breaking news
dwarakapuri colony
-
మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇంతే..
ఇండోర్: చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే స్కూళ్లో టీచర్లు గుంజీలు తీయించేవారు. కానీ మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇదిగో పై ఫొటోలో కనిపిస్తున్నట్లు పోలీసులు బజారులోనే గుంజీలు తీయిస్తారు. ఈ అరుదైన శిక్ష విధించిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. ఆగస్టు 11న ఇండోర్లో ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి వాహనాన్ని అప్పగించమని దబాయించారు. అతడు కుదరదని చెప్పడంతో కత్తితో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్వారకాపురి ప్రాంతంలో తిరుగాడుతున్న ఆ ఇద్దరు దుండగులను గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అజయ్ ఠాకూర్, విజయ్ విశ్వకర్మలుగా గుర్తించారు. (కొడుకుతో సైకిల్పై 105 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే) అనంతరం రోడ్డు మీదనే వీరికి బుద్ధొచ్చేలా చేయాలని పోలీసులు భావించారు. దీంతో నడిరోడ్డుపైనే చెవులు పట్టుకుని గుంజీలు తీయించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత వాళ్లు కత్తి దూసిన చోటే ముక్కు నేలకు రాశేలా చేశారు. దీన్ని అక్కడున్న కాలనీ వాసులు ఇళ్లలో నుంచి చూస్తూ పోలీసుల చర్యను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. 'నిందితులతో ఇలా చేయించడం వల్ల ప్రజలకు నేరస్థులంటే భయం పోయే అవకాశం ఉంటుంది, అలాగే ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులను సంప్రదించడానికి ప్రజలకు వెనుకాడరు' అని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ధరంవీర్ సింగ్ తెలిపారు. నిందితులు గుంజీలు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’) #WATCH Madhya Pradesh: Police in Indore's Dwarkapuri made two criminals do sit-ups and apologise to people for their crimes. (20/08/20) pic.twitter.com/j1zBBSKgff — ANI (@ANI) August 21, 2020 -
పేరడిగి.. కత్తితో దాడి
సైదాబాద్: తెల్లవారు జామున టీ తాగడానికి రోడ్డుపైకి వచ్చిన విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సైదాబాద్ ఎస్ఐ రాజేష్కుమార్ తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకడు (23) దిల్సుఖ్నగర్లోని సాయి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ స్థానిక ద్వారకాపురికాలనీలోని హాస్టల్లో ఉంటున్నాడు. ఖాళీ సమయంలో సంతోష్నగర్లోని హెరిటేజ్ ఫ్రెష్లో స్టోర్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు తనతో పాటు పని చేస్తున్న మరో యువకుడితో కలిసి టీ తాగేందుకు చౌరస్తాకు వచ్చాడు. అక్కడ టీ దొరక్క పోవడంతో సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాకు నడుచుకుంటూ బయలుదేరారు. అదే సమయంలో అక్కడికి రెండు బైక్లపై వచ్చిన ఐదుగురు దుండగులు సైదాబాద్ ఎక్కడ అని వీరిని హిందీలో ప్రశ్నించారు. ఆపై మీ పేర్లేంటని అడిగారు. చెప్పగానే ఒకరి కడుపులో కత్తితో పొడిచి పారిపోయారు. కత్తి పిడి బాధితుడి కడుపులో అలాగే ఉండిపోయింది. వెంటనే 108 అంబులెన్స్లో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.