breaking news
Danish Malewar
-
సారాంశ్కు ఐదు.. కార్తికేయకు నాలుగు.. చహర్ విఫలమైనా..
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్జోన్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. వికెట్ నష్టపోకుండా 50 పరుగులుసెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్కు విలవిల... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్ను తట్టుకోలేక సౌత్జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీపక్ చహర్ విఫలంసెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు. మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149. బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0. -
మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు ఫెయిల్!.. అయితేనేం..
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సెంట్రల్ జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ ఈస్ట్ జోన్తో శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 678 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.డానిష్ మలేవర్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్ 102 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి.. 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డానిష్ మలేవర్ (Danish Malewar) డబుల్ సెంచరీ (203- రిటైర్డ్ అవుట్)తో దుమ్ములేపగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసకర సెంచరీ (96 బంతుల్లో 125) సాధించాడు. మిగతా వారిలో యశ్ రాథోడ్ 108 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం.. తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్ ఈస్ట్ జోన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 69.3 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కరణ్జిత్ యుమ్నామ్ (48) టాప్ రన్స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో అంకుర్ మాలిక్ 42 పరుగులతో రాణించాడు.సెంట్రల్ జోన్ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే మూడు, హర్ష్ దూబే, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ చహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో నార్త్ ఈస్ట్ జోన్పై 347 పరుగుల ఆధిక్యం సంపాదించిన సెంట్రల్ జోన్.. శనివారం రెండో ఇన్నింగ్స్లోనూ రాణించింది.నిరాశపరిచిన డానిష్.. రజత్ మరోసారి హిట్ఈసారి ఆయుశ్ పాండే (12)తో కలిసి ఓపెనర్గా వచ్చిన డబుల్ సెంచరీ వీరుడు డానిష్ మలేవర్ (15) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ శుభమ్ శర్మ సెంచరీ (122)తో చెలరేగి ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రజత్ పాటిదార్ మరోసారి అదరగొట్టాడు. 72 బంతులు ఎదుర్కొన్న ఈ కెప్టెన్ సాబ్ 66 పరుగులు చేశాడు.నార్త్ ఈస్ట్ జోన్ ముందు భారీ లక్ష్యంమిగతావారిలో యశ్ రాథోడ్ 78 పరుగులు సాధించగా.. దీపక్ చహర్ 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 80.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సెంట్రల్ జోన్.. 331 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ ముందు 679 (347+331) పరుగుల మేర భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. నార్త్ ఈస్ట్ జోన్ను లక్ష్యం చేరకుండా ఆపి.. ఆలౌట్ చేసేందుకు సెంట్రల్ జోన్కు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీలైనంత త్వరగా పనిపూర్తి చేస్తే సెమీస్లోకి సెంట్రల్ జోన్ దూసుకుపోవచ్చు.చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్గా రికార్డు
దులీప్ ట్రోఫీ-2025 తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ ఆటగాడు డానిష్ మలేవర్ (Danish Malewar) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.వన్డే తరహాలో తన బ్యాటింగ్ను కొనసాగించిన మలేవర్ కేవలం 222 బంతుల్లోనే తన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని సాధించాడు. 21 ఏళ్ల మలేవర్ 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 203 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ జట్టు భారీ స్కోర్గా దూసుకుపోతుంది. 72 ఓవర్లు ముగిసే సరికి సెంట్రల్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అంతకుముందు కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం సూపర్ సెంచరీతో మెరిశాడు. పాటిదార్ కేవలం 96 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు.తొలి విదర్భ ప్లేయర్గా..ఇక ఈ మ్యాచ్లో ద్విశతకం సాధించిన మలేవర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ బ్యాటర్గా డానిష్ మాలేవర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ మలేవర్ అని తెగ వెతికేస్తున్నారు.ఎవరీ మాలేవర్..?21 ఏళ్ల మాలేవర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో ముంబై జరిగిన సెమీఫైనల్తో మాలేవర్ వెలుగు లోకి వచ్చాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 79 పరుగులు చేసిన మాలేవర్.. రెండో ఇన్నింగ్స్లో పరుగులు నమోదు చేశాడు. విదర్భ జట్టు ఫైనల్కు చేరడంలో డానిష్ కీలక పాత్ర పోషించాడు.అనంతరం కేరళతో జరిగిన ఫైనల్లో మలేవర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 153, రెండవ ఇన్నింగ్స్లో 73 పరుగులు చేసిన డానిష్.. విదర్భకు మరో రంజీ ట్రోఫీ టైటిల్ను అందించాడు. తన తొలి ఫస్ట్క్లాస్ సీజన్లోనే మలేవర్ తొమ్మిది మ్యాచ్లలో కలిపి 783 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఆర్ధ శతకాలు ఉన్నాయి. మాలేవర్ తన అద్భుత ప్రదర్శనలతో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మలేవర్కు రైట్ ఆర్మ్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది.చదవండి: హనుమా విహరి ఎంట్రీ..! ఆ జట్టుకు వీడ్కోలు పలికిన కెప్టెన్? -
దూసుకువస్తున్న బ్యాటింగ్ ‘బుల్లెట్’.. దేశీ క్రికెట్లో నయా సెన్సేషన్!
భారత దేశీ క్రికెట్ నూతన సీజన్కు గురువారం తెరలేచింది. డొమెస్టిక్ సీజన్ 2025-26లో భాగంగా దులిప్ ట్రోఫీ (Duleep Trophy) టోర్నమెంట్ బెంగళూరు వేదికగా మొదలైంది. ఈ రెడ్బాల్ టోర్నీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడుతుండగా.. రెండో క్వార్టర్స్ మ్యాచ్లో సెంట్రల్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్తో పోటీపడుతోంది.సెంట్రల్ జోన్ భారీ స్కోరుఅయితే, వర్షం కారణంగా కాస్త ముందుగానే తొలిరోజు ఆట ముగిసింది. తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ 75.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సెంట్రల్ జోన్ భారీ స్కోరు సాధించింది.డానిష్ మలేవర్ అద్భుత ఇన్నింగ్స్ఓపెనర్లలో ఆయుశ్ పాండే (Ayush Panday- 3) విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ అర్ధ శతకంతో మెరిశాడు. వంద బంతులు ఎదుర్కొన్న అతడు 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జట్టును నిలబెట్టే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ డానిష్ మలేవర్ (Danish Malewar) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.35 ఫోర్లు, ఒక సిక్సర్.. 198 పరుగులుతొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 219 బంతులు ఎదుర్కొన్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఏకంగా 35 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 198 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా విధ్వంసకర శతకం (96 బంతుల్లో 125)తో దుమ్ములేపాడు.ఇక యశ్ రాథోడ్ 32 పరుగులతో.. మాలేవర్తో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గురువారం నాటి ఆట ముగిసే సరికి 77 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి సెంట్రల్ జోన్ 432 పరుగులు చేసింది. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజమ్ జాటిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దూసుకువచ్చిన నయా బుల్లెట్.. డానిష్ మలేవర్దేశీ క్రికెట్లో ఛతేశ్వర్ పుజారా పరుగుల వరద పారించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ రికార్డు స్థాయిలో 66 శతకాల సాయంతో 21,301 పరుగులు సాధించాడు. ఇటీవలే పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు.అయితే, ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు ఫస్ట్క్లాస్ క్రికెట్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ.. అందరికీ టీమిండియా తలుపులు తట్టే అవకాశం రాకపోవచ్చు. కానీ విదర్భకు చెందిన డానిష్ మలేవర్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు.భారీ సెంచరీతన తొలి ఫస్ట్క్లాస్ సీజన్లోనే మలేవర్ తొమ్మిది మ్యాచ్లలో కలిపి 783 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఫిఫ్టీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్రేటు 51. తాజాగా మరో భారీ సెంచరీని మలేవర్ సాధించాడు. దానిని డబుల్ సెంచరీగా మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ‘నయా వాల్’ పుజారాకు వారసుడయ్యే లక్షణాలు మలేవర్లో దండిగా ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడే ఇలా అనడం తొందరపాటు చర్యే అయినా.. నిలకడగా అతడు ముందుకు సాగితే అదే నిజమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. నాగ్పూర్లో జన్మించిన 21 ఏళ్ల డానిష్ మలేవర్.. కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ కూడా!చదవండి: పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్