doma konda
-
అల్లం వినాయకుడు
దోమకొండ: నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన గృహిణి అందె లలిత శనివారం అల్లం కొనుగోలు చేయగా, వినాయకుడి ఆకారంలో కనిపించింది. పూర్తిగా వినాయకుడి రూపం పోలి ఉండగా, దానిని అలాగే ఉంచారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు వినాయకుడి రూపంలో ఉన్న అల్లాన్ని చూసేందుకు తరలివచ్చారు. గణపతి రూపం కావడంతో దండాలు పెట్టారు. -
సొంతూరుకి ఎంపీ
దోమకొండ(నిజామాబాద్): తాను పుట్టి పెరిగిన గ్రామంలో మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. వివరాలు... ఎంపీ సొంతూరు అయిన నిజామాద్ జిల్లా దోమకొండ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. గ్రామస్తులను కలిస సమస్యలు అడిగి తెలసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. ఎంపీ ,గ్రామ అభివృద్ధికి కమిటీలు వేశారు.