breaking news
Dharma Parishad
-
వీలునామాలకు ఆస్కారంలేదు
బ్రహ్మంగారి మఠం: బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారంలేదని ఆయన తేల్చిచెప్పారు. ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్కు నివేదిక ఇస్తామన్నారు. మఠాధిపతి మృతిపై అనుమానాలు ఇదిలా ఉంటే.. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఘనంగా ‘మనగుడి’
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్లైన్ : దేవాదాయ ధర్మదాయశాఖ, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన శ్రావణ పౌర్ణమిరోజున భక్తులు ఆల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వరస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేంకటేశ్వర సహస్త్రనామార్చన లు, గోవిందనామస్మరణ గావించారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ, అడిషనల్ జడ్జిసునిత, ఫ్యామిలీ కోర్టు జడ్జి జైరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సంప్రదాయాలు పాటిస్తూ మానవ విలువలు కాపాడాలన్నారు. ఆధ్యాత్మిక భావాలు పెంపొం దించుకొని తోటివారికి చేయూతనివ్వాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నాయకులు వారిని ఘనంగా సన్మానించి, వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను అందించారు. శ్రీవారి కంకణాలు కట్టుకున్నారు. ఎస్బీహెచ్ ఏజీఎం రవింధ్రనాథ్ ఠాగూర్, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, కొండయ్యచౌదరి,బండారి దేవన్న పాల్గొన్నారు. మంగమఠంలో.. పట్టణంలోని మంగమఠంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చన జరిపారు. అంతకు ముందు మార్వాడి ధర్మశాలనుంచి సత్యనారాయణ స్వామి, రమాదేవీల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చా రు. వీటిని శాస్త్రీమందిర్, అశోక్రోడ్, గోపాలకృష్ణ మఠం మీదుగా మంగమఠానికి తీసుకొచ్చారు. ఓ దాత స్వామివారికి వెండి కిరీటం బహూకరించారు. కంకణధారణ చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు దేవీదాస్, వె ంకట్రెడ్డి, సత్యనారాయణగౌడ్, సాగర్గౌడ్, రమేశ్, మ హేశ్, పవన్గుజరాతీ, ఈవో రవి పాల్గొన్నారు. గోపాలకృష్ణ మఠంలో.. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మనగుడిలో భాగంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మఠాధిపతి యోగానంద సరస్వతీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణ, అడిషనల్ జడ్జీ సునిత, ఫ్యామీలీకోర్టు జడ్జీ జైరాజు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ శ్రీవారి పాదాలనుంచి తెచ్చిన కంకణాలు, అంక్షింతలు, పసుపుకుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీలు కట్టారు. అభిషేకాలు అర్చనలు చేశారు. మఠం ఆవరణలోని రేణుకామాత ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజారాం, బండారి దేవన్న, కొండయ్య చౌదరి పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో.. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని క్రాంతినగర్, శాంతినగర్, టీచర్స్ కాలనీల్లోని సాయిబాబా ఆలయంలో,తిర్పెల్లి, హౌసింగ్ బోర్డు రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.మార్కెట్లోనూ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దుకాణాలు రాఖీలు కొనుగోలుతో కిటకిటలాడాయి.