-
ముంచుకొస్తే.. ముందుంటారు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంభవించిన విపత్తుల నివారణలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన ఆకస్మిక వర్షాలకు కూలిన 630 చెట్లను రికార్డ్ స్థాయిలో తొలగించడం, రోడ్లపై ఏర్పడిన నీటిని తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు కూలిన విద్యుత్ స్తంభాలు, ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ టవర్ను తొలగించడం వంటి చర్యల ద్వారా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది. ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగం కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఏర్పాటైంది. దాదాపు 220 మంది సిబ్బందితో 8 బృందాలు నగరంలోని 24 కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్ట్లుగా విధి నిర్వహణలో ఉంటాయి. ఈ నెల 22న అరగంట వ్యవధిలోనే 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన అకస్మిక వర్షం కురియడంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో ఉన్న విపత్తుల నివారణ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను, తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలను వెంటనే తొలగించాయి. ఈ వర్షాల సందర్భంగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం కంట్రోల్ రూంకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 130కి పైగా ఫిర్యాదులు అం దాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ 36 గంటల్లోనే పరిష్కరించడంతో పాటు దాదాపు 622 కూలిన చెట్లను తొలగించారు. మచ్చుకు కొన్ని.. ♦ రామంతాపూర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు కూలింది. అత్యంత పురాతన ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన, గుడిపైన చెట్ల కొమ్మలు పడకుండా అత్యంత జాగ్రత్తగా కూలిన వక్షాన్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తొలగించాయి. ♦ ఆడిక్మెట్ రామాలయంలో ఉన్న 40 ఏళ్ల చెట్టు సైతం కూలడం, ఈ కూలిన వృక్షాన్ని దేవాలయానికి గానీ, పరిసర ప్రాంతాల ఇళ్లపై కానీ పడకుండా సురక్షితంగా తొలగించారు. ♦ లక్డికాపూల్లోని కేన్సర్ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం కూలి రెండు ప్రధాన రహదారులను బ్లాక్ చేయడంతో ఫిర్యాదును అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని అతితక్కువ సమయంలో కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. సుశిక్షితులైన టీం జీహెచ్ఎంసీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటై కేవలం సంవత్సర కాలంలోనే ఈ విభాగంలోని 220 మంది సిబ్బందికి విపత్తుల నిర్వహణలో సుశిక్తులుగా చేయడంతో నగరంలో ఏవిధమైన విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కునే ఫోర్స్ జీహెచ్ఎంసీ కలిగి ఉందని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన అత్యాధునిక మిషనరీ, టూల్స్లను కూడా సేకరించుకోవడం జరిగిందని, ఈ విపత్తు నివారణ బంద సభ్యుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు విశ్వజిత్ తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కునేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉందనే ధైర్యం నగరవాసుల్లో ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా 22న ఏర్పడిన భారీ వర్షాలకు డి.ఆర్.ఎఫ్ బందాలు అందించిన సేవలపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజానీకం ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసలు కురిపించారు. -
పుట్టింగళ్ విపత్తు బాధితుల నిధి ఏర్పాటు
తిరువనంతపురంః పుట్టింగళ్ దేవీ ఆలయ ఉత్పవాల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 114 మంది వరకూ మృతి చెందగా.. దుర్ఘటనలో 350 మంది వరకూ తీవ్రంగా గాయపడి నేటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలను సులభంగా వదిలేయడానికి లేదని, విపత్తు బాధితుల దీర్ఘకాల అవసరాలకు ప్రత్యేక నిధిని సమకూర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. విషాదంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పుట్టింగళ్ ఆలయ ప్రమాదంలో గాయాలపాలైనవారు తిరిగి సాధారణ జీవితం పొందడానికి చాలా సమయం పడుతుందని, వారికి అన్ని విధాలుగా సహాయపడేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. మత సంస్థలతో సంబంధం ఉన్న సంఘటనలపై ఏకాభిప్రాయం కుదరడం కష్టమని, ఆచరణాత్మకం కూడ కాదని చెప్పిన సీఎం... ఎన్నో నిబంధనలు, నిషేధాజ్ఞలు, చట్టాలు ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని, ఇకముందైనా ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష సమావేశం అనంతరం తెలిపారు. గంటన్నరపాటు జరిగిన సమావేశంలో సుమారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. త్వరలో రాబోయే త్రిస్సూర్ పూరమ్ వేడుకలపై కూడ ఈ సందర్భంలో చర్చించారు. రాష్ట్రంలోనే ప్రధాన పండుగగా పరిగణించే ఈ పండుగకు సైతం అనుమతిని మంజూరు చేసిన ప్రభుత్వం తగిన నియమ నిబంధనలను కఠినంగా పాటించేట్లు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రత్యేక పండుగ త్రిస్సూర్ పూరమ్ అని, ఈ పండుగను నిషేధించడం సాధ్యం కాదని, నిబంధనలు, నిషేధాజ్ఞలు పటిష్గంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశం సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల తెలిపారు. మరోవైపు పుట్టింగళ్ ఆలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించిన ముగ్గురు మంత్రుల కమిటి అక్కడ జరిగిన నష్టాల అంచనాను వచ్చే బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో నివేదిస్తుందని, తదుపరి మంత్రివర్గం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యంత్రి చాందీ తెలిపారు. కొల్లం ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు కూడ ఈ సందర్భంలో అఖిల పక్షం నిర్ణయించినట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement