breaking news
digivijay singh
-
రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభం.. దిద్దుబాటలో డిగ్గీరాజా
రాష్ట్ర కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్సింగ్ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ తీరును నిరసిస్తూ పలువురు సీనియర్లు పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలను దిగ్విజయ్కు సమర్పించారని, కోవర్టులంటూ జరిగిన ప్రచారం, కమిటీల్లో ప్రాధాన్యంపై ఫిర్యాదు చేశారనే సమాచారం ఓవైపు.. ఇదే సమయంలో రేవంత్ వల్ల రాష్ట్ర పార్టీలో ఊపు వచ్చిందంటూ ఆయనను సమర్థించే నేతలు వివరించారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపాయి. అసలు దిగ్విజయ్ ఏ సమాచారం సేకరించారు, అధిష్టానానికి ఏం చెబుతారన్నది హాట్ టాపిక్గా మారింది. గాంధీభవన్లో డిగ్గీరాజా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. ఉస్మానియా విద్యార్థి నేతలు చేసిన రచ్చ, దానిపై దిగ్విజయ్ ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం కూడా పలువురు నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. మీడియా సమావేశంలో ఏం చెప్తారోనని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పది గంటలు.. సుదీర్ఘ భేటీలు బుధవారం రాత్రే హైదరాబాద్కు వచ్చిన దిగ్విజయ్సింగ్ను కొందరు నేతలు ఉదయమే హోటల్ వద్ద కలిసి మాట్లాడారు. తర్వాత గాంధీభవన్లో సీనియర్లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల వరకు.. అంటే దాదాపు పది గంటల పాటు విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీలో పరిణామాలు, చక్కదిద్దే చర్యలపై అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థి నేతల రచ్చ.. దిగ్విజయ్ పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్న సమయంలోనే ఓయూ విద్యార్థి నేతలు తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గాంధీభవన్ వద్ద నినాదాలు చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరికొందరు నాయకులకు.. విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీనిపై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటు బ్యాంకు కోసమే వర్గీకరణ
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఒక వర్గం వారి ఓటు బ్యాంకు కోసం అగ్రవర్ణ పార్టీలు దళితులను విభజించి పాలించాలని చూస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పిస్తే వారు మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడి ఉద్యోగాలు పొందుతారని, ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించినా నిరుపయోగమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ పని చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం దళితులను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. దళితులను విభజించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను కలసి వినతి పత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిచినట్టు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాల మహానడు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.