breaking news
Digital Detox
-
ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు!
నేడు జీవితం మొత్తం స్మార్ట్ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్ స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది. ఇదే ఇపుడు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ అద్భుతమైన ఆలోచనకు నాంది పలికింది. పిల్లలను, యువతను డిజిటల్ స్క్రీన్నుంచి బయటపడవేసే మహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ నిర్ణయం ఇపుడు అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తూ, ఆ గ్రామం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చేస్తోంది.మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న అగ్రాన్ దుల్గావ్ (Agran Dhulgaon) అనే ఒక చిన్న గ్రామం డిజిటల్ స్క్రీన్ వినియోగంపై పరిమితులను విధించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు డిజిటల్ స్క్రీన్కి దూరంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే నిర్ణయించారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి మొత్తంగా ఒక రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.నిర్ణీత సమయానికి గ్రామంలో ఒక సైరన్ (Siren) మోగుతుంది. ఆ సైరన్ వినగానే అందరూ తమ మొబైల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పక్కన పెట్టేస్తారు. ఈ డిజిటల్ అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలని, వారు ప్రతిరోజు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించేలా ఈ నిబంధనను తీసుకువచ్చారు.ఈ డిజిటల్ డిటాక్స్ (Digital Detox) నిర్ణయం గ్రామంలో ఎంత అద్భుతమైన ఫలితాల్ని తీసుకు వచ్చిందంటే... ఏకంగా ఆ గ్రామంలోని 53 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్లను గెలుచుకునేంతగా... మరికొంత మంది విద్యార్థులు యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ట్రెండ్సెట్టర్ సీతారామన్! -
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
మీరు గుడి గంటలు విని ఉంటారు.. లేదంటే బడి గంటలు! మరి.. చదువు గంటలు! ఇవి వినాలంటే మాత్రం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా హలగా గ్రామానికి వెళ్లాల్సిందే!.ఈ కాలపు పిల్లలు అందరిలో సామాన్యమైన విషయం ఒకటుంది. మీరెప్పుడైనా గుర్తించారా? అదేనండి.. పొద్దస్తమానం మొబైల్ఫోన్ పట్టుకుని ఉండటం. ‘‘ఈ పిల్లలు ఎంత చెప్పినా వినరు’’.. ‘‘చదువుకోమంటే.. రీల్స్ చూస్తూ గడిపేస్తారు’’ అని తిట్టని తల్లిదండ్రులుండరు. ఇంటికొస్తే కనీసం మాట్లాడకుండా ఆ ఫోన్ చూస్తూండటం ఏమిటని సణుక్కోని బంధువూ ఉండడు. అయినా సరే.. ఈ మొబైల్ ఫోన్ జాడ్యం పిల్లల్ని వదిలిపోనంటుంది. అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హలగా గ్రామ ప్రజలు కలిసికట్టుగా తీసుకున్న ఒక నిర్ణయం అక్కడి పిల్లల భవిష్యత్తును మార్చేస్తేంది. మంచికే లెండి!.హలగా గ్రామ జనాభా సుమారుగా 8500 మాత్రమే. చాలా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. అయితే బయటి ప్రపంచం ప్రభావమో.. ఇంకోటో తెలియదు కానీ.. వీళ్లు కూడా మొబైల్ ఫోన్ లేదంటే టీవీలకు అతుక్కుపోయేవారు. చదువుతోపాటు వారి ఏకాగ్రత కూడా దెబ్బతింటూ వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ పెద్దలు ఇక లాభం లేదనుకున్నారు. చెక్ పెట్టాల్సిందేనని తీర్మానం చేసుకున్నారు. పంచాయితీ పెట్టి.. గ్రామస్తులందరితోనూ చర్చించి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.What a meaningful behavioural change! Halaga village in Belagavi practises a two-hour digital detox every evening. This can significantly enhance connections with family and friends and improve sleep quality. Such positive behavioural shifts should be encouraged during… pic.twitter.com/PrdY5HLlrc— Shreyas S P (@sp_shreyas_) December 24, 2025రోజూ రెండు గంటలు...గ్రామస్తుల నిర్ణయం గత నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం కచ్చితంగా ఏడు గంటలకు గ్రామంలో ఒక సైరన్ మోగింది. అంతే.. ముందుగా అనుకున్నట్లు పిల్లలు అందరూ అలర్ట్ అయిపోయారు. మొబైల్ఫోన్లు, టీవీలు వదిలేశారు. ఆటపాటలూ కట్టిపెట్టి బుద్ధిగా పుస్తకాలు పట్టుకున్నారు. ‘‘రెండు గంటలపాటు కచ్చితంగా చదువుకోవాలి’’ అన్న గ్రామస్తుల నిర్ణయం.. సైరన్ మోతల ప్రభావం అన్నమాట. మోడర్న్ భాషలో చెప్పాలంటే.. ఆ గ్రామస్తులు పిల్లలకు ‘డిజిటల్ డీటాక్స్’ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటలకు సైరన్ మోగడం.. పిల్లలు చదువు బాట పట్టడం సాగిపోతోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లు కూడా టీవీలు బంద్ పెట్టాలి. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో మొదలైన ‘డిజిటల్ ఆఫ్’ ప్రయోగమే హలగాలోనూ మొదలైనట్లు వార్తా పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది.మళ్లీ మునుపటి రోజులు...టీవీ, ఫోన్లు లేని సమయాల్లో పొద్దుపోయాక గ్రామాల్లో మాటల వెలుగులు విరబూసేవి. పల్లె నడిబొడ్డున ఉండే రచ్చబండ వద్దో లేక ఇళ్ల చావిళ్లలోనో బోలెడన్ని ముచ్చట్లు గలగల పారేవి. ‘చదువు సైరన్’ మొదలైన తరువాత హలగాలోనూ ఇదే సందడి కనిపిస్తోందంటున్నారు. పిల్లల చదువులకు అంతరాయం కలక్కుండా తల్లిదండ్రులు కూడా ఫోన్, టీవీలను కట్టేస్తూండటంతో మాట్లాడుకోవడం ఎక్కువైంది. ఇది బాంధవ్యాలను మరింత పెంచేదే. పైగా స్క్రీన్టైమ్ తగ్గిపోవడంతో.. అది కూడా నిద్రకు కొంచెం ముందు కావడంతో పిల్లలు గాఢంగా నిద్రపోగలుగుతునారు. ఇది కాస్తా వారు బడుల్లో ఏకాగ్రతతో ఉండేందుకు, చురుకుగా ఆలోచించేందుకూ ఉపయోగపడుతోంది. ఈ ట్రెండ్ ఒక్క హలగాలోనే కాదు.. ప్రతి ఊళ్లోనూ కనిపించాలని కోరుకుందాం.సాక్షి.కాం తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! - గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ న్యూస్ ఎడిటర్. -
ఫిక్స్.. డిజిటల్ డిటాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాల్లో సరికొత్తగా ఒకటి వచ్చి చేరింది. జిమ్కు వెళ్లాలి, డైట్ ఫాలో కావాలి, టైమ్ మేనేజ్మెంట్ చేయాలి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి తదిరాలన్నీ గతం నుంచి ఉంటూ వచ్చేవి. కానీ 2024లో మాత్రం అలాంటి తీర్మానాల వరుసలో డిజిటల్ డిటాక్స్ వచ్చింది. విపరీతంగా ఎల్రక్టానిక్ డివైజ్లకు అలవాటు పడుతూ రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్న పలువురు వైద్యుల సూచనల ప్రకారం దీనిని తమ తీర్మానాల జాబితాలో ప్రధానంగా చేర్చినట్టు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలా డిజిటల్ డిటాక్స్ను తీర్మానంగా ఎంచుకున్నవారు లక్ష్యాన్ని సాధించేందుకు గాను వైద్యులు చేస్తున్న సూచనలివీ.. ► సినిమాలు ఇతర వినోదాలకు ఇంట్లో టీవీలు, ఆఫీసు పనిలో భాగంగా డెస్క్టాప్/ ల్యాప్టాప్, సోషల్ మీడియా వగైరాలకు స్మార్ట్ ఫోన్స్...ఇలా స్క్రీన్ వీక్షణ తగ్గించాలి. ► దీని కోసం ఆయా డిజిటల్ పరికరాల వినియోగం నుంచి క్రమం తప్పని విరామం తీసుకోవాలి. ► మొబైల్ను అవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలి. ► తప్పనిసరి అయ్యి లేదా అనుకోకుండానో ఒక రోజులో ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలతో గడిపితే ఆ మరుసటి రోజు అంతకు రెట్టింపు సమయం వాటి నుంచి విరామం తీసుకోవాలి. ► ప్రతీ రోజూ నిద్రకు ముందు నిద్ర నుంచి లేచిన తర్వాత నిర్ణీత వేళలు నిర్ణయించుకుని స్కీన్ర్కు దూరంగా ఉండాలి. ► స్కీన్స్ర్తో సంబంధం లేని కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఒక రోజు సంపూర్ణంగా ‘డిజిటల్ డిటాక్స్’రోజుగా పరిగణించాలి. -
డిజిటల్ సర్పం.. విషానికి విరుగుడు
పదిమంది గుమిగూడే స్థలం... అంటే బస్టాప్, రైల్వేస్టేషన్, ఆఖరికి పార్కులకు వచ్చేవారిలో కూడా చాలామంది మొబైల్లోనో, ట్యాబ్లోనో తలలు దూర్చి కనిపిస్తారు. అవసరం మేరకు ఉపయోగించడానికి బదులుగా, అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ స్క్రీన్కు అతుక్కుపోవడాన్ని ‘డిజిటల్ అడిక్షన్’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విషపదార్థాలను మెదడులోకి నింపుకోవడమేననీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆ వివరాలివి... పిల్లలతో పాటు పెద్దలు సైతం మొబైల్స్నూ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిని వాడుతుంటారు. అయితే వారు పెద్దవాళ్లు కావడంతో కుటుంబ బాధ్యతలకూ, ఆఫీసు పనుల కోసం స్క్రీన్ నుంచి ముఖం తప్పించడం తప్పదు. స్క్రీన్కు అతుక్కుపోవడం టీన్స్లో ఎక్కువ... పిల్లల్లో అందునా టీనేజీ పిల్లల్లో ‘స్క్రీన్’ పట్ల అడిక్షన్ ఎక్కువ. తమ చదువుల కోసం, కాలేజీల్లో ఇచ్చే టాస్కులు, ప్రాజెక్టుల కంటే ఎక్కువగా సరదా అంశాలూ, సినిమాలు, గాసిప్స్ కోసమే స్క్రీన్ టైమ్ను వెచ్చిస్తుంటారు. అంతకంటే చిన్న పిల్లల్లోనూ... ఇక టీన్స్లోకి రాని ఎనిమిది, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల పిల్లలు సైతం డెస్క్టాప్, ల్యాప్టాప్ల్లో తలను ముంచేస్తారు. ఆఖరికి బయటికి వచ్చినప్పుడు కూడా మొబైల్లో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ‘మొబైల్స్’ను వాళ్ల చేతికి అందిస్తుంటారు. అదే అలవాటు వాళ్లు టీన్స్లోకి వచ్చాక మరీ ముదిరిపోతుంది. ఓ వయసుకు చేరేనాటికి అది ‘డిజిటల్ అడిక్షన్’గా మారిపోతుంది. దీని వల్ల వచ్చే మానసిక సమస్యల విశ్వరూపాల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మొబైల్లో గేమ్స్ ఆడవద్దన్నందుకు తల్లిదండ్రులతో పోట్లాటలు దగ్గర్నుంచి ఆత్మహత్యల వరకు ఈ దుష్పరిణామాలెన్నో. డిజిటల్ అడిక్షన్ను గుర్తించడమెలా? స్క్రీన్ ముందు చాలాసేపు గడపడం: సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తే చాలాసేపు గడపడం. దాంతో చదువూ, హోమ్వర్క్, వ్యాయామం, ఫ్రెండ్స్తో కలవడం వంటి కార్యకలాపాలకు దూరమవుతుంటారు. స్క్రీన్ ముందు నుంచి తప్పించడం చాలా కష్టం కావడం: పిల్లల చేతుల్లోంచి స్మార్ట్ఫోన్ లాగేసుకున్నా లేదా కంప్యూటర్ ఆఫ్ చేయమన్నా వాళ్లకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. బలవంతంగా మొబైల్ లాగేసినా లేదా కంప్యూటర్ ఆఫ్ చేసినా కోపం రగిలిపోవడంతో పాటు చేతుల్లో ఉన్న వస్తువుల్ని విసిరేసి, వైల్డ్గా ప్రవర్తిస్తుంటారు. రోజువారీ పనుల్ని పూర్తి చేయకపోవడం: తాము రోజూ చేయాల్సిన క్లాస్వర్క్గానీ లేదా హోమ్వర్క్గానీ చేయకుండా వదిలేస్తారు. ఈ పెండింగ్వర్క్ను తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు అతిగా ఆందోళనపడుతుంటారు. ఒంటరిగా ఉండటం: వీరు స్మార్ట్ఫోన్లోని యాప్స్తో తప్ప ఇతరులతో కమ్యూనికేషన్లో ఉండరు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేనిపట్లా ఆసక్తితో ఉండరు సరికదా... గతంలో వారికి ఇష్టమైన పెయింటింగ్ లాంటి అభిరుచులకు దూరంగానూ, అనాసక్తితో ఉంటారు. మూడ్ స్వింగ్స్ : తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతుండటం, దేని పట్లా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు త్వరత్వరగా వారి మూడ్స్మారిపోతుండటం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అంతేకాదు... వారి ప్రవర్తన గమనించి పెద్దవాళ్లు ఫోన్ తీసుకోబోతుంటే దాన్ని దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివీ చేస్తారు. చక్కదిద్దడానికి చిట్కాలివి... పిల్లలు అవసరానికి మించి ‘స్క్రీన్’ను వాడటాన్ని తగ్గించేలా చేయడం ఎలాగో మానసిక నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలివి... ముందు మారాల్సింది పేరెంట్సే: చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్తో చాలా సేపు గడుపుతూ... తమ పిల్లలు మాత్రం వాటికి దూరంగా, క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు. ఈ విషయంలో ముందుగా మారాల్సిందీ, పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిందే తల్లిదండ్రులే. ఒకేసారి లాగేయకండి: అడిక్షన్కు లోనైన పిల్లల నుంచి స్మార్ట్ఫోన్ /ల్యాప్టాప్ను ఒకేసారి లాగేయకండి. స్విచ్నొక్కినట్టుగా పిల్లలు మారిపోరు. వారు రోజూ డిజిటల్ డివైజ్తో ఎంత టైమ్ను గడపదలచుకున్నారో వారినే నిర్ణయించుకొమ్మని సూచించండి. నిర్దిష్టంగా ఆ టైమ్లో వాళ్లను స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్తో ఆడుకోనివ్వండి. క్రమంగా ఆ టైమ్ను తగ్గిస్తూ రావాలి తప్ప ఠక్కున మారిపోవడం అంటూ జరగదు. పైగా అలా చేయడం ఇంకా మరికొన్ని దుష్పరిణామాలు దారితీస్తుంది. స్నేహితుల్ని వ్యక్తిగతంగా కలవమనడం: స్నేహితుల్ని ఫోన్లో లేదా వాట్సాప్లో పలకరించడానికి బదులు వ్యక్తిగతంగా కలిసి రమ్మనీ, కలిసి ఆడుకొమ్మని ప్రోత్సహించాలి. అంతేకాదు... పెళ్లిళ్లు, పండుగల వంటి సమయాల్లో వ్యక్తుల్ని, బంధువుల్ని ప్రత్యక్షంగా కలవమని, సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం ఎంత అవసరమో చెప్పాలి. వారీ అలవాటు నుంచి బయటకు వచ్చాక... డిజిటల్ ఉపకరణాలవల్ల వారు కోల్పోబోయిన అంశాలు, వాటి వల్ల కలిగిన నష్టాలతో పాటు... డీ–టాక్సికేషన్ తర్వాత ఇప్పుడు వారికి ఒనగూరిన/ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించవచ్చు. అప్పుడు వారు డిజిటల్ ఉపకరణాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో తెలుసు కుంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తారు. (క్లిక్ చేయండి: సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..) డిజిటల్ ఉపకరణాల దుష్ప్రభావాలు నిద్రలేమి, తరచు నిద్రాభంగం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం (లో సెల్ఫ్ ఎస్టీమ్), తరచు తలనొప్పులు, ఒకేచోట కూర్చుని అదేపనిగా గేమ్స్ ఆడుతుండటం వల్ల ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటి అనేక రూపాల్లో కనిపిస్తాయి. అందుకే వీటిని మనకు ఉపయోగపడే మేరకే విచక్షణతో, తెలివిగా వాడుతూ... వీటికి అడిక్ట్ కావడం నుంచి క్రమంగా బయటపడాలి. - డాక్టర్ చరణ్తేజ కోగంటి సీనియర్ సైకియాట్రిస్ట్


