breaking news
enugala venkatram Reddy
-
మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల
సాక్షి, హనుమకొండ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మీసం మెలేయగా.. మరో నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి తొడకొట్టడం.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు...వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్రావు దల్వీ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బయటికి వెళ్లిపోవడంతో సమావేశం ముగిసింది. సమావేశప్రాంగణం బయట కొండా, ఇనగాల ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో కొండా మీసం మెలేయడం, ఇనగాల తొడ గట్టడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
బర్త్డే గిఫ్ట్గా ‘ఉల్లి’
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాం రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పేదలకు వినూత్న బహుమతి ఇచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ యువజన నాయకుడు గోదాసి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ధర్మారం గ్రామంలో వందమంది పేదలకు ఒక్కొక్కరికి కిలో చొప్పున ఉల్లిగడ్డలను పంపిణీ చేశారు. -గీసుకొండ