breaking news
development of Hyderabad
-
న్యూయార్క్తో పోటీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ జామ్లతో నివాసయోగ్యం కాకుండా పోతున్నాయని.. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకుండా ఉండాలంటే నగర అభివృద్ధితోపాటు మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తొలగించలేని పరిస్థితితో అడవుల్లోకి వెళ్లి మళ్లీ ఆది మానవుల్లా బతకాలా? ఆధునిక నగరంలో అధునాతనంగా జీవించాలా? అన్నది ఆలోచించుకోవాలని కోరారు. నాలుగున్నరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే... ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అద్భుత నగరం రూపుదిద్దుకుంటుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతామని ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట హెచ్ఎండీఏ మైదానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మూసీలో పారిశ్రామిక వ్యర్థాలు, మనుషులు, పశువుల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. అలాంటి మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీలకు కనీస అవగాహన లేదా? హైదరాబాద్ ప్రపంచంతో పోటీపడాలంటే రీజనల్, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రో విస్తరణ అవసరం. వాటికి రూ. లక్షన్నర కోట్లు కావాలి. ఆ నిధులు నాలుగున్నరేళ్లలో ఖర్చు చేస్తే అద్భుత నగరంగా, ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అవుతుంది. ఇందుకు కేంద్రం సహకరించాలి. నగర అభివృద్ధి అంతా కాంగ్రెస్తోనే.. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. నేదురుమల్లి జనార్దన్రెడ్డి హైటెక్సిటీకి శిలాఫలకం వేస్తే... టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నిర్మాణం పూర్తిచేసి ఐటీ కంపెనీలు తెచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ కంపెనీలను కొనసాగించడమేకాక ఔటర్ రింగ్ రోడ్ను, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ను, ఫార్మా కంపెనీలను తెచ్చారు. దీనితో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు పెరిగాయి. పి.జనార్దనరెడ్డి కృషితో నగరానికి తాగునీళ్లు వచ్చాయి. రాష్ట్ర ఖజానాకు 65శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే.. నాటి సీఎంల ముందుచూపుతోనే వస్తోంది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన దాదాపు 40–50 వేల ఎకరాల భూమికిగాను దాదాపు 15 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సహకరించాలి. ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్లు, డెయిరీ, పౌల్ట్రీ, మీట్.. ఇలా అన్ని ఉత్పత్తులు ఒకేచోటికి తెస్తాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. గప్పాలతోనే పదేళ్లు గడిపారు గత ప్రభుత్వంలో సీఎం గప్పాలతోనే పదేళ్లు గడిపారు. హుస్సేన్సాగర్ను శుద్ధిచేస్తామని మురికికూపంగా మార్చారు. ఆ పార్టీ వాళ్లు సెల్ఫీలు తీసుకునే, ట్విట్టర్లో పెట్టుకునే శిల్పారామం, ట్యాంక్బండ్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని విష ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ఉన్న 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంటే.. తమ ప్రభుత్వం వచ్చాక అదే సమయంలో 29శాతం అభివృద్ధిని రియల్ ఎస్టేట్ రంగం సాధించింది. మంచి చెబితే అమలు చేస్తాం బీఆర్ఎస్ గతంలో చేసింది అంతా అప్పులు, తప్పులే. అధికారం పోయాక జ్ఞానోదయమై ఏవైనా సూచనలు చేస్తామంటే అభ్యంతరం లేదు. మేం చేసేది నచ్చకపోతే... వారి విధానాలేమిటో, ఎన్ని నిధులు అవసరమో చెప్పాలి. అవి సహేతుకమైతే, ప్రజలకు ఉపయోగపడేవే అయితే భేషజాలు లేకుండా అమలుచేస్తాం. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉప సంఘం వేస్తున్నాం. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ వారి ప్రతిపాదనలు పంపాలి. అడ్డుకుంటామంటే కుదరదు మేం ఏది చేస్తామన్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు. మా మీద కోపంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను శిక్షించవద్దు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, జీవన విధానం, ఆత్మగౌరవం. దీన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. అందుకే ఏ రకంగానైనా కాపాడుకుంటాం. అందుకోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాం. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతాం..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మీకురాలితో సీఎం కరచాలనం.. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్.. వేదికపైకి వెళ్లే ముందు అక్కడున్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, భద్రత కిట్స్ను పంపిణీ చేశారు. ఒక కార్మికురాలితో కరచాలనం చేసి, స్థితిగతులను తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన దివ్యాంగులను పలకరించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... ‘‘గుజరాత్లో సబర్మతి ఫ్రంట్కు చప్పట్లు కొట్టిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఇక్కడ మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీలో మునిగినా, అందులో ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోబోం. ప్రక్షాళన చేసి తీరుతాం. ప్రధాని మోదీ దగ్గర ఏటా రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులోనుంచే సబర్మతి ఫ్రంట్తోపాటు గుజరాత్కు గిఫ్ట్ సిటీ, బుల్లెట్ రైలు తీసుకెళ్లారు. మరి నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావు? మోదీ గుజరాత్కు నిధులు తీసుకెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా? మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు కావాలి. రీజనల్రింగ్ రోడ్డుకు మరో రూ.35 వేల కోట్లు కావాలి. మోదీ గుజరాత్, బెంగళూరు, చెన్నైలకు ఇస్తారుగానీ.. హైదరాబాద్కు ఎందుకివ్వరు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... మీరు నిధులు తెస్తారా లేక గుజరాత్కు వలసపోతారా? సికింద్రాబాద్ ఎంపీగా ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు, మెట్రో విస్తరణకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేంద్ర మంత్రిగా, ఎంపీగా నీ ప్రతిపాదనలేవో ప్రజలకు జవాబు చెప్పు. ఎన్ని నిధులు తెస్తావో చెప్పు. రాష్ట్రానికి రూ.లక్షన్నర కోట్లు తీసుకురా. 10 లక్షల మంది ప్రజలతో మోదీని, నిన్ను సన్మానించే జిమ్మేదారి నాది’’ మూసీ వెంట గుడిసె వేసుకుని ఉండి చూడు – కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి సవాల్ ‘‘మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రపోవడం కాదు.. అక్కడే గుడిసె వేసుకుని కుటుంబంతో సహా నివసించి చూపించు..’’అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరోజు మూసీ వద్ద నిద్రపోయి తర్వాతి నుంచి విలాసవంతమైన ప్యాలెస్లో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మూసీని జీవనదిగా మార్చాలని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ మూసీ ప్రాజెక్టుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ తరహా కాలుష్యం ముప్పు హైదరాబాద్కు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలివే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,446 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. జల మండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీల)ను, తాగునీటి సరఫరా కోసం రూ.45 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు. ఇక హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. కృత్రిమ మేధ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్వేర్ను లాంఛనంగా ప్రారంభించారు. -
ప్యార్ పైసా చాహియే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ..రాజధాని నగరమైన హైదరాబాద్ అభివృద్ధి ఎలాంటి దిశను తీసుకుంటుందోనని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనవద్దే ఉంచుకోవడంతో అందులో భాగమైన జీహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..ఏయే పనులు చేపడతారోనని అటు అధికారులు.. ఇటు నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ పనులపై సమీక్ష నిర్వహిస్తే.. సీఎం మనోగతం వెల్లడి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల పూర్తికి శ్రద్ధ చూపుతారా..లేక కొత్త పనులు చేపడతారా అన్న చర్చలు జీహెచ్ఎంసీ వర్గాల్లో సాగుతున్నాయి. మరోవైపు నగరానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ముఖ్యంగా ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు ఎప్పుడు ఎత్తివేస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో ఆస్తిపన్ను, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలను రద్దుచేస్తామని హామీనిచ్చారు. దానితో పాటు మరికొన్ని హామీలిచ్చారు. వాటిల్లో నగర ప్రజలకు సంబంధించిన వాటిల్లో దిగువ పేర్కొన్నవి ఉన్నాయి. తెల్ల రేషన్కార్డులున్న ఇళ్ల యజమానులకు ఇంటి పన్ను తగ్గింపు. ►మురికివాడల్లోని పేదలకు కాలనీల్లోని వారి మాదిరిగా నీరు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో నాణ్యమైన ప్రాథమిక సేవలు. సబ్సిడీతో కూడిన సర్విస్ కార్డులు. ► నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కలుపుతూ స్కైవాక్ల నిర్మాణం. ► పార్కింగ్ సమస్య పరిష్కారానికి పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం. ► బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా పేద ప్రజల పిల్లలకు ఆధునిక విద్య. ► సెట్విన్ బస్సుల్ని పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపు. ► ఎల్బీ నగర్– బీహెచ్ఈఎల్ (వయా ఆరాంఘర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి)మార్గాల్లో కొత్త మెట్రోలైన్ల విస్తరణ. ► మురికివాడల సమగ్రాభివృద్ధి కోసం స్లమ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. ► ప్రతి ఇంటికీ 25 వేల లీటర్ల మంచినీరు ఉచిత సరఫరా. ప్రాజెక్టులకు నిధులు కావాలి.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఎస్సార్డీపీ కింద 42 పనులు చేపట్టగా వాటిల్లో 32 పూర్తయ్యాయి. మరో 9 పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు కాగా, పురోగతిలోవి పూర్తయ్యేందుకు మరో వెయ్యి కోట్లు కావాలి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి మళ్లీ అప్పుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆ నిధులు విడుదల చేసి మిగిలిన పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద నివారణ పనుల కోసం ఎస్ఎన్డీపీ కింద తొలిదశలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అవి సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తిచేయడంతోపాటు రెండో దశకు అవసరమైన నిధులు కేటాయించాలి. రెండో దశ పనులకు గ్రేటర్ లోపల, వెలుపల వెరసి రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనలు చేశారు. సమస్య పరిష్కారానికి పాత ప్రతిపాదనల పనులే చేస్తారా? లేక కొత్త ప్రణాళికలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏం చేసినా సదుపాయవంతమైన జీవనం కలి్పస్తే బాగుంటుందని నగర ప్రజలు ఆశపడుతున్నారు. వీటికీ ప్రాధాన్యం ఇవ్వండి.. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటితోపాటు..పేర్కొనని దిగువ సమస్యలనూ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ► వరద ముంపు లేకుండా నాలాల ఆధునీకరణ. దశాబ్దాల తరబడి ఈ సమస్యకు వివిధ ప్రభుత్వాలు చర్యలకు శ్రీకారం చుట్టినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ ఈ అంశం ఉంది. చెరువుల్ని ప్రక్షాళన చేసి నీరు నిలిచేలా చేయడం.. ఒక చెరువు నిండాక దిగువప్రాంతాల్లోని చెరువులకు వెళ్లేలా చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. ► మేనిఫెస్టోలో ఉన్న మరో అంశం పార్కింగ్. నగరంలో పార్కింగ్ సమస్య వాహనదారులందరికీ తెలిసిందే. అడ్డగోలు పార్కింగ్ చార్జీలను కూడా అరికట్టాలని కోరుతున్నారు. ► నగరంలో ప్రధాన రహదారులు కాస్త బాగున్నా..కాలనీల్లోని రోడ్లు పరమ అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారులతోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాఫీ ప్రయాణం సాగేలా, వర్షం వచి్చనా ఇబ్బందుల్లేకుండా రోడ్లుండాలి. ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుంది. దాంతోపాటు అవసరమైన అన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందుల్లేకుండా చూడాలి. మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్మైల్ కనెక్టివిటీ సదుపాయానికి మినీబస్సులు నడపాలి. ► నగరంలో తరచూ అగి్నప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చెప్పుకోదగ్గ కారణాల్లో అక్రమ నిర్మాణాలు ఒకటి. అక్రమ నిర్మాణాలను అరికట్టాలి. -
టీఆర్ఎస్ పాలనలో నగరాభివృద్ధి తీరిదీ...
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కొంత మోదం..కొంత ఖేదం అన్నట్లుగా ఉంది. కొన్ని సమస్యలు సవాల్గానే మిగలగా..కొన్ని సక్సెస్లు ప్రజలకు ఊరట కలిగించాయి. ఇక తీరైన రహదారులు, నాలాల ప్రక్షాళన, వైద్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనలో సాధించింది గోరంత..సాధించాల్సింది కొండంత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో దాహార్తి తీర్చే పనులను రికార్డు సమయంలో పూర్తిచేయడం.. ఔటర్ లోపలున్న 190 గ్రామాలకు దాహార్తిని తీర్చే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతుండడంతో గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం మారింది. కానీ నిరుపేదలకు రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని సర్కారు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ.. లక్ష ఇళ్లకు మాత్రమే టెండర్లు పూర్తిచేశారు. మొత్తంగా 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించినప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి 40 వేల ఇళ్లు, వచ్చే సంవత్సరం జూన్ నాటికి మిగతావి పూర్తిచేస్తామని బల్దియా ప్రకటించింది. అత్యంత కీలకమైన నాలాల ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. సమస్యాత్మకంగా ఉన్న 46 బాటిల్నెక్స్లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన పనులు కుంటుపడ్డాయి. ఎస్సార్డీపీలో భాగంగా వివిధ దశల్లో 23 వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో దాదాపు రూ.3000 కోట్ల మేర పనులే పురోగతిలో ఉన్నాయి. నగర ప్రజలనుంచి తీవ్ర విమర్శలకు కారణమైన రోడ్లను మెరుగుపరచేందుకు వివిధ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, మార్పుచేర్పులతో అనుకున్నంత వేగంగా ముందుకు సాగకపోవడం గ్రేటర్ పిటీ. స్వచ్ఛర్యాంకింగ్లలో ఈ సంవత్సరం ఉత్తమ రాజధాని నగరంగా హైదరాబాద్ అవార్డు పొందడం విశేషం. ఇక నాలుగేళ్ల పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ జరగడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. శాంతిభద్రతల విషయంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో రైళ్లు కూతపెట్టడంతో సిటీజనులు ఆనందంగా ఉన్నప్పటికీ.. ఆర్టీసీ నాలుగేళ్లలో రూ.418 కోట్ల నష్టాలకు చేరుకుంది. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. వైద్యం రంగం బలోపేతం దిశ గా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మూసీ, హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టలేదు. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రేటర్లో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ప్రకటన ఘనం.. పని కొంచెం.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ ఎన్నో ప్రకటనలు చేసింది. అందుకనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించింది. వీటిలో చాలా వరకు ప్రారంభమైనప్పటికీ, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాను, లక్ష ఇళ్లకే టెండర్లు పూర్తికాగా.. 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. సింగం చెరువు తండాలో 176 ఇళ్లు పూర్తి చేశారు. ఈ ఏడాది చివరికల్లా 40వేల ఇళ్లు, వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతావి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇక రూ.10వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తొలిదశలో అత్యంత సమస్యాత్మకమైన 46 బాటిల్నెక్స్లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన ఈ పనులు కుంటుతున్నాయి. ఎస్సార్డీపీలో భాగంగా రూ.23వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో దాదాపు రూ.3,000 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. అయ్యప్పసొసైటీ, మైండ్స్పేస్, చింతల్కుంట ప్రాంతాల్లో అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.243 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో కొన్ని ఫ్లైఓవర్లు పూర్తి కానున్నాయి. ఇటీవల మరో రూ.2,128 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నగరవాసుల తీవ్ర ఇబ్బందుల్లో రహదారులు ఒకటి. వీటిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా, పనులు వేగంగా సాగడం లేదు. 20ఏళ్లు మన్నికగా ఉండే వైట్టాపింగ్ రోడ్లను డక్ట్లతో సహ రూ.1930 కోట్లతో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పూర్తి కావనే అంచనాతో ప్రస్తుత పరిష్కారంగా రూ.1120 కోట్లతో రీకార్పెటింగ్ పనులు చేస్తున్నారు. మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేస్తామని చెబుతున్నారు. సామాన్య ప్రజల సౌకర్యార్థం రూ.90 కోట్లతో 31 ఫంక్షన్హాళ్లు నిర్మిస్తామని ప్రకటించి నాలుగేళ్లయినా, అందులో ఐదు మాత్రమే పూర్తయ్యాయి. ఇంటినెంబర్ల సమస్య ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త ప్రణాళికలతో ఇటీవల మూసాపేట్ సర్కిల్లో సర్వే చేపట్టారు. ఒక్కో శ్మశానవాటికను దాదాపు రూ.