోట్లు కావాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే కడప - కర్నూలు జిల్లాల మధ్య ప్యాసింజర్ రైలు నడవనుంది. 2012 మార్చి నాటికే పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా పనులు మాత్రం మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. కనీసం ఎర్రగుంట్ల - బనగానపల్లె వరకు ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం ఉన్నా దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 1996-1997లో అప్పటి రైల్వే మంత్రి రాంవిలాస్పాశ్వాన్ హయాంలో రూ.167 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ అంచనా రూ.470 కోట్లకు చేరింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ. 40కోట్ల కేటాయింపులు జరిగాయి. జిల్లాలో యర్రగుంట్ల నుంచి కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం సమీపం వరకు లైన్ నిర్మాణం, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ పూర్తయ్యాయి. 50 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. ఈ మార్గంలో యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉంటాయి. నొస్సం నుంచి నంద్యాల వరకు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్రాసింగ్ వంతెనలు, స్టేషన్ల నిర్మాణంలో పురోగతి అటకెక్కింది. నొస్సం నుంచి బనగానపల్లె మండలంలోని పండ్లాపురం వరకు ఎర్త్ పనులు పూర్తికాలేదని సమాచారం. జుర్రేరు, పాలేరు, కుందూ నదులపై వంతెనలతో పాటు, 45 లెవల్ క్రాసింగ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలంటే రెండేళ్లు పడుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కోవెలకుంట్ల వరకు పూర్తి చేసిన 82 కిలోమీటర్ల రైల్వేలైనులో పలుమార్లు ట్రయల్న్ ్రవిజయవంతంగా నిర్వహించారు. దాల్మియా కోసం.. ఎర్రగుంట్ల - నంద్యాల మధ్య ప్యాసింజర్ రైలు వస్తుందని గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు ఆశపడ్డారు. అయితే ప్యాసింజర్ రైలు రాలేదు గాని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోసం రైల్వే అధికారులు గూడ్స్రైలు నడుపుకోవటానికి అనుమతులు ఇచ్చారు. దీంతో అప్పుడప్పుడు ఈప్రాంత వాసులకు గూడ్స్రైలు దర్శనమిస్తోంది. మరి ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందోననే ఆతృతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.