breaking news
devudamma
-
టీడీపీ మహిళా నేత దౌర్జన్యం
సాక్షి, విశాఖ : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు, పార్టీ కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అండదండలతో విశాఖ జిల్లాలో టీడీపీ మహిళానేత, డ్వాక్రా సంఘనేతపై దాడి చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. విశాఖ- పాతనగరంలో డ్వాక్రా గ్రూపులకు దేవుడమ్మ నాయకురాలు. ఆమె గ్రూపులోని సభ్యులను టీడీపీకి చెందిన కొల్లి సింహాచలం అనే మహిళ బెదిరించి తమవైపుకు తిప్పుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తనను అనుచరులతో కొట్టించిందని ఆరోపించింది. ముఖం,వీపుపై పిడిగుద్దులు కొట్టారని,.ఈ విషయాన్ని విశాఖ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ సింహాచలంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు. సింహాచలం నుంచి దేవుడమ్మకు ప్రాణహాని ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సింహాచలం దాడులు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుడమ్మపై దౌర్జన్యం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వివాహిత మహిళ ఆత్మహత్య...
ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాజువాక మండలంలోని అక్కిరెడ్డిపాలెంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్నా వద్ధాటి దేవుడమ్మ(25) ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పని నిమిత్తం నవ్య న్యూలైఫ్ అపార్ట్మెంట్కు వెళ్లింది. అక్కడే యజమాని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానస్పద మృతిగా కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.