-
చనిపోయి వచ్చిన జవానుకు మళ్లీ అదే కోరిక
డెహ్రాడూన్: తనకు మరోసారి మాతృదేశానికి సేవలు అందించాలని ఉందని ధరమ్ వీర్ సింగ్ అన్నారు. గత పరిస్థితులు ఎలా ఉన్నా తనకు ఆర్మీలో చేరడమే ఇష్టమని ఆయన చెప్పారు. భారత సైన్యంలో పనిచేస్తున్న ధరమ్ 2009లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో మూడేళ్ల తర్వాత అతడు చనిపోయినట్లు ఆర్మీ కూడా కుటుంబానికి ధ్రువపత్రం ఇచ్చి పెన్షన్ కూడా మంజూరు చేసింది. అయితే, అందరు అవాక్కయ్యేలా ధరమ్ వీర్ ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రాణాలతో తన ఇళ్లు చేరాడు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రమాద వివరాల గురించి ప్రశ్నించగా 'అది 2009, నవంబర్ 27. సరిగ్గా రాత్రి 11.30గంటల ప్రాంతంలో చక్రతా రోడ్డులో ఉన్నాం. ఓ కారు ఢీ ప్రమాదం నుంచి తప్పించే క్రమంలో నేను నడుపుతున్న వాహనం తీవ్ర ప్రమాదానికి గురైంది. ఢీవైడర్ ను ఢీకొట్టింది. నేను తీవ్రంగా గాయపడ్డానని మాత్రం గుర్తుంది. ఆ తర్వాత నేను హరిద్వార్లోకి ఎలా వెళ్లానో తెలియదు. ఒక బైక్ ప్రమాదం ద్వారా మాత్రం తిరిగి నాకు జ్ఞాపకశక్తి వచ్చింది. ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే భారత ఆర్మీలోకి వెళ్లి నా సేవలు అందించాలని అనుకుంటున్నాను' అని చెప్పాడు. -
‘మరణించిన’ జవాన్ ఇంటికొస్తే..!
న్యూఢిల్లీ: మన సినిమాలకు మించిన స్క్రిప్ట్ ఇది. ఏడేళ్ల క్రితం చనిపోయాడనుకున్న జవాన్ బతికొచ్చాడు. ఆర్మీ సైతం అతడు చనిపోయాడని మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీచేయగా, అతడు అర్ధరాత్రి అనూహ్యంగా ఇంటికొచ్చి తలుపుతట్టాడు. అతడి పేరు ధరమ్వీర్సింగ్. వయసు 39. డెహ్రాడూన్లోని 66వ రెజిమెంట్లో జవాన్. 2009లో విధి నిర్వహణ నిమిత్తం మరో ఇద్దరు తోటి జవాన్లతో కలసి ట్రక్కులో వెళ్తుండగా వాహనం బోల్తాకొట్టింది. అతడితో సహా ఎవరి జాడ తెలియలేదు. మూడేళ్లపాటు గాలింపు చేసిన ఆర్మీ.. వారు మరణించినట్లు ప్రకటించింది. అతడి కుటుంబానికి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. ఫించన్ మంజూరు చేసింది. డెహ్రాడూన్లో జరిగిన ప్రమాదంలో ధరమ్వీర్ మతిభ్రమించి అక్కడి కొండల్లో పిచ్చివాడిగా తిరిగాడు. అయితే ఇటీవల అతడిని ఒక బైక్ ఢీకొట్టింది. గట్టి దెబ్బలు తగిలినా అదృష్టవశాత్తు కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది. పాత విషయాలన్నీ సినిమా రీల్ తిప్పినట్లు గుర్తొచ్చాయి. బైక్తో ఢీకొట్టిన వ్యక్తి అతడిని ఆస్పత్రిలో చేర్చి రూ.500 ఇచ్చాడు. దీంతో ఢిల్లీకి టికెట్ తీసుకొని అక్కడి నుంచి అల్వార్ సమీపంలోని స్వగ్రామం భితెడాకు వచ్చాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపు తట్టగా, ధరమ్వీర్ తండ్రి తలుపు తీశాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఉద్వేగంతో కొడుకును అమాంతం కౌగిలించుకున్నాడు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. మా కుటుంబ సభ్యులందరినీ చూసిన ఆనందంలో మాటలురాలేదు’ అని ధరమ్వీర్ చెప్పాడు. -
చనిపోయిన జవాను ఏడేళ్ల తర్వాత తిరిగొస్తే..
న్యూఢిల్లీ: దేవుడి ఆటముందు మన ఆట ఎంత? అనే మాట సహజంగా అప్పుడప్పుడు వింటుంటాం. ఆయన ఇచ్చే ట్విస్టులు కూడా మాములుగా ఉండవని చెబుతుంటాం. ఓ ఆర్మీ జవాను జీవింతంలో జరిగిన ఈ విషయం చూస్తే మాత్రం నిజంగానే దేవుడు గొప్ప స్క్రిప్ట్ రైటరేమో అనిపిస్తుంది కూడా. ఊహించని ట్విస్టులతో సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఈ విషయం వింటే సినిమా కథగా పెట్టుకొని హిట్ కొట్టడం ఖాయం. చనిపోయాడని అనుకున్న ఓ ఆర్మీ జవాను తిరిగి బతికొచ్చాడు. భారత ఆర్మీ సైతం అతడి చనిపోయాడని ప్రకటించగా ఏడేళ్ల తర్వాత అబ్బురపడేలా అతడు సురక్షితంగా వచ్చి తన ఇంటి తలుపుకొట్టాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడి పేరు ధరమ్ వీర్ సింగ్. డెహ్రాడూన్లోని 66వ సాయుధ రెజిమెంట్ దళంలో డ్రైవింగ్ జవానుగా పనిచేసేవాడు. 2009లో తన తోటి జవాన్లతో కలిసి ట్రక్కులో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ వాహనం కొండల్లో నుంచి పడిపోయింది. అతడితో సహా ఏ ఒక్కరి జాడ తెలియలేదు. ఆఖరికి వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు. అలా మూడేళ్లు వెతికిన తర్వాత వారంతా చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. అయితే, ఆ ప్రమాదానికి గురైన ధరమ్ వీర్.. గాయాలపాలయ్యాడు. ఆ ప్రమాదం కారణంగా మతిభ్రమించింది. దీంతో డెహ్రాడూన్ కొండల్లోనే చుట్టుపక్కల పిచ్చివాడిలా తిరిగాడు. అయితే, ఈ మధ్యే అతడిని ఓ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో అదృష్టవశాత్తు పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది. ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అతడికి రూ.500 ఇవ్వడంతో వాటిని తీసుకొని తొలుత ఢిల్లీ వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి అల్వార్కు సమీపంలోని బిటెడా అనే గ్రామానికి చేరుకున్నాడు. రాత్రి పూట ఇంటికెళ్లి తలుపుకొట్టగా తండ్రి వచ్చి తీశాడు. అలా చనిపోయాడనుకున్న తన కుమారుడు తిరిగి కనిపించడంతో అతడు ఓ క్షణంపాటు ఖిన్నుడయ్యాడు. వెంటనే తేరుకుని ఆనందభాష్పాలతో అతడిని హత్తుకున్నాడు. ఇంట్లో మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కుమార్తెలను గుర్తుపట్టేందుకు ధర్మేందర్ చాలా కష్టపడ్డాడు. సోదరులు, బంధువులు అతడి రాకపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వైద్య చికిత్సల కోసం ప్రస్తుతం అతడిని జైపూర్ తీసుకెళ్లారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
SRH: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
తప్పక చదవండి
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement