breaking news
dgca report
-
ఎయిర్ ఇండియాకు మరో షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా ఫెసిలిటీలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసినట్టు సమాచారం. తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబైలోని ఎయిర్ ఇండియా కేంద్రంలో బోయింగ్ పైలట్లకు శిక్షణ కార్యకలాపాలను డీజీసీఏ నిలిపివేసిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. డీజీసీఏ నిర్ణయంతో ఎయిర్ ఇండియాకు నిర్వహణ సవాళ్లు ఎదురు కానున్నాయి. న్యారో బాడీ, వైడ్ బాడీ విమాన పైలట్లకు సొంత కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. ముంబై ఫెసిలిటీలో బోయింగ్ 777, బీ787 ఎయిర్క్రాఫ్టŠస్, హైదరాబాద్ కేంద్రంలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తున్నారు. -
టైముకు రాదు.. రీఫండ్ చేయరు... వీళ్లతో ఎలా వేగేది ?
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య, రైల్వే బుకింగ్లో వెయిటింగ్ సమస్య అదే ఎయిర్లైన్స్ అయితే ప్రయాణికులకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటూ పొరపాటే. ఎర్రబస్సయినా ఎయిర్బస్ అయినా వాటిలో కామన్ పాయింట్ కస్టమర్లను ఇబ్బంది పడటం. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ఇదే విషయం చెబుతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ 2022 ఫిబ్రవరికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇందులో గతేడాదితో పాటు గత నెలతో పోల్చుతూ ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఏవియేషన్ సెక్టార్ ఎలా చెబుతూ పలు గణాంకాలు ప్రచురించింది. ఇందులో కస్టమర్లు ఏ అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు, విమానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ పలు వివరాలను ప్రకటించింది. రీఫండ్ ఇబ్బందులు డీజీసీఏ ప్రకటించిన వివరాల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా విమాన ప్రయాణికులకు కూడా రీఫండ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. డీజీసీఏకి అందుతున్న ఫిర్యాదుల్లో నూటికి 31 శాతం కేవలం రీఫండ్ సమస్య మీదనే వస్తున్నాయి. వాస్తవానికి ఎయిర్ ట్రావెల్ కస్టమర్లకు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుంది. ట్రావెల్ ఏజెంట్లు మొదలు టిక్కెట్ బుకింగ్ యాప్లు, విమాన సర్వీసు సంస్థలు బాగానే ట్రీట్ చేస్తాయి. కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల విమానం రద్దయినా లేదా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. వాటికి తాలుకు నగదు ప్రయాణికులకు తిరిగి చెల్లించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మంచి విమానం కావాలి రీఫండ్ కంటే ఎక్కువగా విమాన ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న అంశం విమానం గురించి. ఫ్లైట్ చార్జీలు, స్టాఫ్ బిహేవియర్, లగేజ్ లాంటి కీలక అంశాలన్నీ పట్టించుకునే స్థితిలో విమాన ప్రయాణికులు ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన ఫిర్యాదులే విమానం మీద ఉంటున్నాయి. ఆలస్యంగా ప్రయాణించడం మొదలు సీట్లు కంఫర్ట్గా లేకపోవడం వరకు 34 శాతం ఫిర్యాదులు విమానాల మీదే ఉంటున్నాయి. ఇవే ప్రధానం రోజురోజుకి విమానయాన రంగం దేశంలో పుంజుకుంటోంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఉదాన్లాంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఈ తరుణంలో విమాన ప్రయాణికుల్లో దాదాపు 60 శాతానికిపైగా కేవలం విమానాలు(34 శాతం), రీఫండ్(31 శాతం) ఫిర్యాదులు అందుతుండటం శుభపరిణాం కాదని నిపుణులు అంటున్నారు. సర్వీసుల నిర్వాహాణ, నగదు చెల్లింపుల విషయంలో మరింత జాగ్రత్తగా సర్వీస్ ప్రొవైడర్లు వ్యవహరించేలా డీజీసీఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం ఎందుకంటే? ఆలస్యం వల్ల అనేక సార్లు ప్రయాణాలు రద్దవుతుంటాయి. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్లకు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర విమానాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రియాక్షనరీ 58 శాతం ఉంది. అంటే ఎవరైనా ప్రయాణికులు ఆలస్యం రావడం, కనెక్టింగ్ ఫ్లైట్ రాకపోవడం ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మన దగ్గర ఏవియేషన్ సెక్టార్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇదే తరహా పనితీరు ఉంటే నూట నలభై కోట్ల జనాభాలో కనీసం 20 శాతం మంది విమాన ప్రయాణాలు రెగ్యులర్ చేసినా తట్టుకోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. -
పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!
గత కొన్ని రోజులుగా పొగమంచు దట్టంగా ఉందని, అందువల్ల పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయని వింటున్నాం. కానీ, విమానాలు ఆలస్యం కావడానికి అసలు కారణం అది కాదట.. విమానయాన సంస్థలు, వాటిలో పనిచేసే పైలట్లే అందుకు కారణమని డీజీసీఏ చెబుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పొగమంచు కారణంగా దాదాపు 900 విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నయితే ఢిల్లీకి బదులు సమీపంలో ఉన్న వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి వచ్చింది. అయితే.. వాటిలో 811 విమానాలు విజబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే అలా అయ్యిందని ఎయిర్పోర్టు ఆపరేటర్ డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. మరో 97 విమానాలను మాత్రం 50 మీటర్ల స్థాయిలో కూడా విజిబులిటీ లేకపోవడంతో వేరేచోట్ల దించాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు విమానాశ్రయాలతో పాటు విమానాలు కూడా అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలను దించడానికి పైలట్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాగా తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలు దిగేందుకు పొడవైన రన్వేతో పాటు అదనపు పరికరాలు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ విమానయాన సంస్థలు మాత్రం అలా దిగేందుకు వీలున్న విమానాలను, పైలట్లను ఢిల్లీకి ఉపయోగించడం లేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎయరిండియాను డీజీసీఏ ఎక్కువగా తప్పుబట్టింది. 125 మీటర్ల కంటే పైన కూడా విజిబులిటీ ఉంటేనే ఆ విమానాలు దించుతున్నారని లేకపోతే వేరేచోటుకు మళ్లిస్తున్నారని చెప్పింది.