breaking news
Daggupati Venkateswara Prasad
-
దమ్ముంటే రారా చూసుకుందాం!
‘‘నేను నీపేరు వాడుకున్నానా...నీ బతుక్కి అనంతపురంలో పార్టీ కార్యాలయం పెట్టే పరిస్థితి లేకపోతే నా ఇళ్లు ఇచ్చా. నీ కోసం కేసులు మోసుకున్నా..జైలుకు వెళ్లా...ఇంత చేస్తే...నన్ను వాడు...వీడు అంటావా...దమ్ముంటే రారా చూసుకుందాం’’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై అతని నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యాలయంలో గంగారాం తన అనుచరులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఏకంగా ఎమ్మెల్యే దగ్గుపాటిని ఉద్దేశించి బండబూతులు తిట్టినట్లు సమాచారం. ‘‘ఆ్రఫ్టాల్ ఎంపీపీవి.. ఎమ్మెల్యే స్థాయికి రావడానికి నేనే కారణం’’ అంటూ గంగారాం బాహాటంగానే విమర్శించినట్లు టీడీపీ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తోంది. అసలు వివాదం ఏమిటంటే ఇటీవల బెంగళూరులో ఓ సామాజికవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నగరానికి చెందిన టీడీపీ నేత ఒకరు...‘‘ గంగారాంను వాడుకుని జైలు పాలు చేశావు కదయ్యా’’ అని అన్నారు. దీంతో సహనం కోల్పోయిన దగ్గుపాటి ప్రసాద్ అందరిముందే గంగారామ్ను బండబూతులు తిట్టినట్లు చర్చ జరుగుతోంది. ‘‘గంగారాం ఎంత అతని బతుకెంత... నా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడతాడా‘‘ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ విషయం అక్కడున్న వారి ద్వారా తెలుసుకున్న గంగారామ్ తీవ్ర అవమాన భారానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నట్లు తెలిసి అనుచరులతో కలిసి అక్కడికే వెళ్లాడు. అయితే ఎమ్మె ల్యే పార్టీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ గంగారామ్ వస్తున్నట్లు తెలిసి తాను లేనట్లు అనుచరులతో చెప్పించారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారామ్ ఎమ్మెల్యే దగ్గుపాటి.. చేసిన మేలు మరచిపోయాడంటూ చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అప్పటికప్పుడు తన అనుచరులను పిలిపించి గంగారామ్పై ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్లు...జైలు ఎమ్మెల్యే దగ్గుపాటికి నమ్మిన బంటుగా ఉన్న గంగారామ్.. నగరంలో విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. నగరంలో ఒక వైన్ షాప్లో వాటాలు ఇవ్వలేదని నిప్పు పెట్టిన ఘటనలో గంగారాం అరెస్ట్ అయ్యారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపైనా డబ్బులు ఇవ్వాలని బెదిరించిన ఘటనలోనూ గంగారాం ప్రధానంగా ఉన్నారు. గంగారాంను కరివేపాకులా తీసి పారేసిన ఎమ్మెల్యే వైఖరిపై భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే.. గంగారాం వైఖరి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అనంతపురం నగరంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల ఏకంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి వైఖరిపై ప్రెస్మీట్ పెట్టి ఏకిపారేశాడు. దగ్గుపాటి రూ.200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆధారాలతో సహా అధిష్టానానికి ఇచ్చామంటూ పేర్కొనడంతో నగరంలో టీడీపీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. -అనంతపురం చదవండి: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’ -
ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే
అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నెలవారీ మామూళ్ల వసూళ్లకు ఒత్తిడి తెచ్చారంటూ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. అనంతపురం అర్బన్లో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో నెలకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే సెలవుపై వెళ్లిపోవాలని తనను ఎమ్మెల్యే బెదిరించినట్లు రమణారావు పేర్కొన్నారు.ఈ మేరకు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి నుంచే నేరుగా ఈ అభియోగాలు రావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఇదే సమయంలో మున్సిపల్ కాంట్రాక్టర్ శ్రీనివాస చౌదరితో ఎమ్మెల్యే మాట్లాడినట్లుగా ఉన్న మరో ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ‘‘నెలనెలా డబ్బులు తీసుకుని పో.. వర్కులు చేయొద్దు’’ అని కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.నెలనెలా డబ్బు తీసుకో.. వర్కులు వద్దుశ్రీనివాస చౌదరి అనే కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జరిపిన సంభాషణకు సంబంధించి మరో ఆడియో బైటకొచ్చింది... తమ మధ్య బంధుత్వం ఉందని ప్రస్తావిస్తూ, ‘‘నీకేం కావాలో చెప్పు.. నేను చేసి పెడతా.. ప్రతి నెలా డబ్బులు తీసుకుని పో.. వర్కులు చేయొద్దు’’ అని ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. కాంట్రాక్టర్ తనకు పనులు కావాలని అడిగినట్లు చెప్పగా.. అందుకు బదులుగా నెలవారీగా డబ్బులు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లుగా సంభాషణ సాగింది. ఇదే ఆడియో సంభాషణలో అనంతపురం టీడీపీ అంతర్గత రాజకీయాలు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి (వీపీసీ)తో శ్రీనివాస చౌదరి సంబంధాలు, పార్టీ వర్గాల మధ్య విభేదాల ప్రస్తావన కూడా ఉంది. దీంతో ఈ ఆడియో కేవలం కాంట్రాక్టర్ వ్యవహారానికే పరిమితం కాకుండా స్థానిక టీడీపీ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.గతంలోనూ దగ్గుపాటిపై వివాదాలెన్నో..అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను ఇటీవలి కాలంలోనే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్పై దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు దాడి చేశారు. రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఎగ్జిబిషన్ నిర్వహించనీయబోమని ఈ ఏడాది జనవరిలో బెదిరించారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మద్యం సేవించి ఎగ్జిబిషన్లో హంగామా స్పష్టించారు. ఫకృద్దీన్ నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ⇒ వార్–2 సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసనలు తెలిపి, ఫ్లెక్సీలను చించేశారు. ⇒ ఈ ఏడాది జనవరిలో ఆస్తి తగాదా విషయంలో ఒక మహిళా డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దుర్భాషలాడారు. దీనికి సంబంధించి ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అయింది. ⇒ ఎమ్మెల్యే అనుచరులు అనంతపురం అర్బన్ పరిధిలో పలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే రూ.200 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఆధారాలతో సహా టీడీపీ అధిష్టానానికి అందజేశారు.⇒ అనంతపురం నగరంలో ఓ లిక్కర్ షాపులో వాటాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో దౌర్జన్యంగా లిక్కర్ షాపునకు నిప్పు పెట్టారు. ఈ వివాదంలో ఎమ్మెల్యే అనుచరులను రిమాండ్కు తరలించారు. -
మరో వివాదంలో టీడీపీ MLA దగ్గుపాటి ప్రసాద్.. సంచలన ఆడియో
-
AP: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్ చౌదరి ఘాటుగా ఆరోపణలు చేశారు. ‘గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ త్యాగం చేశాను. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నా వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అణచివేత కు పాల్పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూకబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలన్నీ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయను. డీలిమిటేషన్ జరిగితే... మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం’ అని స్సష్టం చేశారు. -
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వేదికగా మారింది. గత జనవరిలో పాలకవర్గం కొలువు దీరిన నాటి నుంచి మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, వైస్ చైర్మన్ అర్షదుల్లా మధ్య మాటలు లేవు. కొందరు డైరెక్టర్లు అటు ఇటు ఉండగా.. మరికొందరు ఇరు వర్గాలకూ దూరంగా ఉంటున్నారు.ఇదే అదనుగా మార్కెట్ యార్డు తనకే రాసిచ్చారన్నట్లుగా చైర్పర్సన్ బల్లా పల్లవి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా చైర్పర్సన్ తనదైన శైలిలో వైస్ చైర్మన్, డైరెక్టర్లను కట్టడి చేసి ఏకపక్షంగా వెళుతున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైస్ చైర్మన్గా, డైరెక్టర్లుగా తమకు పార్టీ గొప్ప అవకాశం కల్పించినట్లు సంబరపడుతూ పదవులు అనుభవిస్తామని, సంపాదించుకుంటామని అనుకున్న వారు మొదట్లో నెల రోజుల పాటు హడావుడి చేసినా ఇప్పుడు పలకరించేవారు లేక డీలా పడ్డారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారం, బాధ్యతలు తీసుకున్న రోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆర్భాటం చేసిన చైర్పర్సన్ పల్లవి.. ఆ తర్వాత ఎమ్మెల్యేకు దూరమయ్యారు.ప్రధానంగా మార్కెట్ యార్డులో వేబ్రిడ్జి (లారీ కాటా) విషయంలో చైర్పర్సన్ భర్త బల్లా సురేష్కు ఎమ్మెల్యే దగ్గుపాటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సహకారంతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు నిధులు సమీకరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కొందరు ఇటీవల మార్కెట్ యార్డుకు వచ్చి బల్లా పల్లవిని కలిసి వెళుతుండటం జరుగుతోంది. అదే విధంగా టన్నుకు ఇంత అని చీనీ మార్కెట్, వారానికి ఇంత మొత్తం అని పశువులు, జీవాల సంతల్లో చైర్పర్సన్ పల్లవి డిమాండ్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, అలాగే కమీషన్లు దక్కకపోవడం లాంటి కారణాలతో ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్రంగా పరిగణించి చైర్పర్సన్ బల్లాపల్లవి వ్యవహారంపై దృష్టి సారించి వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. -
నా కొడకా రేయ్.. బండ బూతులతో టీడీపీ ఎమ్మెల్యే రౌడీయిజం
-
ఒక ఎమ్మెల్యే అయ్యుండి.. కొంచమైనా సిగ్గుండాలి
-
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆస్రాకంటి ఆసుపత్రి యాజమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.కాగా, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయనకు కేటాయించిన గన్మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్మెన్తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురు దెబ్బ
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన గన్మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్మెన్తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు అనంతపురం రాజకీయ వాతావరణంలో కొత్త మలుపు తిప్పింది. -
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.


