-
వేదాలు సంస్కృతికి చిహ్నాలు
భైంసా(ముథోల్) : వేద విద్య దేశవ్యాప్తం చేయాలని, వేదాలు సంస్కృతికి చిహ్నాలని వేద భారతి విద్యాపీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానంద స్వామీజీ అన్నారు. బాసరలో నిర్వహిస్తున్న క్షేత్రియ వైదిక సమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తరలివచ్చి న 108 మంది విశిష్ట వేద పండితులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. వేదమే దేశానికి మూలమని, ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు వేద విద్యను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. గోదారమ్మకు 108 రోజులుగా నిత్యహారతి ఇస్తూనే ఉన్నామని, సూర్యచంద్రులున్నంత వరకూ హారతి కొనసాగుతూనే ఉంటుందన్నారు. బాసర అభివృద్ధికి కృషి : మంత్రి ఐకే రెడ్డి బాసర ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. రూ.50కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాసరలో ఉన్న వేద విద్యాలయానికి ప్రభుత్వం నుంచి ఏటా రూ.10లక్షలు అందిస్తామని, ఇందుకు సంబంధించి మార్చి మొదటి వారంలో రూ.10 లక్షల చెక్కు అందజేస్తామన్నారు. నిత్యహారతి ఘాట్కు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని లెక్కించి వర్షకాలంలోనూ నిత్యహారతి ఘాట్ నీటిలో మునగకుండా షెడ్ నిర్మిస్తామన్నారు. నిత్యహారతితో బాసరకు భక్తులు పెరిగారన్నారు. బాసర అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు మంత్రి అల్లోల దంపతులు నిత్యహారతి ఘాట్ వద్ద నిర్వహించిన హోమపూజలో పాల్గొన్నారు. వేద పాఠశాల నుంచి వెలువడనున్న ‘జై శ్రీ వేదం’ మాస పత్రికను ఆవిష్కరించారు. నేత్రానందంగా సాగిన నిత్యహారతిలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేశారు. -
ఆరోగ్య ప్రాప్తిరస్తు..!
నేటి సమాజం పెద్దల మాటలను చద్దిమూటలుగా తీసిపారేసి... కొత్తొక వింత అన్నట్టుగా వేలంవెర్రిగా వింతపోకడలు పోతోంది. మన ఆరోగ్యం కోసం పతంజలి ఏనాడో రాసిపెట్టిన యోగ శాస్త్రాన్ని విస్మరించి తలనొప్పి వచ్చినా...కడుపునొప్పి వచ్చినా...ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు,లక్షలు వదిలించుకుంటున్న మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడాలి. యోగశాస్త్రంలో ఏ ఆసనం వేస్తే ఏ రోగం తగ్గించుకోవచ్చో కూడా వివరంగా ఉంది. చక్రాసనం వేస్తే చాలు గుండెజబ్బును ఆమడదూరంలో ఉంచవచ్చు. భుజంగాసనం వేస్తే శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడక్కరలేదు. పశ్చిమోత్తాసనం వేస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పవనముక్త ఆసనం వేస్తే గ్యాస్ ట్రబుల్ బలాదూర్..పంచిమూతన ఆసనం వేస్తే మధుమేహం పరార్..ఇలా ఆసనాలతోనే రోగాలను తరిమివేసే అద్భుత శాస్త్రం మన చేతుల్లోనే ఉంది. ఇక మనమూ ఆసనాలు వేద్దామా మరి... నరసరావుపేట ఈస్ట్, న్యూస్లైన్ : భారతదేశ సంస్కృతిలో యోగా ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనానికి ఉపయుక్తం కలిగించేందుకు భారతదేశం అందించిన అత్యుత్తమమైన శాస్త్రాలలో యోగశాస్త్రం ప్రముఖమైంది. పూర్వం పతంజలి మహర్షి యోగశాస్త్రను రచించారు. అందులో ఒక భాగమే యోగాసనాలు. భూమి పైన 84 లక్షల జీవరాసులుంటే, 84 రకాల ఆసనాలున్నాయి. వీటిలో స్త్రీ, పురుషులు సులభంగా చేయగలిగే యోగాసనాలు (భంగిమలు) 42 వరకు ఉన్నాయని యోగాసనాల శిక్షకులు చెబుతున్నారు. ప్రతి ఆసనానికి దేనికదే దాని ప్రత్యేకతలు, పద్ధతులు ఉన్నాయి. యోగ సాధన ద్వారా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, విజ్ఞానం ప్రాప్తిస్తాయి.