-
ఈ కామర్స్ ఎలిఫెంట్ ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది. అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్లో 48 శాతం వాటాతో ఫ్లిప్కార్ట్ మార్కెట్ లీడర్గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్కార్ట్కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్లైన్ స్మార్ట్ఫోన్లలో 48 శాతం, ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాలపై మీషో గురి జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్లో ఈ కామర్స్ యాప్ డౌన్లోడ్లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్ఫామ్పై 95 శాతం కొనుగోళ్లు అన్బ్రాండెడ్వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్లో మింత్రా టాప్... ఫ్యాషన్ ఈ–కామర్స్లో రిలయన్స్కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
ఈ కామర్స్.. 3 లక్షల కోట్లకు!
న్యూఢిల్లీ: దేశంలో ఈ కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2019 నాటికి 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ (రూ.30వేల కోట్లు).. 2030 నాటికి 40 బిలియన్ డాలర్ల (రూ.3లక్షల కోట్లు)కు వృద్ధి చెందుతుందని కెర్నే సంస్థ అంచనా వేసింది. ‘ఈ కామర్స్: భారత రిటైల్ మార్కెట్లో తదుపరి పెద్ద అడుగు’ అంటూ ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. డిజిటల్ చానల్స్ టైర్–3, 4 పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతుండడం.. ఆన్లైన్ కొనుగోళ్ల దిశగా వినియోగదారుల్లో మారుతున్న ధోరణులు ఈ కామర్స్ విస్తరణకు దోహదపడనున్నట్టు ఈ సంస్థ భావిస్తోంది. లైఫ్ స్టయిల్ రిటైల్ మార్కెట్ సైతం 2019 నాటికి ఉన్న 90 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 156 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 215 బిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు అంచనా వేసింది. వస్త్రాలు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్ ఈ విభాగంలోకే వస్తాయి. ‘‘భారత్లో రిటైల్ రంగం కరోనా నుంచి కోలుకుంటోంది. విలువ ఆధారిత ఆన్లైన్ షాపర్లు పెరుగుతుండడం భారత ఈ కామర్స్ రూపాన్నే మార్చేయనుంది. లైఫ్స్టయిల్ విభాగం చాలా వేగంగా వృద్ధి చెంది 2030 నాటికి 215 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’ అని కెర్నే పార్ట్నర్ సిద్ధార్థ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలోని డిమాండ్లో 4 శాతాన్నే ఆన్లైన్ వేదికలు తీరుస్తుండగా. 2030 నాటికి 19 శాతానికి ఇది పెరుగుతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ యూజర్లలో వృద్ధి ‘‘భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2026 నాటికి 110 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో మూడింట ఒక వంతు మంది చురుగ్గా ఆన్లైన్లో షాపింగ్ చేసే వారే ఉంటారు’’ అని కెర్నే తన నివేదికలో వివరించింది. ప్రస్తుతానికి లైఫ్స్టయిల్ రిటైల్ డిమాండ్లో 70 శాతం విలువ ఆధారిత ఉత్పత్తుల నుంచే ఉంటోందని వివరించింది. ఈ మార్కెట్లో 80 శాతం వాటా ప్రస్తుతం అసంఘటిత రంగంలోను, 4 శాతం వాటా ఈ కామర్స్ సంస్థలకు ఉండగా.. 2030 నాటికి అసంఘటిత రంగం వాటా 57 శాతానికి తగ్గుతుందని.. అదే సమయంలో ఈ కామర్స్ వాటా 19 శాతానికి విస్తరిస్తుందని అంచనాలు ప్రకటించింది. 2026 నాటికి 140 బిలియన్ డాలర్లు భారత ఈ–రిటైల్ (ఈకామర్స్/ఆన్లైన్) మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని.. 2026 మార్చి నాటికి 120–140 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని బెయిన్ అండ్ కంపెనీ సైతం అంచనాలను ప్రకటించింది. 2020–21లో రిటైల్ మార్కెట్ మొత్తం మీద 5 శాతం తగ్గినప్పటికీ.. ఈ–రిటైల్ మార్కెట్ 25 శాతం వృద్ధితో 38 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది. ‘‘2021 చివరికి మొత్తం రిటైల్లో ఈ కామర్స్ వాటా 4.6 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఈ రిటైల్ మార్కెట్ వృద్ధికి దోహదపడింది. భద్రత, సౌకర్యానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్లో లాక్డౌన్ల సమయంలో నిత్యావసరాలు, పరిశుభ్రత ఉత్పత్తులను ఈకామర్స్ సంస్థలు ఇళ్లకు చేరవేశాయి’’ అని ఈ సంస్థ పేర్కొంది. -
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి టెక్ దిగ్గజం
టెక్ దిగ్గజం గూగుల్ కన్ను ఇప్పుడు ఈ-కామర్స్ మార్కెట్పై పడింది. అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లో వాటా కొనేసి మన ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత.. టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ తొలి స్టాప్ కూడా భారతేనట. ఈ ఏడాది దివాళి వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి గూగుల్ ప్రవేశించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం, ఈ టెక్ దిగ్గజం కూడా చర్చలు జరిపింది. ప్రస్తుతం సొంతంగానే గ్లోబల్ ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. 2020 వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకోబోతుందని తెలిసింది. దీంతో భారత్లోనే తన తొలి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేయాలని గూగుల్ చూస్తోంది. ‘గూగుల్ రెండో వైపు ఆలోచనలను ప్రారంభించింది’ అని ఫ్లిప్కార్ట్కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఈ విషయంపై గూగుల్ స్పందించడం లేదు. ఈ వారం ప్రారంభంలోనే ఈ-కామర్స్ మార్కెట్పై తనకు ఆసక్తి ఉందని గూగుల్ సంకేతాలు ఇచ్చింది. చైనీస్ ఈకామర్స్ కంపెనీ జేడీ.కామ్లో గూగుల్ 550 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. అక్కడ వాల్మార్ట్, జేడీ.కామ్లు వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. గూగుల్ ఇండియా ఈ-కామర్స్ ప్లాన్లు ఏడాది పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలోకి వెళ్లే ముందు, భారత్లో వీటిని టెస్ట్ చేయాలనుకుంటోంది. దీని కోసం 2వేల వర్క్షాపులను నిర్వహించింది. గూగుల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కోసం 15 వేల మందికి పైగా విక్రయదారులను గుర్తించిందని కూడా తెలిసింది. ఇలా గూగుల్ తన ఈ-కామర్స్ ప్లాన్స్ను అమల్లోకి తీసుకురావడానికి వేగవంతంగా ముందుకు సాగుతోంది. -
ఈ-కామర్స్ మార్కెట్లోకి ఫేస్బుక్
-
అమెజాన్ను దెబ్బతీయడం కోసం మరో దిగ్గజం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్లు మెగా డీల్ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ కూడా అమెజాన్ను దెబ్బతీయడానికి భారత ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేయబోతోంది. వాట్సాప్ ద్వారా ఇప్పటికే దేశీయ పేమెంట్ సర్వీసుల్లోకి ప్రవేశించిన ఫేస్బుక్, త్వరలోనే ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ పలు బ్రాండులు, వ్యాపారస్తులతో చర్చలు జరుపుతుందని తెలిపాయి. జూన్ నుంచి ప్రారంభించబోతున్న బిజినెస్-టూ-కన్జ్యూమర్ ట్రాన్సక్షన్స్ టెస్టింగ్ ఈ నెల నుంచే మొదలైనట్టు ఒకరు పేర్కొన్నారు. ఫేస్బుక్ తన మార్కెట్ప్లేస్లో ఉత్పత్తులను అప్లోడ్ చేయడం కోసం మరిన్ని టూల్స్ను ఏర్పాటు చేయనుందని, ఇన్వెంటరీ, ఆర్డర్లను నిర్వహించనుందని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు పేమెంట్స్ను కూడా జత చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫేస్బుక్, తన వినియోగదారులను అమ్మకపుదారుల ఫేస్బుక్ పేజీలకు, వెబ్సైట్లకు మరలుస్తోంది. ఫేస్బుక్ గత ఆరు నెలల క్రితమే కన్జ్యూమర్-టూ-కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ కోసం మార్కెట్ ప్లేస్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి నెల ఈ మార్కెట్ప్లేస్ను 70 దేశాల్లో 800 మిలియన్ మంది యూజర్లు సందర్శిస్తూ కొనుగోళ్లు, అమ్మకాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ సోషల్మీడియా దిగ్గజం బిజినెస్-టూ-కన్జ్యూమర్ మోడల్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 2026 వరకు 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్ స్లాన్లీ అంచనావేస్తోంది. ప్రజల అవసరాలను చేరుకోవడానికి కంపెనీ ఎల్లవేళలా కృషిచేస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈకామర్స్ ద్వారా కమ్యూనిటీస్ కనెక్ట్ కావడం కోసం కొత్త మార్గాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉంటామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement