breaking news
e file
-
ఐటీ డిమాండు నోటీసు వచ్చిందా..
ప్రస్తుతం 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెస్మెంట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డిమాండు నోటీసులైనా రావచ్చు.. రిఫండైనా రావచ్చు. మీరు వేసిన రిటర్నులోని అన్ని అంశాలతో డిపార్ట్మెంటు ఏకీభవించవచ్చు.. ఏకీభవించకపోవచ్చు. ఈ నేపథ్యంలో డిమాండు నోటీసు గురించి ఈ వారం తెలుసుకుందాం. గత వారం చెప్పినట్లు మీరే స్వయంగా వారానికోసారి ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. E– Fileలోకి వెళ్లండి. ‘డిమాండ్’ అన్న కాలంని క్లిక్ చేయండి. తర్వాత ‘ View’ని క్లిక్ చేయండి. మీ అసెస్మెంట్ వివరాలు కనిపిస్తాయి. ఏయే సందర్భాల్లో రావచ్చు.. మీరు డిక్లేర్ చేసిన ఆదాయంతో డిపార్టుమెంటు ఏకీభవించకుండా, ఎక్కువ అసెస్ చేస్తే.. వ్యాపారస్తుల విషయంలో కొన్ని ఖర్చులను ఒప్పుకోకపోతే.. మీరు క్లెయిమ్ చేసిన ‘డిడక్షన్’ తప్పయితే.. మీకు అర్హత లేని లేదా వర్తించని డిడక్షన్లను క్లెయిమ్ చేస్తే తప్పులు దొర్లితే చెల్లించిన పన్ను వివరాలు.. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ మొదలైన వాటి విషయంలో అప్డేట్ అయిన వివరాలతో సరిపోలకపోతే రిటర్నుల్లో వివరాలు సరిగ్గా, సమగ్రంగా పొందుపర్చకపోతే ఆదాయం,పన్ను చెల్లింపులు, చెల్లించవలసిన మొత్తం వంటి వివరాల్లో హెచ్చుతగ్గులు ఉంటే నోటీసు రాగానే ఏం చేయాలి.. గాభరాపడనక్కర్లేదు. ఆ నోటీసులో ప్రతీ అంశాన్ని చదవండి. వాళ్లే ఒక కాలంలో మీరు డిక్లేర్ చేసింది, ఆ పక్కన ఇంకో కాలంలో వారు అసెస్ చేసినది చూపిస్తారు. ఈ రెండింటినీ సరిపోల్చి చూసుకోండి. వారి డిమాండ్ కరెక్ట్ అయితే ఆ విషయం ఒప్పుకుని డిమాండు మొత్తాన్ని చెల్లించండి. ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ఒప్పుకోకండి. ‘disagree’ అని క్లిక్ చేయండి. సరయిన వివరణ, జరిగిన తప్పులను సరిదిద్దడం, పూర్తి వివరాలను పొందుపర్చటం వంటివి చేయండి. ఒక్కొక్కప్పుడు కొంత తప్పే మీది కావచ్చు..ఇంకొంత తప్పు వారిది కావచ్చు. డిమాండు కొంతవరకే నిజం కావచ్చు. అంటే పాక్షికంగా అన్నమాట. అలాగే బదులివ్వండి. పూర్తి వివరాలతో సరైన వివరణ ఇవ్వండి. కాగితాలు, రుజువులు, ఆధారాలు అడిగితే జతపర్చండి. ఇలా చేస్తే మీ ఆదాయపు పన్నుఅసెస్మెంటు పూర్తయినట్లే. నోటీసుకి బదులివ్వడం వలన మీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా మీ అసెస్మెంటు అంశానికి సంబంధించిన కథకు కూడా సుఖాంతం పలికినట్లవుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
13 నుంచి ఈ– ఫైల్స్
– డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ కర్నూలు సిటీ: ఈ నెల 13వ తేదీ నుంచి అన్ని శాఖలకు చెందిన అధికారులు ఈ – ఫైల్స్ (పేపరు రహిత ఫైల్స్)ను పంపించాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వినతులను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంకు వచ్చిన సమస్యల్లో అత్యధికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాలు, జెడ్పీ, డీపీఓ, జల వనరుల శాఖ, ఎకై ్సజ్ శాఖల్లో అధికంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. – ఓర్వకల్లు సమీపంలో జాతీయ రహదారి విస్తరణలో తమ భూమి పోయిందని, ఇంత వరకు పరిహారం రాలేదని ఓ రైతు ఫిర్యాదు చేశారు. – వెల్దురి మండలం శ్రీరంగాపురం, చిన్న కొముల పల్లె గ్రామంలో గొర్రెల పెంపకదారులు అధికంగా ఉన్నారని, పశువైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. – మద్దికెరలో 554 సర్వే సెంబరులో 17 ఎకరాల భూమిని మా తండ్రి కొనుగోలు చేస్తే, స్థానిక వీఆర్ఓ తన తమ్ముని పేరు మీద 33 సెంట్ల భూమి రాయించి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నారని ఓ రైతు జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ స్పందించి ఆదోని ఆర్డీఓను విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.