-
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టుల్లో 2022 జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చే కేసులు/పిటిషన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి కానుంది. ఆ తేదీ తర్వాత ఏ విషయంలోనూ ప్రభుత్వం భౌతికంగా కేసులు వేయడానికి వీలులేదు. రెవెన్యూ, పన్ను, మధ్యవర్తిత్వం, వాణిజ్య వివాదాలు, హైకోర్టు ద్వారా సాగే ఇతర కేటగిరీల్లో అందరికీ ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలి. అంతేగాక సబార్డినేట్ కోర్టుల తీర్పులు/ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్లు, అప్పీళ్లు, రివిజన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి. డబ్బు రికవరీ సూట్లు (బ్యాంకుల ద్వారా రుణ రికవరీ సూట్లు, అద్దె బకాయిలు మొదలైనవి), నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఫిర్యాదులు, నిర్వహణ కోసం దరఖాస్తులు, పరస్పర అంగీకారం ద్వారా విడాకుల పిటిషన్లు, బెయిల్ దరఖాస్తులను కూడా ఈ–ఫైలింగ్ ద్వారానే స్వీకరిస్తారు. (సమాచారం: ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత) -
‘రిటర్న్లపై’ ప్రచార రథాలు
హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్న్ల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచార రథాలను హైదరాబాద్ ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. శుక్రవారం ఏసీ గార్డ్స్లోని ఇన్కం ట్యాక్స్ భవన సముదాయంలో జరిగిన ‘కర్దాతా ఇ–సహయోగ్’కార్యక్రమంలో ఇన్కం ట్యాక్స్ (ఏపీ అండ్ తెలంగాణ) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.శంకరన్ ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ప్రజలను జాగృతం చేయడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు. జంట నగరాల్లో ఈ రథాలు ఆగస్ట్ 24 వరకు సంచరిస్తాయని పేర్కొన్నారు. ఇక ఆదాయపు పన్ను రిటర్న్ల ఇ–ఫైలింగ్ గడువును పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఇ–ఫైలింగ్ను ఈ నెల 31లోగా ఇంటర్నెట్ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. గడువులోగా చేయకుంటే 234 ఎఫ్ యాక్ట్ ప్రకారం వడ్డీతో సహా మరో రూ.5 వేలు అదనంగా చెల్లించాలని తెలిపారు. ఇన్కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం డైరెక్టర్ జనరల్ ఆర్కే ఫలివాల్ మాట్లాడుతూ.. డిజిటలైజేషన్లో భాగంగా ఇ–ఫైలింగ్ తప్పనిసరి చేశామన్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఎలక్ట్రానిక్ పద్ధతిలో మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇన్కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం చీఫ్ కమిషనర్ అతుల్ ప్రణయ్ మాట్లాడుతూ.. జూలై 31వరకు ఉన్న రిటర్న్ల గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ సెంట్రల్ కె.కామాక్షి పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఐటీఆర్-1 ఫామ్
న్యూఢిల్లీ : పన్ను చెల్లించే శాలరీ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తాజా ఐటీఆర్-1 దరఖాస్తు ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సింగిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను(ఐటీఆర్) దరఖాస్తును ఏప్రిల్ 5న సీబీడీటీ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఆదాయపు పన్ను శాఖ తన వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.inలో పొందుపరిచింది. మిగతా ఐటీఆర్ దరఖాస్తులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు అధికారి పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త ఐటీఆర్ దరఖాస్తులు శాలరీ క్లాస్ ప్రజలకు తప్పనిసరి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఏడు ఐటీఆర్ దరఖాస్తులను ఎలక్ట్రానిక్గా ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేటగిరీల పన్నుచెల్లింపు దారులకు దీని నుంచి మినహాయింపు ఉంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల మంది శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1ను ఫైల్ చేశారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేయడానికి తుది గడువు జూలై 31గా ఉంది. -
రికార్డు స్థాయిలో టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement