breaking news
December 30
-
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
'పాత నోట్లుంటే జైలు'పై కేంద్రం కొత్త మాట
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో కుప్పిగంతు వేసింది. 'శుక్రవారం(డిసెంబర్ 30) తర్వాత పాత నోట్లు కలిగి ఉన్నవారికి కనీసం రూ.10వేల జరిమానా విధిస్తాం. జైలు శిక్షలు ఉండవు'అని ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాతనోట్ల డిపాజిట్కు మార్చి 31 వరకూ గడువు పొడిగించిన దరిమిలా నేటి ప్రకటన(డిసెంబర్ 30 తర్వాత జరిమానాలు) అసంబద్ధంగా ఉండటం గమనార్హం. బుధవారం నాటి కేబినేట్ భేటీలో.. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై బుధవారం నాటి కేబినెట్ భేటీలో స్పష్టత రాకపోవడంతో ఇవ్వాళ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పాత నోట్లుంటే జైలే!) ఆ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. -
విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
-
విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగదు విత్డ్రాలపై విధించిన పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా, దానిలో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించేలా చేయాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని డిసెంబర్ 30న సాయంత్రం ప్రధాని ప్రజలనుద్దేశించి చేయబోయే ప్రకటనలో ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్కు డిసెంబర్ 22 నుంచి టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది. -
అదిగదిగో..! డిసెంబర్ 30
విశ్లేషణ మోదీ చెప్పినట్టు డిసెంబర్ 30 నాటికి పరిస్థితులు మెరుగుపడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనక తప్పదు. దీని కోసమే సీనియర్లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు. అంతా సజావుగా, సంతోషంగా ఉన్నప్పుడే రాజకీయ జీవులంతా పదవుల నుంచి పక్కకి తప్పుకోకపోతే చివరికి మిగిలేది వైఫల్యమే. రాజకీయాల లక్షణమే కాదు, మనుషుల తత్వమే అంత అంటాడు ప్రఖ్యాత ఇంగ్లిష్ రాజకీయవేత్త ఇనాక్ పోవెల్. ప్రపంచంలో చాలామంది ప్రముఖ రాజకీయ వేత్తల మాదిరిగానే తన రాజకీయ జీవితానికి కూడా అదే రాసి పెట్టి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమయ్యే రోజు వస్తుంది. ఈ డిసెంబర్ 30 తేదీని మోదీ నిర్ణయాత్మక దినంగా నిర్దేశించారు. 15 లక్షల కోట్ల విలువ మేరకు ఉన్న రూ. 100, రూ. 1,000 నోట్లలో ఎన్ని బ్యాంకులకు చేరతాయో ఆరోజునే వెల్ల డవుతుందని మోదీ ఊహ. అయితే అందులో చాలావరకు, రూ. 14 లక్షల కోట్లు ఇప్పటికే జమ అయినాయి. ఈ నెలాఖరుకు ఇంకొంత జమ అవు తుంది. అంటే లక్ష్యసాధనలో మోదీ విఫలమయ్యారు. ఇదిగో నల్లధనం అంటూ చెప్పడానికి ఏమీలేదు. మోదీ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు అనే కొరివితో తలగోక్కుని స్వయంకృతాపరాధానికి పాల్పడ్డారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ జీవితం ఎంత విషాదాం తమైందో మోదీ గుర్తు చేసుకోవాలి. లేదంటే బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజకీయ జీవితం బ్రిగ్జిట్తో ఎలా పతనమైందో తలుచుకోవాలి. ఐదేళ్ల కాల పరిమితి కోసం కామెరాన్ను ఆ దేశ ప్రజలు 2015లో ఎన్నుకున్నారు. కానీ యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అనే అంశం మీద మొన్న జూన్లో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి భంగపడ్డారు. రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. నీ ప్రభ సమున్నతంగా వెలుగుతున్నప్పుడు పదవి నుంచి తప్పుకోవాలన్న పావెల్ మాటను ఆచరించేదెవరు? అత్యాశ ఫలితం కాదా? మోదీ మంచి పథకాలను ఆరంభించారు. స్వచ్ఛ భారత్, భారత సంతతి, భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు చేసుకుంటున్న దేశాలకు వెళ్లిరావడం, చైనాతో నిష్కర్షగా వ్యవహరించడం, జన్ధన్ ఖాతాలు, మరింత మెరుగైన పంటల బీమా అందులో కొన్ని. కానీ మోదీ అత్యాశకు పోయారు. ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాన్ని వెనక్కినెట్టి, 2019 ఎన్నికలలో మళ్లీ తానే గెలవాలని ఆయన కోరిక. పైగా పార్లమెంట్కు బొత్తిగా కొత్త. అందుకే మన గొప్ప రాజకీయ వేత్తలు పీవీ, వాజ్పేయి, శరద్పవార్ల మాదిరిగా విమర్శను తట్టుకునే తత్వం లేదు. ఇది కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. చూడబోతే ఇందిరాగాంధీ లక్షణాలు మోదీలో చాలా ఉన్నట్టనిపిస్తుంది. నోట్ల రద్దు పథకం మొదటి దశ కూడా ముగిసింది. రద్దు అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రజలు పడిన పాట్లు వర్ణనాతీతం. ఆయన అనుకున్నదొకటి, అయినదొకటి అయింది. దీనితో ఆయన మండిపడుతున్నారు. మోదీ మధ్య తరగతి, స్వయం ఉపాధి వృత్తి నిపుణులు, విద్యావం తులైన యువత ఓట్లతో పదవిలోకి వచ్చారు. ఆర్థిక అవకాశాలు మెరుగు పడతాయని ఈ ఓటర్లందరి ఆశ. కానీ ఇప్పుడు మోదీ సరిగ్గా ఈ వర్గాల వారినే వేధిస్తున్నారు. డిసెంబర్ 30 వరకు ఆయన మౌనం పాటించడం మంచిది. అలాగే మేధావుల నుంచి లభిస్తున్న గట్టి మద్దతు కూడా కోల్పోతు న్నారు. ఇలాంటివారు మోదీ నుంచి పెద్దగా ఆశించిందేమీ లేదు గానీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అంతమైతే చాలునని భావించినవారే. మోదీ మద్దతుదారులుగా ముద్ర పడిన మధు కిష్వార్, తవ్లీన్సింగ్ వంటి వారు కూడా గడచిన కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేయడం కనిపిస్తున్నది. వీరు కూడా డిసెంబర్ 30 కోసం వేచి చూస్తు్తన్నారు. ఇందిరను మరిపిస్తున్న మోదీ బంగారం మీద నియంత్రణ పెట్టాలని గతంలో కూడా పలువురు ఆర్థిక మంత్రులు ప్రయత్నించిన సంగతిని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విస్మరి స్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పైకి కనిపిస్తున్న బంగారం 20,000 టన్నులు. ఇక రహస్యంగా ఉన్న పసిడి ఎన్ని టన్నులో తెలియదు. దీని గురించి ఎవరూ ఏమీ చేయలేరు. బంగారం గురించి ప్రభుత్వం ప్రజలను హెచ్చరించడం మానేస్తే మంచిది. నవంబర్ 8తో తానొక హీరోగా అవత రించానని మోదీ భావన. కానీ ఇప్పుడు ఆయన డిసెంబర్ 30 నాటి పతాక సన్నివేశం ఎలా ఉంటుందో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పటికీ సరిహద్దులలో భారత సైనికులను ఉగ్రవాదులు చంపుతూనే ఉన్నందున సర్జికల్ దాడులు విఫలమైనాయని చాలామంది భావన. వీటన్నిటితో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నోట్ల రద్దు తరువాత నల్లధనానికి కొమ్ము కాస్తున్నారంటూ మోదీ బీజేపీయేతర నాయకులను పార్లమెంట్ బయట దుమ్మెత్తి పోసి వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఇలా విపక్షాల మీద ధ్వజమెత్తిన ప్రధాని ఒక్క ఇందిర మాత్రమేనని చెప్పుకోవచ్చు. మోదీకి అధికారులు తప్పుడు సలహా ఇచ్చారు. ఒక్క వారంలోనే సమస్యకు సమాధానం చెప్పడానికి కావలసిన సొమ్ము ఉందని తప్పుతోవ పట్టించారు. కానీ మోదీ ప్రభుత్వం చేసిన తప్పు ఎంత పెద్దదో దేశమంతా ఇప్పటికే గమనించింది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన బీజేపీ నేతలు ప్రభుత్వ విధానాలతో ఏకీభవించనివారిని తూర్పార పడు తున్నారు. ఇది బీజేపీ ప్రతిష్టకీ, రాజకీయాలకీ మంచిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నోట్ల రద్దు వ్యవహారం మీద పెదవి విరుస్తున్నారు. కానీ పరిస్థితులను చక్కబరచడానికి బదులు మోదీ మండిపాటును ప్రదర్శిస్తున్నారు. ప్రజలలో అంతగా పట్టులేని పీయూష్ గోయెల్ వంటివారే వెన్నుదన్నుగా ఉన్నారు. బీజేపీ సీనియర్లలో ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. వీరు కూడా డిసెంబర్ 30 పరిణామాల కోసమే వేచి చూస్తున్నారు. అంటే మోదీ విపక్షంతో బాహాటంగాను, స్వపక్షంతో గుంభనం గాను పోరాడుతున్నారు. రద్దు నిర్ణయం ఆర్థికమంత్రి జైట్లీకి కూడా నవంబర్ 8 మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే చెప్పారు. ఇదంతా చూస్తే అతి విశ్వాసంతో, ఆఖరికి తండ్రికి కూడా తెలియకుండా శత్రు సమూహాల మధ్యకు చొచ్చుకుపోయిన అభిమన్యుడి చర్యను గుర్తుకు తెస్తున్నది. నవ భారతం ఆవిష్కృతమయ్యేనా? డిసెంబర్ 30 నాటికి బ్యాంకులలో పూర్తిస్థాయిలో ధనం జమ కాదని మోదీ తలిచారు. అది తప్పని తేలడంతో నగదు రహితం పాట అందుకున్నారు. డిసెంబర్ 30 నాటికి నవ భారతం ఆవిష్కృతమవుతుందని ఆర్భాటంగా ప్రక టించారు. కానీ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులలోకి ప్రయాణిస్తున్నది. కోట్లాది ఉద్యోగాలు పోయాయి. వ్యవసాయం, రిటైల్ రంగాలలో ఉద్యోగావకాశాలు హరించుకుపోయాయి. వర్తక వాణిజ్యాలు తగ్గుముఖం పట్టాయి. జన్ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున ధనం జమ చేస్తారని అంతా భావించారు. ఆ చర్యతో పేదలను తృప్తి పరచగలనని మోదీ కూడా భావించారు. ఈ విష యంలో ఆయన అచ్చం ఇందిరాగాంధీలాగే మాట్లాడారు. అయితే జన్ధన్ ఖాతాలలో ఏమీ జమ చేయలేరన్న విషయం ఇప్పుడు ఆ ఆశ పెట్టు కున్నవారిని తీవ్ర నిస్పృహకు గురి చేస్తున్నది. నల్లధనంపై ఇతర మార్గాల ద్వారా కూడా వేట సాగిస్తామని మోదీ చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్, అవినీతి ఉద్యోగుల భరతం పడతారని అంతా ఆశించారు. కొందరు నిజా యితీ కలిగిన అధికారులు ఉన్నమాట కాదనలేం. కానీ అవినీతి పరుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు పోగుపడింది. ఇప్పుడు వీరిని కూడా ఏమీ చేయలేని పరి స్థితి. ఎందుకంటే వీరి నల్లధనం ఏనాడో ఇతర రూపాలలోకి మారిపోయింది. మోదీ చెప్పినట్టు డిసెంబర్ 30 నాటికి పరిస్థితులు మెరుగు పడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనకతప్పదు. దీని కోసమే సీని యర్లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు. అదే ఆయన మెడకు గుదిబండగా పరిణమించింది. మోదీ ఆత్మ స్థయిర్యం కోల్పోయిన సంగతి హావభావాలలో, కదలికలలో స్పష్టమవుతున్నది కూడా. సంపూర్ణాధికారం కాదు ప్రజలు ఒక ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని ఐదేళ్ల కోసం ఎన్నుకున్నారంటే దానర్థం, ఆ కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించవచ్చునని కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలు వ్యతిరేకించి ఉండవచ్చు. అయితే విపక్షం కూడా మౌనం దాల్చింది. ఒకవేళ నోట్ల రద్దును విమర్శిస్తే ప్రజలు నల్లధనానికి మద్దతు ఇస్తున్నవారిగా భావిస్తారేమోనని వారి బెంగ. హాస్యాస్పదమైన మరో సంగతి–ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ఆనం దంగానే నిలబడుతున్నారనీ, ఈ చర్య పట్ల ఆగ్రహంగా లేరని ప్రభుత్వం చెబుతోంది. ఒకటి వాస్తవం–తాము ఆగ్రహిస్తే పోలీసులు వచ్చి లాక్కుపోతా రనీ, అంతకంటే డబ్బు చేతికి వచ్చేదాకా సహనంతో ఉండడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. మోదీ ప్రహసనం గురించి ఎంతైనా రాయవచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఒక దేశాన్ని, ఎలాంటి రోగ లక్షణం లేకుండా హఠాత్తుగా ఐసీయూ పాల్జేశారు. దేవుడా; రక్షించు నాదేశాన్ని. - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
-
పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ : రద్దైన పాత నోట్ల చెల్లుబాటు విషయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలుసార్లు, పలుచోట్ల చెల్లుబాటు గడువులను పొడిగించిన కేంద్రం, డిపాజిట్ల విషయంలో అసలు తగ్గేది లేదని ప్రకటించింది. రద్దైన పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన డిసెంబర్ 30వ తేదీనే ఆఖరని, ఈ తేదీని ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని నేడు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని వెల్లడించింది. రద్దైన పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి, కొత్త నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పాత నోట్ల డిపాజిట్ల తుదిగడువును మార్చేది లేదని పేర్కొంది. బ్యాంకుల వద్ద సరిపడ నగదుతో పాటు, రూ.100 నోట్ల చలామణిని కూడా పెంచినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. డిసెంబర్ 30వ తేదీని పొడిగించే ఉద్దేశ్యమేమన్న ఉందా అనే ప్రశ్నకు, అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని వెల్లడించారు. గ్రామీణ ప్రజల అవసరార్థం రూ.100, అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను బ్యాంకులు సరఫరా చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగ, పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని, డిసెంబర్ 30వరకు పాత రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
ఈ నెల 30న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : తిరుపతి శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లకు ఈ నెల 30న విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 16న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు అర్హులని చెప్పారు. సీట్ మ్యాట్రిక్స్ వివరాలు కౌన్సెలింగ్కు ముందురోజు యూనివర్సిటీ నోటీసు బోర్డుతో పాటు వర్సిటీ (http://ntruhs.ap.nic.in) వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు వివరించారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1500 చొప్పున చెల్లించి ఈ 30వ తేదీ ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు రూ. 9,700 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు.