breaking news
DVVS sharma
-
పంచాయతీ ఎన్నికలకు బాబు ఎగనామం!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నది. రాబోయే ఆగస్టు 1లోగా రాష్ట్రంలోని 12,888 గ్రామ పంచాయతీలకు 1,30,870 వార్డులకు ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత సంవత్సరం నవంబరు నుంచీ సన్నాహాలు ప్రారంభించింది. 2017 నవంబరు 27–30 తేదీల మధ్య ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలను విశదీకరిస్తూ 8 సర్క్యులర్స్ను జారీ చేసింది. ఎన్నికల యంత్రాంగం; పోలింగ్ స్టేషన్ల నిర్ధారణ, పోలింగ్ సిబ్బంది నియామకం వంటి అంశాలపై తీసుకోవలసిన చర్యలను సూచించింది. ఇలా ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తుంటే దానికి భిన్నంగా రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల వాయిదాకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. మే నెల 15 తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటన చెయ్యకపోగా మరి కొంత గడువు కావాలని, కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయని, గ్రామ కార్యదర్శుల కొరత వున్నదని వాయిదా కోరడం విడ్డూరంగా కనిపిస్తున్నది. కాని ఇదే ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు గొప్పగా అమలు అవుతున్నట్లు నిత్యం ప్రకటనలు చేస్తున్నది. తీరా ఎన్నికలొచ్చేసరికి చేతులెత్తేయడం వెనక ఎన్నికలు వాయిదా కుట్ర కనిపిస్తున్నది. పంచాయతీ ఎన్నికలు జరగాలంటే వాటి రిజ ర్వేషన్లను ప్రభుత్వమే ఖరారు చేసి పంపాల్సి వుంది. దీనిమీద ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరిగిన దాఖలాలు లేవు. ఎన్నికలు జరపాల్సిన పంచాయతీల జాబితా, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల జాబితాలు ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందిస్తే తప్ప ఎన్నికలు జరిగే వీలు లేదు. అందుచేత ప్రభుత్వం తన దగ్గర వున్న యీ అవకాశాలను వినియోగించుకుని దొడ్డిదారిన ఎన్నికల వాయిదాకు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యాంగ ఉల్లంఘన : రాజ్యాంగంలో పంచాయతీల పదవీ కాలాన్ని అయిదేళ్లుగా స్పష్టం చేసింది. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అసాధ్యమైతే తప్ప పంచాయతీ ఎన్నికల వాయిదాకు వీలులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిలో ఎన్నికల వాయిదాను తప్పనిసరిగా చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు కూడా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలాగా గడువు ముగిసేలోగా ఎన్నికలు జరిగితీరాలి. కాని జరగడం లేదు. పంచాయతీలు, వార్డులు, రిజర్వేషన్లు ఖరారు చేసే పనిని రాష్ట్రప్రభుత్వాలకు చేతుల్లోపెట్టారు. ఈ చిన్న సందులో దూరి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లం ఘనకు పూనుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరపడానికి ఎలాంటి అవరోధాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ దురుద్దేశంతో పంచాయతీ ఎన్నికల వాయిదా వైపు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు పాలన ఒక వికృతమైన కేంద్రీకృత పాలన అని అందరికీ తెలుసు. ఆయన ఎన్నికైన పంచాయతీలను ఏనాడూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించిన పాపాన పోలేదు. ఆయన ఎప్పుడు పాలనలోకి వచ్చినా పంచాయతీల నెత్తిమీద జన్మభూమి కమిటీలు, లేదా నోడల్ వ్యవస్థను పెట్టి వాటి ఉనికిని నామమాత్రం చేయడం మనం చూస్తున్నదే. కొన్ని రాష్ట్రాలలో పంచాయతీలను ప్రభుత్వ పథకాలు అమలు చేసే ఏజెన్సీలుగానైనా చూస్తున్నారు. ఇక్కడ ఆ ఏజెన్సీ పాత్ర కూడా ఆయన ప్రభుత్వమే స్వీకరించి పంచాయతీల స్థానంలో నామినేట్ చేసిన కమిటీలకు అప్పజెప్పారు. చంద్రబాబు కేంద్రీకృత పాలనకి ఎన్నికైన పంచాయితీలు సరిపడవు. అవి వుంటే వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చడం లేదా వీలుంటే వాటికి ఎన్నికలు లేకుండా చెయ్యడం అన్నది ఆయన వైఖరిగా కనిపిస్తున్నది. ఇది అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం. ఎన్నికైన పంచాయతీలు లేకుండా వుంటే ప్రత్యేక అధికారుల పేరుతో, కొత్త జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో పార్టీ పాలన సాగించడానికి అవకాశం కలుగుతుంది. దీనిని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులలోనూ జారవిడుచుకోరు. పైగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరిగితే ఎటుపోయి ఎటువస్తుందోనన్న భయం కూడా ఆయనలో కనిపిస్తుంది. దీనికి తోడు గ్రామస్థాయి వరకు సంస్థాగత నిర్మాణం వున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పంచా యతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్ష పార్టీలకు కూడా పోటీ చేసే అభ్యర్థుల రూపంలో సంస్థాగత నిర్మాణం జరిగే అవకాశం వుంది. రాబోయే ఎన్నికలలో ప్రత్యర్థులకు అది వరప్రసాదం అవుతుంది. అందుచేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏ మాత్రం కనిపిం చడం లేదు. పంచాయితీ ఎన్నికల మీద ప్రతిపక్షాలలో కూడా తగినంత కదలిక కనిపించడం లేదు. వికృతమైన చంద్రబాబు నాయుడు కేంద్రీకృత పాలనను ఎండగట్టాలి. పంచాయతీ వ్యవస్థను భ్రష్టుపట్టించిన తీరును బట్టబయలు చెయ్యాలి. ఎన్నికల వాయిదా జరిగితే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టి రాజ కీయంగా ఏకాకిని చెయ్యాలి. రాజ్యాంగబద్ధంగా పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరపడానికి అందరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. -డి.వి.వి.యస్. వర్మ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 98660 74023 -
ఎజెండాలతో ‘హోదా’కు గండి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వం దోబూ చులాట సాగించింది. అధ్యయనం చేస్తు న్నట్టు, సానుకూల ప్రకటన వస్తుంద న్నట్టు ఆశలు రేకెత్తించారు. కేంద్రం తమ చేతులలోనే ఉన్నట్టు రాష్ర్ట ప్రభుత్వం బీరాలు పలికింది. విభజన బిల్లు మీద జరిగిన చర్చలో గట్టిగా వాదించిన ఆనా టి ప్రతిపక్ష నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు ఇప్చడు కీలక పదవు లలో ఉండడంతో నమ్మకాన్ని పెంచింది. ఆ తర్వాత ఈ నేతలే మాటమార్చడంతో, ముఖ్యమంత్రి మౌనముద్ర దాల్చడంతో శంక లు మొదలయ్యాయి. జూైలై 31న కేంద్ర ప్రణాళికా శాఖమంత్రి, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ ైైజైట్లీల ప్రకటనలతో ప్రత్యేక హోదాకు ఎసరు పెట్టారని అర్థమైంది. ప్రత్యేక హోదాను నిరాకరించడానికి బీజేపీ ప్రభుత్వం చూపు తున్న కారణాలలో నిజాయితీ కనిపించదు. రాష్ర్ట ప్రగతి గురించి నిరంతరం ప్రగ ల్భించే టీడీపీ ప్రభుత్వం హోదా గురించి గట్టిగా నిలదీయకపోవడం వెనుక చిత్తశుద్ధి కూడా కానరాదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చక పోవడా న్ని బీజేపీ సాకు గా చూపుతున్నది. ఎన్నికలకు ముందే విభజన జర గాలనుకు న్నారు. దానికోసం రాజ్యసభలో బిల్లును యథాతథంగా ఆమోదిం చకపోతే, మళ్లీ లోక్సభ ఆమోదం పొందవలసి ఉంటుంది. కాబట్టే కాంగ్రె?స ప్రభుత్వం, నాటి ప్రతిపక్ష బీజేపీ చేసుకున్న ఒప్పందం ఫలితంగానే ప్రధాని ప్రకటన వచ్చిందనేది బహిరంగ రహస్యం. దానిని అమలు చేయవలసిన నైతిక బాధ్యత బీజేపీ మీద ఉంది. చట్టంలో ఈ అంశం ఉండి తీరాలని కేంద్రం భావిస్తే, చట్ట సవర ణతో ముంపు గ్రామాలను చేర్చినట్టూ, శాసనమండలి స్థానాలను పెంచినట్టూ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించాలి. అంతేగాని హోదా ఎగవేతకు దానినే కారణం చేయరాదు. అరుణ్ జైట్లీ తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసును కూడా ఓ సాకుగా చూపుతున్నారు. గతంలో ఉన్న ప్రత్యేక కేటగిరీ విధానం ఇప్చడు సరికాదని ఆర్థిక సంఘం చెప్పిందనీ, అందు వల్ల ఈ వివాదానికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక సాయమందజేస్తామనీ ప్రకటించారు. అంటే ప్రత్యేక హోదా లేదని జైట్లీ చెప్పకనే చెప్పారు. ఆయన న్యాయవాది. రాజ్యాంగాన్ని ఔపో సన పట్టినవారు. ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశం. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రకటించే లేదా తొల గించే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడ నుంచి వచ్చినదీ జైట్లీయే చెప్పాలి. ప్రత్యేక హోదాకు మార్గదర్శకాలను ప్లానింగ్ కమిషనఖ రూపొందించినా, మంజూరు గురించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ అభివృద్ధి మండలికి ఉండేది. ఇప్చడు ఈ రెండు సంస్థలు రద్దయ్యాయి. అధికారం గల సంస్థ అస్తిత్వంలో లేదు. అస్తిత్వంలో ఉన్న ఆర్థిక సంఘానికి లేని అధికారాలు కట్ట బెట్టి ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం కంటే మించిన వంచన ఉం డదు. ప్రత్యేక హోదాను మంజూరు చేసే సంస్థలు లేకపోవడంతో నిర్ణయం తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా ఆమోదించిన హామీని నెరవేర్చక పోతే పార్లమెంటఖ విశ్వసనీయత దెబ్బ తింటుంది. ఇది ఒక అసా ధారణ పరిస్థితిలో, రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీ. మన రాజ్యాంగం ఆర్టికలఖ 4 ప్రకారం రాష్ట్రాల పునర్విభజన సం దర్భంగా ఉత్పన్నమయ్యే తాత్కాలిక ఇబ్బందుల పైనా, పర్యవ సానాలపైనా తగిన చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటఖకు ఉంది. బీజేపీకి హామీని నిలబెట్టుకోవడం కంటే, టీడీపీకి ఆ హోదా ను సాధించడం కంటే తమ తమ సొంత ఎజెండాలే ముఖ్యమైన ట్టు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టడానికి బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాను కోరుతున్న బిహార్కు త్వరలో ఎన్నికలు జరగబో తున్నాయి. ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ బిహార్ ఎన్నికలలో హోదా ప్రధాన ఎజెండా అవుతుంది. పార్లమెంటఖ ఎన్నికలలో ఢిల్లీలో ఘనవిజయం సాధించిన బీజేపీ తర్వాత జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఇదే బిహార్లోనూ పునరావృతమైతే, అది దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైనట్టు చెప్పే బలమైన సంకేతమవుతుంది. అందుకే హోదాలకు బదులు ప్యాకేజీ నినాదాన్ని తలకెత్తుకుంది. మరోపక్క తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదాను తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఆమెతో దోస్తీకి బీజేపీ బాటలు వేసుకుంది. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుమతి పొంద కుండా కేంద్ర మంత్రులు హోదాపై ప్రకటనలు చేసే వీలులేదు. ప్రత్యేక హోదా రాదని బాబుకు ముందే తెలుసునని టీడీపీ పార్ల మెంటఖ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి ఒక ప్రకటనే చేశారు. అడపా దడపా హోదా అని అంటున్నా, బాబు మనసు మాత్రం ప్యాకేజీ మీదేనని ఆయన స్పందిస్తున్న తీరే తేటతెల్లం చేస్తున్నది. చేసిన వాగ్దానాలు, ఇస్తున్న రాయితీలు, దుబారా అన్నీ కలిపి నెలనెల గండంగా ఉంది. ఇవే తనను గెలిపించిన మంత్రదండాలుగా ఆయన భావిస్తున్నారు. దీనిని సాగించడానికి డబ్బు కావాలి. ప్యా కేజీ ఐతే ఖజానాకు డబ్బుల్ఠస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికీ, ప్రజలకూ ప్రయోజనం. ప్యాకేజీ ప్రభుత్వానికి ప్రయోజనం. అందుకే ప్రత్యేకహోదా కోసం చెప్పే మాటలలో చిత్తశుద్ధి కొరవ డింది. బీజేపీ, టీడీపీలు స్వప్రయోజన రాజకీయాలకు ప్రత్యేక హోదాను బలితీసుకున్నట్టు కనిపిస్తున్నది. వ్యాసకర్త అధ్యక్షులు, డీవీవీఎస్ శర్మ, ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా పార్టీ, మొబైల్ 9866074023