breaking news
diterjent soap
-
వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!
సాక్షి, ముంబై: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్ఎఫ్ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్ఎఫ్ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో కీలకమైంది. అలాగే ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
దుస్తులపై మరకలు..
దుస్తులపై మరకలు.. దుస్తులపై నూనె మరకలు అయినచోట ఉప్పులో అద్దిన నిమ్మముక్కతో రుద్ది, తర్వాత డిటెర్జెంట్ సోప్తో శుభ్రపరచాలి. ఎండబెట్టిన నిమ్మ తురుమును పొడి చేసి, గాలిచొరబడని జార్లో భద్రపరచాలి. తెల్లని దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్తో పాటు ఈ పొడిని కొద్దిగా కలిపి నానబెట్టాలి. మురికి త్వరగా వదలడమే కాకుండా దుస్తులకు మెరుపులాంటి తెలుపుదనం వస్తుంది. దుస్తులపై టీ మరకలు అయిన చోట చల్లని పాలలో ముంచిన స్పాంజితో రుద్ది, ఆరిన తర్వాత శుభ్రపరచాలి. కంటికింద నలుపు... చర్మం బిగుతు అవడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్లను ముఖానికి వాడుతుంటారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూతా మృదువుగా రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, చర్మం పొడిబారడం తగ్గుతుంది. కంటిచుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు కంటికింద నలుపును దూరం చేస్తాయి. గోరంత పని... పెరిగిన గోళ్లను కత్తిరించడం, గోరు చుట్టూ భాగాన్ని శుభ్రపరచడం వల్ల వేలికొసల్లో అందంగా కనిపిస్తాయి గోళ్లు. గోరువెచ్చని సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకోవాలి. క్యుటికల్ టూల్ సాయంతో గోరు చుట్టూ ఉన్న చిగుళ్లను శుభ్రపరచాలి. చిన్న నెయిల్ క్లిప్పర్తో గోరు చుట్టూ ఉన్న క్యుటికల్స్, గోళ్లు కత్తిరించాలి. యాంటిసెప్టిక్/ యాంటీబయోటిక్ క్రీమ్ ను గోళ్ల చుట్టూ రాయాలి. ఆలివ్ ఆయిల్ని వేలికి అద్దుకుని, గోళ్లపై రాసి, మృదువుగా రబ్ చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా పెరుగు తాయి.