breaking news
ease of doing
-
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వ్యాపారాల నిర్వహణ సులభతరానికి త్వరలో బిల్లు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇందులో భాగంగా నిర్దిష్ట చర్యలను నేరం కింద పరిగణించే కొన్ని నిబంధనలను సవరించేలా కొత్త బిల్లుపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. ' దీన్ని రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. నిబంధనల భారాన్ని తగ్గించేందుకు పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి తెలియజేయాలని పీహెచ్డీసీసీఐ వార్షిక సదస్సు 2022లో సూచించారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ అగ్రస్థానం: మంత్రి గౌతమ్రెడ్డి
సాక్షి, నెల్లూరు: ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమతో పాటు పరిసరాల అభివృద్ధి జరగాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో కోస్టల్ కారిడార్ ఉందని, రాబోయే రోజుల్లో పెట్టుబడులు బాగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో పాటు స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని జీవో తెచ్చామని తెలిపారు. -
బెంగళూరులో సులభతర జీవనం
సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు. జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి. మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా.. దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. విశాఖ –9.. తిరుపతి–2..! మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది. -
ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్ వన్గా ఉంది


