డమ్మీ ఈవీఎంలపై తెలుగు తమ్ముళ్ల హడావుడి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈవీఎంలు కలకలం సృష్టించాయి. అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రంలో మారుస్తున్నారంటూ అర్థరాత్రి స్థానికంగా పుకార్లు గుప్పుమన్నాయి. దాంతో కాకినాడ ఐడియల్ కాలేజీ వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుని, ఆందోళనకు దిగారు. అయితే డమ్మీ ఈవీఎంలని అధికారులు వెల్లడించారు. కాగా రెండు కార్లలో తరలిస్తున్న ఈవీఎంలు స్థానికులు గుర్తించారు.