యోగాకు తోడు ప్రాణాయామం, ధ్యానం చేయడంతో మానవ జీవితం ఆనందంగా ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారు సైతం సాధన చేయవచ్చు.యోగావల్ల ఎటువంటి రోగాలైనా త్వరితంగా అధీనంలోకి రావడంతోపాటు మరికొంత సాధనతో పూర్తిగా తగ్గించుకోవచ్చని యోగాచార్యులు చెబుతున్నారు. యోగాసనాలపై అందరికి అవగాహన కల్పిస్తూ, ఉచితంగా నేర్పిస్తున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగా యోగం అంటే కలయిక. యోగా శారీరక, మానసిక, బుద్ధిపరమైన రుగ్మతలను తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. యోగాసనాల ద్వారా శరీరంలోని కండరాలకు వ్యాయామం అవుతుంది. నిత్యం యోగా సాధన ద్వారా రోగనిరోధకశక్తి పెరిగి, శారీరక రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతకు, బుద్ధి మాంద్యం తగ్గించడంతో పాటు ఆధ్మాత్మికోన్నతికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ యోగా పట్ల ఆసక్తిని చూపుతున్నాయి. 84 రకాల యోగాసనాలు యోగాసనాలు (భంగిమలు) మొత్తం 84 ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 42 రకాల ఆసనాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నిత్యం బ్రహ్మీ ముహూర్తం (ఉదయం 3-6 గంటలమధ్య) సమయంలో యోగసాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఆయుర్వేద, హోమియో, ఇంగ్లిష్ మందుల అవసరం లేకుండానే కేవలం యోగసాధన ద్వారానే బి.పి, షుగర్, ఆస్తమ, గ్యాస్, నడుమునొప్పి, ైథైరాయిడ్, స్త్రీ రుతుక్రమ దోషాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చని యోగా మాస్టర్లు గట్టిగా చెబుతున్నారు. ఏ వ్యాధికి ఏ ఆసనం ఉపయుక్తం..? వివిధ శారీరక రోగాలకు వివిధ భంగిమలలో సాధన చేయాల్సి ఉంటుంది. మధుమేహం(షుగర్)కు - పంచిమూతన ఆసనం, గ్యాస్ట్రబుల్కు - పవనముక్త ఆసనం, గుండెజబ్బుకు - చక్రాసనం, శ్వాసకోస వ్యాధులకు - భుజంగాసనం, జీర్ణక్రియకు - పశ్చిమోత్తాసనం, ఉబ్బసం - ఉష్ట్రాసనం, మలబద్దకానికి - ఉదరాకర్షణాసనం, శరీరంలో రక్తప్రసరణకు మయూరాసనం, థైరాయిడ్ సమస్యలు, సర్వఅంగాల ఉత్తేజానికి సర్వాంగాసనం, నడుములో కొవ్వును తగ్గించుకోవడానికి - త్రికోణాసనాలను సాధన చేయాలంటారు గురువులు. వీటితోపాటు పెరాలసిస్, ఫిట్స్, కిడ్నీ, మొండిరోగాలైన చర్మవ్యాధులు సైతం ఆసనాలతో దూరం అవుతాయని చెబుతారు. ఆసనాలతో పాటుగా సుఖప్రాణాయామం, నాడీశోధన ప్రాణాయామం, బస్త్రిక ప్రాణాయామం సాధనవల్ల మానసిక ప్రశాంతత పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా యోగసాధన చేయదలచినవారు ముందుగా యోగాలో మంచి శిక్షణ తీసుకున్న మాస్టర్స్ వద్ద కొంతకాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. యోగాతో అన్ని రుగ్మతలు తొలుగుతాయి యోగసాధనతో శారీరక, మానసిక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. వత్తిడిని జయించవచ్చు, చక్కని నిద్రకు, బరువు తగ్గడానికి యోగా ఉపయోగపడుతుంది. యోగభంగిమలతో సకల రోగాలను దూరం చేసుకోవచ్చు. గత 12 ఏళ్లుగా నిత్యం యోగాసనాలలో శిక్షకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పటికీ 114 యోగశిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి, వేలమందికి శిక్షణ ఇచ్చాము. -కూనిశెట్టి వెంకట జనార్ధన్ గురూజీ,శ్రీవెంకటేశ్వర యోగసేవాకేంద్రం, పరికల్ప యోగి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement