breaking news
Distributed to the employees of the Secretariat
-
మమ్మల్ని తెలంగాణకే కేటాయించండి
కమల నాథన్ కమిటీకి టి.ఉద్యోగుల వినతి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాము పనిచేయలేమని తెలంగాణ సచివాలయ నాలుగో తరగతి ఉద్యోగులు కమలనాథన్ కమిటీకి తేల్చిచెప్పారు. తెలంగాణకు చెందిన తమను ఇక్కడి ప్రభుత్వంలోనే పనిచేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్స్ మినహా నాలుగో తరగతి ఉద్యోగులకు ఆప్షన్లకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో నాలుగో తరగతి ఉద్యోగులు శనివారం నోటికి నల్లగుడ్డలు ధరించి సీ బ్లాక్ వద్ద నిరసన తెలిపారు. నంతరం కమలనాథన్ కమిటీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన సుమారు 625 మంది నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని, ఈ విషయంలో కనీసం తమ వాదన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే తమ వినతిని పరిశీలించాలని వారు కమలనాథన్ కమిటీని కోరారు. -
200 మంది ఉద్యోగులు గాలిలో..
సచివాలయంలో వింత పరిస్థితి వారిని ఏ రాష్ట్రానికి కేటాయించని కేంద్రం సాధారణ పరిపాలన శాఖ నిర్వాకమే కారణం తెలంగాణకు చెందిన వారినీ ఆ రాష్ట్రానికి కేటాయించలేదు హైదరాబాద్:కేం రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల పంపిణీ విషయంలో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ నిర్వాకం కారణంగా చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఎటూ తేలకుండా గాలిలో ఉన్నట్లుంది .కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన జారీ చేసిన ఉద్యోగుల పంపిణీ ఆదేశాల్లో సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగుల పేర్లు లేవు. తెలంగాణకు చెందిన ఉద్యోగులను కూడా ఆ రాష్ట్రానికి కేటాయించలేదు. రాష్ట్ర ప్రణాళికా శాఖలో డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారులతో పాటు మొత్తం 30 మంది పరిస్థితి ఇలానే ఉంది. మున్సిపల్ శాఖలోను, అలాగే సచివాలయంలోని పలు శాఖల్లో రికార్డు అసిస్టెంట్లను ఏ రాష్ట్రానికి కేటాయించకుండా వదిలేశారు. దీంతో తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ విషయంపై ఆర్థిక శాఖను సంప్రదించగా కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని బదులిస్తున్నారు. సర్వీసెస్ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ ఉద్యోగులు ఇలా మధ్యస్థంగా మిగిలిపోయారనే విమర్శ వినిపిస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు సచివాలయంలో రెగ్యులర్గా పనిచేయడానికి వీలుంది. అయితే ఇలాంటి అధికారులు, ఉద్యోగులను డిప్యుటేషన్ పేరుతో సాధారణ పరిపాలన శాఖ కేంద్రానికి జాబితా పంపడం వల్లే ఆ అధికారులు, ఉద్యోగులను పంపిణీ చేయలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్లీ తప్పును సరిచేసి జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉందని, అప్పుడే ఆ ఉద్యోగులు, అధికారులను పంపిణీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరికీ పంపిణీ చేయని అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఉంటారనేది ఆంధ్రప్రదేవ్ పునర్ విభజన - 2014 చట్టం చెపుతోంది. సర్వీసెస్ అధికారుల నిర్వాకం వల్లే తెలంగాణ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి పంపిణీ చేయలేదని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.