కోటితో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. వాటిల్లో దాదాపు 14 శ్మశానవాటికల్లో మాత్రమే పనులు చేశారు. ‘స్వచ్ఛ’తలో ఉత్తమ రాజధానిగా హైదరాబాద్ అవార్డు పొందినప్పటికీ, ఇంటివద్దే తడిపొడి చెత్త 25 శాతం కూడా వేరు కావడం లేదు. 4.60 లక్షల ఎల్ఈడీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. ఈ–ఆఫీస్, డీపీఎంఎస్తో ఆన్లైన్లోనే భవననిర్మాణ అనుమతులు అమలు చేస్తున్నారు. వాటర్ ఏటీఎంలు, ఆధునిక బస్షెల్టర్లు తదితర పనులు జరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణ, కార్యక్రమాల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చెరువుల సుందరీకరణ, గణేశ్ నిమజ్జన కొలనులు చేపట్టారు. రూ.5 భోజన కేంద్రాలు 150 ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ ఎన్నో ప్రకటనలు చేసింది. అందుకనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించింది. వీటిలో చాలా వరకు ప్రారంభమైనప్పటికీ, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాను, లక్ష ఇళ్లకే టెండర్లు పూర్తికాగా.. 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. సింగం చెరువు తండాలో 176 ఇళ్లు పూర్తి చేశారు. ఈ ఏడాది చివరికల్లా 40వేల ఇళ్లు, వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతావి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇక రూ.10వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తొలిదశలో అత్యంత సమస్యాత్మకమైన 46 బాటిల్నెక్స్లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన ఈ పనులు కుంటుతున్నాయి. ఎస్సార్డీపీలో భాగంగా రూ.23వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో దాదాపు రూ.3,000 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. అయ్యప్పసొసైటీ, మైండ్స్పేస్, చింతల్కుంట ప్రాంతాల్లో అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.243 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో కొన్ని ఫ్లైఓవర్లు పూర్తి కానున్నాయి. ఇటీవల మరో రూ.2,128 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నగరవాసుల తీవ్ర ఇబ్బందుల్లో రహదారులు ఒకటి. వీటిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా, పనులు వేగంగా సాగడం లేదు. 20ఏళ్లు మన్నికగా ఉండే వైట్టాపింగ్ రోడ్లను డక్ట్లతో సహ రూ.1930 కోట్లతో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పూర్తి కావనే అంచనాతో ప్రస్తుత పరిష్కారంగా రూ.1120 కోట్లతో రీకార్పెటింగ్ పనులు చేస్తున్నారు. మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేస్తామని చెబుతున్నారు. సామాన్య ప్రజల సౌకర్యార్థం రూ.90 కోట్లతో 31 ఫంక్షన్హాళ్లు నిర్మిస్తామని ప్రకటించి నాలుగేళ్లయినా, అందులో ఐదు మాత్రమే పూర్తయ్యాయి. ఇంటినెంబర్ల సమస్య ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త ప్రణాళికలతో ఇటీవల మూసాపేట్ సర్కిల్లో సర్వే చేపట్టారు. ఒక్కో శ్మశానవాటికను దాదాపు రూ.కోటితో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. వాటిల్లో దాదాపు 14 శ్మశానవాటికల్లో మాత్రమే పనులు చేశారు. ‘స్వచ్ఛ’తలో ఉత్తమ రాజధానిగా హైదరాబాద్ అవార్డు పొందినప్పటికీ, ఇంటివద్దే తడిపొడి చెత్త 25 శాతం కూడా వేరు కావడం లేదు. 4.60 లక్షల ఎల్ఈడీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. ఈ–ఆఫీస్, డీపీఎంఎస్తో ఆన్లైన్లోనే భవననిర్మాణ అనుమతులు అమలు చేస్తున్నారు. వాటర్ ఏటీఎంలు, ఆధునిక బస్షెల్టర్లు తదితర పనులు జరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణ, కార్యక్రమాల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చెరువుల సుందరీకరణ, గణేశ్ నిమజ్జన కొలనులు చేపట్టారు. రూ.5 భోజన కేంద్రాలు 150 ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారు. ప్రగతి బండి.. నష్టాలండి గ్రేటర్ ఆర్టీసీ నాలుగేళ్లలో రూ.418 కోట్ల నష్టాలకు చేరుకుంది. ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి.. తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీ నుంచి రూ.120 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేశారు. కానీ ఆ తర్వాత జీహెచ్ఎంసీ కూడా చేతులెత్తేసింది. ఆర్టీసీ భారాన్ని మోయలేమని స్పష్టం చేసింది. దీంతో ప్రతిరోజు సుమారు 32లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్న గ్రేటర్ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టు వ్యయంలో ఒక్క శాతం నిధులు ఆర్టీసీకి ఖర్చు చేసినా... ఆ సంస్థ కొత్త బస్సులతో కళకళలాడుతుంది. నష్టాల నుంచి గట్టెక్కుతుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన 80 ఏసీ కొత్త బస్సులు మినహా, ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా అదనంగా కొనుగోలు చేయలేదు. సుమారు 1,000 డొక్కు బస్సులు ఆర్టీసీని వెక్కిరిస్తున్నాయి. అద్దె బస్సులే నడుపుతున్నారు. ఇటీవల 100 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవి కూడా అద్దె ప్రాతిపదికన వచ్చేవే, కానీ సొంతంగా కాదు. పర్యావరణహితంగా ఆర్టీసీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో ప్రవేశపెట్టిన 120 సీఎన్జీ బస్సులకు సకాలంలో ఇంధనం అందకపోవడంతో రెగ్యులర్గా తిరగడం లేదు. జలసిరులు... జలమండలి నాలుగేళ్లలో గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం సమూలంగా మారింది. జలమండలి విజన్తో మహానగర పాలకసంస్థలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో ఏడాదిలోనే 2,500 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్లు, 54 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 1,000 కాలనీలు, బస్తీల్లోని 35లక్షల మంది దాహార్తి తీరింది. ఇక ఔటర్ రింగ్రోడ్డు లోపలున్న 190 గ్రామాలకు దాహార్తి తీర్చేందుకు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. మిగతా గ్రామాలకు ఈ ఏడాది చివరికల్లా సరఫరా చేసేందుకు జలమండలి చర్యలు తీసుకుంటోంది. నీటి నాణ్యత విషయంలో జలమండలి ఐఎస్ఓ అవార్డు అందుకుంది. వినియోగదారుల ఫిర్యాదులను సామాజిక మాధ్యమాల్లో స్వీకరించడం, వినూత్న సాంకేతిక విధానాల అమలుతో తెలంగాణ ఎక్సలెన్స్, హడ్కో అవార్డులు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్లో సభ్యత్వం పొందింది. ఇక మహానగర జనాభా మూడు రెట్లు పెరిగినప్పటికీ... మరో వందేళ్లు తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూసేందుకు శామీర్పేట్ సమీపంలో 10టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ చొరవ, విజన్తో సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నగర శివార్లలో సీవరేజి మాస్టర్ప్లాన్ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సుమారు రూ.2వేల కోట్ల అంచనావ్యయంతో 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఔటర్రింగ్రోడ్డు చుట్టూ జలహారం (వాటర్గ్రిడ్)ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం విశేషం. కాసుల గలగలలు.. వాణిజ్య పన్నుల శాఖ వాణిజ్య పన్నుల శాఖకు తొలి మూడేళ్లు పెద్ద ఎత్తున రాబడి సమకూరినప్పటికీ, గతేడాది మాత్రం జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపింది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో గ్రేటర్ రాబడి అత్యంత కీలకం. ఇందులో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలోనే ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట్, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధిలోనే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ ఏడాది జీఎస్టీ అమలు ప్రభావం పడింది. రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు నాలుగేళ్లలో దండిగా ఆదాయం సమకూరింది. çసుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కట్టడి ఫలితంగా స్థిరాస్తి లావాదేవీలు తగ్గుముఖం పట్టినప్పటికీ, తిరిగి ఊపందుకున్నాయి. ఈ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్) ఉండగా, నగరంలోనే 4 డీఆర్ పరిధులు ఉన్నాయి. అందులో సుమారు 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం వరకు ఉంటుంది. మరోవైపు కొత్త సంస్కరణలు కూడా అమలవుతున్నాయి. రిజిస్ట్రేన్ నమోదు ప్రక్రియ పూర్తిస్థాయి ఆన్లైన్గా మారింది. హెచ్ఎండీఏ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్), లేఅవుట్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ల అమలుతో అనుమతుల్లో వేగం పెరగడంతో పాటు హెచ్ఎండీఏకు గణనీయంగా ఆదాయం సమకూరింది. ఈ విధానాలతో నెలకు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. కండ్లకోయ జంక్షన్ పనులు పూర్తవడంతో 158 కి.మీ మార్గంలో ఔటర్రింగ్రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మంగళ్పల్లి, బాటసింగారం లాజిస్టిక్ హబ్స్ పనులు ఇటీవల పట్టాలెక్కాయి. బాలానగర్ ఫ్లైఓవర్ను రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3,500 కోట్ల విలువైన కోకాపేట భూములు ప్రభుత్వానికి దక్కేందుకు హెచ్ఎండీఏ చేసిన కృషి ఫలించింది. ఎన్నడు లేని విధంగా 1.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి, 1.25 లక్షల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసింది. ప్రక్షాళన... పడని అడుగు చారిత్రక మూసీ నది ప్రక్షాళన విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నిత్యం గృహ, వాణిజ్య పారిశ్రామిక సముదాయాల నుంచి సుమారు 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ఇందులో జలమండలి 700 మిలియన్ లీటర్ల మురుగు జలాలనే శుద్ధి చేస్తోంది. మిగతా జలాల శుద్ధికి 18 మురుగు శుద్ధికేంద్రాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. నగరంలో మూసీ ప్రవహించే 45 కి.మీ మార్గంలో తీరైన ఫ్లైఓవర్లు, వాక్వేలు, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు మాటలు నీటిమూటలే అయ్యాయి. ఇక హుస్సేన్సాగర్ను మంచినీటి చెరువుగా మారస్తామన్న సర్కారు మాటలు... నీటి మీద రాతలే అయ్యాయి. సాగరంలోకి ఐదు నాలాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలకు అడ్డుకట్ట పడకపోవడం, సాగర గర్భంలో పేరుకున్న ఘన వ్యర్థాలను తొలగించకపోవడంతో హుస్సేన్సాగర్ ప్రక్షాళన సైతం కాగితాలకే పరిమితమైంది. ] అయ్యో.. ‘హా’స్పత్రులు ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నా.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో కొత్తగా రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు. శివారు జిల్లాల నుంచి వచ్చే రోగులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు గ్రేటర్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటి వరకు స్థల సేకరణ కూడా చేయలేదు. నిమ్స్లో నెఫ్రాలజీ, యూరాలజీ టవర్స్ ప్రతిపాదన ఇప్పటికీ ముందకు కదలేదు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క ఆస్పత్రి కూడా అందుబాటులోకి రాలేదు. ఆపరేషన్లు తరచూ వికటిస్తుండటంతో సరోజినిదేవి కంటి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు ఆపరేషన్ల సంఖ్య కూడా తగ్గింది. కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్, వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది కొరత త్రీవంగా వేదిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడీతో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే తగినన్ని పడకలు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సరికొత్త సంస్కరణలు ప్రజాపంపిణీ ప్రజాపంపిణీ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు చోటుచేసుకున్నాయి. రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డు వచ్చింది. గ్రేటర్లో ప్రయోగాత్మకంగా ఈ–పోస్ ద్వారా సరుకుల పంపిణీ జరగడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. గతంలో యూనిట్కు నాలుగు కిలోల చొప్పున 20కిలోల పరిమితి కాగా, యూనిట్కు ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఆరు కిలోల చొప్పున పంపిణీ జరగుతోంది. ఈ–పోస్ అమలుతో ప్రతి నెల 35–40 శాతం సరుకులు మిగులుతున్నాయి. ఎక్కడైనా రేషన్ తీసుకునే విధానం మరింత వెసులుబాటు కల్పించింది. ఈ రెండు విధానాలూ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. అయితే పౌరసరఫరాల శాఖ దశల వారీగా ఆహార భద్రత కార్డులను ఏరి వేస్తోంది. గ్రేటర్లో 12 సివిల్ సప్లై సర్కిల్స్ ఉండగా.. హైదరాబాద్ పరిధిలో 9, మేడ్చల్ అర్బన్లో 2, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒకటి ఉన్నాయి. మొత్తం మీద రేషన్కార్డు సంఖ్య నాలుగేళ్ల క్రితం 14.04 లక్షలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 10.21లక్షలకు తగ్గింది. విప్లవాత్మక మార్పులు పోలీస్ విభాగం నాలుగేళ్లలో నగర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ వినియోగం, కఠిన చర్యలతోనే నేరాల నియంత్రణ సాధ్యం. ప్రజలతో పోలీసులు స్నేహభావం, మర్యాదతో నడుచుకుంటేనే వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఇవన్నీ నగర పోలీస్ విభాగంలో కనిపించాయి. స్టేషన్లో ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మోడల్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో కీలక నిర్ణయం నేరగాళ్ల ‘ఆడిటింగ్’. ప్రతి ఠాణా పరి«ధిలో నివసించే పాత నేరగాళ్ల వివరాలు సేకరించి, జియో ట్యాగింగ్ చేశారు. దీంతో గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బంది, ప్రతి అధికారి విధిగా తమ పరిధిలోని ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసేలా ఏర్పాటు చేశారు. నేర నిరూపణలో కీలకమైన ఆధారాలు అందించే క్లూస్టీమ్స్ను పరిపుష్టం చేశారు. ఒకప్పుడు ఒకే టీమ్ ఉండగా... దేశంలోనే మరే ఇతర నగరంలో లేని విధంగా సబ్–డివిజన్ స్థాయిలో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో నగరంలోని సీసీ కెమెరాల సంఖ్య 1.5 లక్షలకు చేరింది. వీటి ఏర్పాటులో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ ‘నేను సైతం’ అనే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. నేరాలు 30 శాతం వరకు తగ్గాయి. దీనికి పీడీ యాక్ట్ ప్రయోగం కీలకాంశం. మూడు కమిషనరేట్లలో కలిపి దాదాపు 3వేల మందిపై దీన్ని ప్రయోగించారు. ఈవ్టీజర్ల పీచమణిచేందుకు ‘షీ–టీమ్స్’ ఏర్పాటు చేశారు. బాధిత మహిళలకు సహాయం అందించేందుకు ‘భరోసా’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. కేసుల దర్యాప్తులో సలహాలు, సూచనలు అందించడానికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్(ఐఎస్సీ) ఏర్పాటు చేశారు. దీని సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. బంజారాహిల్స్లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్తో పాటు కమిషనరేట్లో ఆధునిక కంట్రోల్ రూమ్ రాష్ట్రానికే తలమానికం. ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జోన్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. హాక్–ఐ, లాస్ట్ రిపోర్ట్, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్, వెరిఫై, 360 డిగ్రీస్ వ్యూ లాంటి యాప్స్ అమలులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ విభాగంలో క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్, చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు పరిచయం చేశారు. సైబర్, క్రైమ్ ల్యాబ్స్, ఐటీ సెల్, వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబ్ ఏర్పాటుతో పాటు ఆధునిక ఉపకరణాలు సమీకరించారు. మెట్రో మెరుపులు... నగరవాసుల కలల మెట్రో నాగోల్–అమీర్పేట్, మియాపూర్–అమీర్పేట్ మార్గంలో పట్టాలెక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో పరుగులు పెట్టనుంది. అక్టోబర్లో అమీర్పేట్–హైటెక్సిటీ రూట్లోనూ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక డిసెంబరులో జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలోనూ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. పాతనగరానికి వచ్చే ఏడాది మెట్రో రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది. రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(31 కి.మీ) మార్గంలో రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికిల్ను ఏర్పాటు చేయడం విశేషం. విమానాశ్రయ విస్తరణ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. ఇటీవల జరిగిన దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎయిర్పోర్ట్ విస్తరణకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా సదుపాయాలను పెంచనున్నారు. రెండో రన్వేతోపాటు ఒకేసారి పదివేల మందితో సమావేశాలు నిర్వహించుకునే స్థాయిలో భారీ సమావేశ మందిరాలు, ఇతర అన్ని సదుపాయాలతో ఎయిర్పోర్ట్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐటీ.. పిటీ ఐటీ రంగంలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు. ఐటీఐఆర్ పట్టాలెక్కకపోవడం, ఐటీ రంగంలో నూతన కంపెనీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో ఉపాధి అంతంతమాత్రంగానే ఉంది. మహానగరం పరిధిలోని వెయ్యి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో ప్రస్తుతం సుమారు 5లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. టీఎస్ ఐపాస్, నూతన ఐటీ పాలసీల రాకతో ఇటీవల ఐటీ కంపెనీల వెల్లువ మొదలైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమీప భవిష్యత్లో ఈ రంగానికి గ్రేటర్లో ఉజ్వల భవిత ఉంటుందని పేర్కొంటున్నారు. నాలుగేళ్లలో నగరాభివృద్ధి కొంచెం మోదం.. కొంచెం ఖేదంలా సాగింది. శివార్లలో దాహార్తి తీరింది.. మెట్రో పరుగులు పెట్టింది. ప్రజాపంపిణీ, శాంతిభద్రతల విషయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. హెచ్ఎండీఏ, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖకు దండిగా ఆదాయం సమకూరింది. ఇక హుస్సేన్సాగర్, మూసీ ప్రక్షాళనకు అడుగు పడలేదు. ఆర్టీసీ నష్టాల్లోంచి గట్టెక్కలేదు. నూతన ఆస్పత్రుల నిర్మాణమే లేదు. ఇలా సవాళ్లు... సక్సెస్లతో సాగిన నాలుగేళ్ల నగరాభివృద్ధిపై నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, సిటీబ్యూరో వెలుగుల వేడుక రాష్ట్ర అవతరణ వేడుకలకు నగరం సిద్ధమైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. -
హైదరాబాద్ వెలుపల అభివృద్ధిపై అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి హైదరాబాద్లోనే కేంద్రీకృతం కాకుండా శివార్లలో నలుదిక్కులా కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటు మహబూబ్నగర్, అటు వరంగల్, కరీంనగర్.. ఇలా పలుదిక్కుల వివిధ రకా లుగా పురోగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. నగరం చుట్టూ విస్తరించిన ఔటర్ రింగురోడ్డు–కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు మధ్య, రీజినల్ రింగురోడ్డు అవతల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఫార్మాసిటీ, ఐటీ కారిడార్, టెక్స్టైల్ పార్కు.. ఇలా పలు ఉపాధి రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు శుక్రవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. వీటి సమగ్ర వివరాలను అన్ని పక్షా లకు అందించే ఉద్దేశంతో త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఫార్మా కాలుష్యం తగ్గాలి హైవే మీదుగా వెళ్తుంటే ఎక్కడ ఘాటైన వాసన వస్తే అక్కడ ఫార్మా కంపెనీ ఉన్నట్టు ఇట్టే అర్థమవుతుందని సీఎం అన్నారు. ఆ రకమైన కాలుష్యం లేకుండా చూడాల్సిన అవసర ముందని ఆయన చెప్పారు. 10వేల కోట్లతో టెక్స్టైల్ పార్కు: కేటీఆర్ వరంగల్లో 1,200 ఎకరాల్లో రూ.10 వేల కోట్ల వ్యయంతో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఫైబర్ టూ ఫ్యాబ్రిక్గా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తాం. ఇది 2018లో అందుబాటులోకి వస్తుంది. త్వరలో శంకుస్థాపన ఉంటుంది. వరంగల్ రూరల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ చేరువలో రూ.270 కోట్లతో లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు. -
విశ్వనగరి
అభివృద్ధిలో వెనుకడుగు వేయబోయం విమర్శలకు వెరసేది లేదు ఆలోచనలన్నీ కార్యరూపం ఉపాధికి ప్రాధాన్యం అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లు ‘న్యూ విజన్’ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర అభివృద్ధి... ఉపాధి అవకాశాల కల్పన... ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు... పేదలకు పక్కాగృహాలు... వానొస్తే ఎక్కడా చుక్క నీరు నిలవకుండా ఏర్పాట్లు... ఇదీ సీఎం కే సీఆర్ మనసులోని మాట. నగర ప్రజల ప్రస్తుత...భవిష్యత్తు అవసరాలు... తన కలలు... ఇలా.. అనేక అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. సిటీబ్యూరో: దేశంలోని ఏ నగరానికీ లేనివిధంగాసహజ సిద్ధ సౌకర్యాలు... నిజాం కాలం నుంచి అధునాతన సదుపాయాలు కలిగిన హైదరాబాద్ గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఈ దుస్థితిని రూపుమాపేందుకు... హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాయుతంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. బుధవారం రాత్రి ఓ టీవీ చానెల్లో ‘విజన్ హైదరాబాద్’పై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘కల్పన’ నుంచి కార్యరూపం దిశగా నడిచే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత తమకు ఉన్నాయన్నారు. ఎక్స్ప్రెస్ కారిడార్లు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల గురించి వింటున్న వారు హైదరాబాద్లో అలాంటివి సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని... వాటిని పటాపంచలు చేసేలా తాము ఆచరణలో చూపిస్తామన్నారు. ఏ పనిలోనైనా ప్రారంభంలో చాలామందికి నమ్మకం కలగదని... తెలంగాణ సాధనను సైతం తొలుత అలాగే పరిగణించారని గుర్తు చేశారు. ఆలోచన నుంచి పురోగమించి.. నిబద్ధతతో ముందుకు వెళ్తూ... మడమ తిప్పకుండా సాగితే కల సాకారమవుతుందని నిరూపించామన్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ రూపం నుంచి ప్రభుత్వంగా అవతరించాక...అన్నిరకాలుగా తెలంగాణ అభివృద్ధికి వందశాతం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. అభివృద్ధిలో ఐదారు ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటాపోటీగా ముందుకెళ్తోందని చెప్పారు. పెరిగే జనాభాను అంచనా వేసి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మోస్తరు వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లే దని గుర్తు చేశారు. రాజ్ భవన్ రోడ్డు, అసెంబ్లీ, సీఎం క్యాంప్ కార్యాలయ ప్రాంతాలను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదే తగిన సమయం హైదరాబాద్ అభివృద్ధికి ఇదే తగిన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో 5 లక్షల ఎస్ఎఫ్టీలో తమ సంస్థలు విస్తరించేందుకు విప్రో ప్రేమ్జీ వంటి వారు ముందుకొస్తున్నారని చెప్పారు. తద్వారా 5వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తొలి దశలో రూ.1250 కోట్లతో ఆ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుందని తెలిపారు. ఐదారేళ్లలో వాటిని పూర్తి చేస్తామన్నారు. దీనికిప్రజల సహకారం కావాలని కోరారు. వివిధ దేశాల ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు శరవేగంగా ముందుకొస్తున్నాయన్నారు. ఫ్లై ఓవర్ల మలుపుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని... భవిష్యత్తులో నిర్మించే వాటి వల్ల ఇలాంటి వాటికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆ మార్గాల్లోని భవంతులకు రెండింతలైనా నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. నాలాల విముక్తికి... నాలాలు కబ్జాకు గురికావడంతో వర్షాలు వస్తే నీరు వెళ్లే మార్గం లేకుండా పోయిందని జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు తనకు వివరించారని సీఎం తెలిపారు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకురూ.10 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఫ్లై ఓవర్లు.. స్కైవేలు.. నగరంలో ప్రయాణ సమస్యలు లేకుండా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, జిల్లాల నుంచి వచ్చే వారి కోసం స్కైవేలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐదు మార్గాల్లో స్కైవేలు నిర్మిస్తామని తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో దిగాలనుకునే వారికి ర్యాంప్లు ఉంటాయన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న లీ అసోసియేట్స్ కన్సల్టెన్సీలు డిజైన్లు రూపొందిస్తున్నాయని తెలిపారు. జేబీఎస్ నుంచి తూముకుంట వరకు ఒక స్కైవే నిర్మిస్తామన్నారు. అమెరికాలోని డల్లాస్ తరహాలో హైదరాబాద్ను మారుస్తామని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే శస్త్ర చికిత్సలాంటి పని జరగాలని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు నిర్మిస్తాం ప్రజల అవసరాలు తీరేలా ఆధునిక మార్కెట్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దాదాపు కోటి జనాభా ఉన్న నగరంలో కనీసం వెయ్యి మార్కెట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కేవలం 24 మాత్రమే ఉండటం శోచనీయమన్నారు. చాలా మార్కెట్లు ఎకరం లోపు విస్తీర్ణంలో ఉండడం దారుణమన్నారు.మెహదీపట్నం మార్కెట్ వద్దే ఆటోలు, పశువులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఆధునిక మార్కెట్ను కట్టి చూపిస్తామన్నారు. ప్రభుత్వ ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాల కోసం ప్రభుత్వ భూములు పరిశీలిస్తుంటే కొందరు సచివాలయ భూములు అమ్ముతారా ? అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారందరికీ తగిన సమాధానం చెప్పేలా హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హరితహారంలో భాగంగా మూడేళ్లలో పది కోట్ల మొక్కలు నాటుతామన్నారు.