breaking news
Dhanapal
-
బహిరంగ చర్చకు వస్తానని అంటున్న ధన్ పాల్
-
మళ్లీ వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు
చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడుకుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే సిద్దమైంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ను కలిసిన డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి నోటీసులు అందజేశారు. అయితే ఈ నోటీసులు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో తాము అవిశ్వాసం పెట్టినప్పటితో పోల్చితే శాసనసభలో ఇరు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యలో చాలా మార్పు కన్పిస్తుందని డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. టీటీవీ దినకరన్కు మద్దతు తెలుపుతున్న అధికార అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం కారణంగానే డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.18 అసెంబ్లీ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నెల 18న పోలింగ్ ముగియగా.. మిగిలిన నాలుగు స్థానాలకు మే 19న పోలింగ్ జరగనుంది. ఒకవేళ ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాగా, 2017 మార్చిలో కూడా డీఎంకే, ధన్పాల్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 122 మంది, అనుకూలంగా 97 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో అది వీగిపోయింది. -
ప్రమాణ స్వీకారం..
► కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం ► మంత్రుల శుభాకాంక్షలు సాక్షి, చెన్నై: కొత్త ఎమ్మెల్యేలు ముగ్గురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేరుుంచా రు. కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరి నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి నెల్లితోపులో ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి విజయం సాధించారు. ఫలితాల మరుసటి రోజే ఆయ న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులు తిరుప్పర గుండ్రంలో ఏకే బోసు, అరవకురిచ్చిలో మా జీ మంత్రి సెంథిల్ బాలాజీ, తంజావూరులో రంగస్వామి విజయ ఢంకా మోగించారు. ఎమ్మెల్యేలుగా గెలిచినానంతరం ధ్రువీకరణ పత్రాలతో అపోలో ఆసుపత్రికి చేరుకున్న ఈ ముగ్గురు అక్కడ చికిత్స పొందుతున్న తమ అమ్మ జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నా రు. అమ్మ దర్శనం లభించకున్నా, ఆశీస్సులు దక్కినట్టే భావించి వెలుపలకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి వారం రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు మంగళవారం ప్రమాణ స్వీకారానికి చర్యలు తీసుకోవడంతో అసెంబ్లీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం కొత్త ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ స్పీకర్ ధనపాల్ కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేరుుంచారు. తొలుత సెంథిల్ బాలాజీ, తదుపరి రంగస్వామి, చివరగా ఏకే బోసు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురికి ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, పి.తంగమణి, ఎస్పి.వేలుమణి, డి జయకుమార్, సెల్లూరు కే రాజులతో పాటు మరి కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ శుభాకాంక్షలు తెలియజేశారు.