breaking news
D-Mart shares
-
అదరగొట్టిన డీమార్ట్, మార్కెట్ క్యాప్ జూమ్
సాక్షి, ముంబై: ముంబైకి చెందిన డీమార్ట్ సూపర్మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్మార్ట్స్ షేరు మరోసారి అదరగొట్టింది. సోమవారం నాటి నష్టాల మార్కెట్లో కూడా 11శాతం ఎగిసి రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. లిస్టింగ్ ధర నుంచి ఏకంగా నాలుగు రెట్లు ఎగిసింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డీమార్ట్ బీఎస్ఇలో 18 వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. తద్వారా మార్కెట్ క్యాప్ పరంగా బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే లను అధిగమించింది కాగా గత వారం, అవెన్యూ సూపర్మార్ట్స్, 4,098 కోట్ల వరకు సేకరణకుగాను అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ (క్యూఐపి)ప్రారంభించింది. ఈ క్యూఐపీ ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 1,999.04 చొప్పున విక్రయిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి రూజ1,999.04 చొప్పున విక్రయిస్తామని తెలిపింది. ఈ నిధులను తన స్టోర్ నెట్వర్క్ను విస్తరించడానికి, సరఫరా గొలుసులో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తిరిగి చెల్లించడానికి వినియోగించనుంది. కాగా 2002 లో ముంబైలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించగా, డిసెంబర్ 31, 2019 నాటికి కంపెనీకి 196 దుకాణాలు డిమార్ట్ సొంతం. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం రూ. 6,809 కోట్లుగా ఉంది, రూ. గతేడాది ఇదే కాలంలో 5,474 కోట్లు. నికర లాభం రూ. 384 కోట్ల నికర లాభాలను సాధించింది. -
లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్
ముంబై : లిస్టింగ్ తొలిరోజే డీ-మార్ట్ అదరగొట్టింది. డీ-మార్ట్ సూపర్ చెయిన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తో మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రిటైల్ చెయిన్ షేర్లు 106 శాతం పైకి ఎగిసి రూ.616.25 గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ షేర్ల ఇష్యూ ధర కేవలం రూ.299 మాత్రమే. దీంతో డీ-మార్ట్ షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. ఈ నెల మొదట్లో ఐపీఓకి వచ్చిన డీ-మార్ట్ రూ.1870 కోట్ల నిధులను సమీకరించింది. గతేడాది అక్టోబర్ లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ. మార్నింగ్ సెషన్లో 104.8 శాతం పెరిగిన డీ-మార్ట్ మరింత పెరిగి రూ.615 గరిష్ట ధరను తాకింది. 2002లో మొదటిసారి ముంబైలో తొలి స్టోర్ ఇది ఏర్పాటుచేసింది. తర్వాత విస్తరించుకుంటూ వెళ్లిన డీ-మార్ట్ 2017 జనవరి 31 నాటి 118 అవులెట్లను ఏర్పాటుచేసింది. 2016 డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల కాలవ్యవధిలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.8803 కోట్లగా నమోదయ్యాయి. నికర లాభాలు సైతం రూ.387.47 కోట్లగా ఉన్నాయి.