breaking news
Dokka manikyavaraprasada Rao
-
ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే పల్నాడు అభివృద్ధి
టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యవరప్రసాద్ మాచర్లటౌన్: నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఓ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తేనే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం పట్టణానికి వచ్చిన ఆయన కేసీపీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు స్మార్ట్ జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. పల్నాటి ప్రాంతాభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. పల్నాటి అభివృద్ధి కోసం ఇక్కడి నేతలు సీఎంతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వెనుకబడిన పల్నాడులోని సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ గోపవరపు శ్రీదేవి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
కిరణ్ వెంట ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తాడా ?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని తాను చెప్పలేదని, ప్రెస్ మీట్ మాత్రమే పెడతారనే చెప్పానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వివరణ ఇచ్చారు. సీఎం కిరణ్ ఆదివారం తన సన్నిహితులతో సమావేశం కానున్నరని, ఆ సమావేశంలో కూడా కొత్త పార్టీ పెట్టే విషయంపై ఏమీ తేలదని ఆయన అన్నారు. వారం తర్వాత విస్తృత సమావేశమంటూ కిరణ్ దాటవేశరన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా తనతో వస్తారమోనని కిరణ్ ఎదురుచూస్తున్నారని డొక్క చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి నిరసనగా సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ వాది అయిన రాయపాటి సాంబశివరావు కిరణ్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారని డొక్క తెలిపారు. రాయపాటిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని తాను హైకమాండ్ను కోరుతున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి బహిష్కరనులంతా తమ పరిస్థితి ఏమిటని అంటున్నారని డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు. -
మైండ్గేమ్ ఆడొద్దు
విజయవాడ, న్యూస్లైన్ : మీడియా రాజకీయ నాయకులతో మైండ్గేమ్ ఆడుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు చెప్పారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలో ఏర్పాటుచేసిన 25వ పుస్తక మహోత్సవాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.వైద్యనాథ అయ్యర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మంత్రి మాణిక్య మాట్లాడుతూ.. మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం హడావుడి చేస్తూ, నేతలతో అప్పటికప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడించి ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. పుస్తకాలను చదివి ఆయా అంశాలపై అవగాహనతో మాట్లాడినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. నైతిక విలువలు కలిగి, అవినీతికి దూరంగా ఉండే నేతలు పుస్తకాలు కూడా చదవుతున్నారా.. లేదా గమనించి వారిని గెలిపించాలని సూచించారు. వైద్యనాథ అయ్యర్ మాట్లాడుతూ నూతన సాంకేతిక విప్లవం నేపథ్యంలో పాశ్చాత్యదేశాల్లో పుస్తకపఠనం తగ్గిపోతోుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఆ విధమైన పరిస్థితి లేకున్నా భవిష్యత్లో ఇబ్బంది పడే అవకాశముందన్నారు. ఆన్లైన్ పబ్లిషింగ్ను అధికంగా నిర్వహించాలని, దానికి ప్రభుత్వ సహకారాన్ని అందించాలని సూచించారు. 1989లో తొలి పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి తాను హాజరయినప్పుడు కురిసిన భారీ వర్షం తనకు నేటికీ గుర్తుఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ ఎం.రఘునందన్రావు మాట్లాడుతూ.. పాఠకులకు పుస్తకం ప్రపంచాన్ని చేరువ చేస్తుందన్నారు. విజ్ఞానాన్ని అందించే గొప్ప సాధనం పుస్తకం మాత్రమేనన్నారు. పుస్తక పఠనంతో తమను తాము సంస్కరించుకోవచ్చని చెప్పారు. విజయవాడ పుస్తక మహోత్సం నగరానికే వన్నెతెచ్చిందన్నారు. ఆదాయపు పన్ను కమిషనర్ ఎస్.జయరామన్ మాట్లాడుతూ తన జీవితంలో ఇంత పెద్ద పుస్తక మహోత్సవాన్ని చూడడం ఇదే ప్రథమమన్నారు. కేవలం మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమయ్యే పుస్తక మహోత్సవాలకన్నా అద్భుతంగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గతానికి, వర్తమానానికి పుస్తకాలే వారధులని పేర్కొన్నారు. పుస్తక మహోత్సవం మరింత అభివృద్ధిని అందుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సొసైటీ అధ్యక్షుడు డి.అశోక్కుమార్ మాట్లాడుతూ గడిచిన పాతికేల్లలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచామని, అందుకే ఇంత దూరం ప్రయాణం చేయగలిగామన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందించిన సహకారంతోనే సొసైటీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. తొలుత జయరామన్ ‘అక్షరయాత్ర’ పేరుతో రూపొందించిన 25 సంవత్సరాల సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రావికింది రామస్వామి, ఉపాధ్యక్షులు బి.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.