breaking news
dangerous accident
-
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
రైతు నెత్తిన మృత్యుతీగలు
గజ్వేల్: పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాద ఘంటికలను మోగిస్తూనే ఉన్నాయి. ఈ తీగలను సరిచేసి ప్రాణాలను కాపాడాలంటూ రైతులు వేడుకుంటున్నా పట్టించుకునే నా«థుడే కరువయ్యాడు. తాజాగా గజ్వేల్ మండలం అక్కారంలో రైతు మంద మల్లయ్య(55) తన పొలంలో వేలాడుతున్న వైర్లు తగిలి చనిపోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. గతంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన సమయంలో విద్యుత్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదన్న ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తం అవుతోంది. మల్లయ్య మాట పట్టించుకోని అధికారులు.. ఎప్పటిలాగే సోమవారం పొలానికి వెళ్లిన మల్లయ్య (55) వంగిన విద్యుత్ స్తంభం నుంచి వేలాడుతున్న కరెంటు తీగలు తాకి చనిపోయాడు. సపోర్ట్ లేకుండా పాతిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారిందని...దానిని సరి చేయాలని మల్లయ్యతోపాటు పరిసర పొలాల రైతులు వేడుకున్నా ఏ అధికారి పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట ఈదురు గాలులతో కూడిన వర్షంతో స్తంభం క్రమ క్రమంగా వంగిపోయి...వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. పరిష్కారం చూపని పవర్ డే.. 2015 జనవరి 17న వేలాడుతున్న విద్యుత్వైర్లు, వంగిన స్తంభాలను సరిచేయడంతోపాటు ఇళ్ల మధ్యన ప్రమాద ఘంటికలను మోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలం చెల్లిన కండక్టర్ వైర్లు, ఏబీ స్విచ్లు లేని ట్రాన్స్ఫార్మర్లు, పంట పొలాల్లో వేలాడుతున్న వైర్లను సరిచేయడం తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఎస్ఈ మొదలుకొని వివిధస్థాయిల అధికారులు గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై ‘పవర్ డే’ చేపట్టారు. నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున 600మందికిపైగా ఏకకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలావరకు అధికారులు సమస్యలపై సర్వే చేపట్టి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు తయారుచేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక మండలాల్లోని పలు గ్రామాల్లో జరిపిన సర్వేలో 1549 విరిగిన స్తంభాలు, 604 వంగిన స్తంభాలు, మధ్యలో వేయాల్సిన స్తంభాలు 3001, వేలాడుతున్న వైర్లు 1391, ఇళ్లమీద ఉన్న స్తంభాలు 1217 కావాల్సిందిగా అధికారులు తేల్చారు. ఏబీ స్విచ్లులేని ట్రాన్స్ఫార్మర్లు 258, ఎస్జీ ఫ్యూజ్లు లేని ట్రాన్స్ఫార్మర్లు 228, ఎర్తింగ్ సక్రమంగాలేని ట్రాన్స్ఫార్మర్లు 632, దిమ్మెలు సరి గాలేని ట్రాన్స్ఫార్మర్లు 91, కాలం చెల్లిన కండక్టర్ వైరు 87 కిలోమీటర్లు, వీధిలైట్లు ఆన్ఆఫ్ చేయడానికి కావాల్సిన వైరు 303 కిలోమీటర్లు, మరో 1099 స్విచ్లు కావాలని గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లు వరకు వెచ్చించారు. కానీ పంట పొలా ల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. ఫలితంగా పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృతదేహం వద్ద రోదిస్తోన్న బంధువులు గతంలో ప్రమాదాలు.. - వర్గల్ మండలం సామలపల్లిలో ట్రాక్టర్పై గడ్డి నింపుకుని వస్తున్న యువరైతు నాగులపల్లి కేశవరెడ్డి గతనెల 13న కరెంటు తీగలకు తగిలి మృత్యువాతపడ్డాడు. - ఇదే మండలంలోని నాచారంలో ఆరు నెలల క్రితం ఓ రైతు కరెంటు షాక్తో చనిపోయాడు. - ఏడాది క్రితం తున్కిమక్త లో కరెంటు ప్రసరిస్తున్న ఇ నుప స్తంభం తాకి రెండు ఎ ద్దులు మృత్యువాతపడ్డాయి. - అక్కారంలో 2013 డిసెం బర్ 26న సింగిల్ ఫెజ్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఊరంతా షాక్ వచ్చింది. ఈ ఘటనలో రాజు, చంద్రయ్య అనే ఇద్దరు మృతి చెందగా. అనేక మంది గాయాల పాలయ్యారు. -
స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం
ముంబై: బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్ పైభాగం(రూఫ్) ఒక్కసారిగా కుప్పకూలింది. షారుక్ కూర్చున్న సీటు దగ్గర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు. కాగా, షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్ వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్ను నిలిపేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షారుక్ సరసన అనుష్కశర్మ, కత్రినా కైఫ్లు నటిస్తున్నారు. షారుక్ మరుగుజ్జుగా, అనుష్క మానసిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జబ్ తక్ హై జాన్ తర్వాత ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. -
ప్రాణాలతో బయటపడ్డ బైక్ రైడర్