Credit Guarantee Fund
-
రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సంక్షోభం వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలను ఆదుకునేందుకు సుమారు రూ.2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకున్న ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్జీఎస్) తరహాలోనే ఈ నూతన ప్యాకేజీ ఉండబోతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.వ్యాపారాలకు రక్షణ కవచంప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఈ పథకం ఊపిరి పోయనుంది. ఇందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.ఈ పథకం కింద వ్యాపారాలు పొందే రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్సీజీటీసీ) ద్వారా 90 శాతం క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది. ఒకవేళ రుణగ్రహీత డిఫాల్ట్ అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.ఈ పథకం సుమారు నాలుగేళ్ల పాటు అమలులో ఉండే అవకాశం ఉంది.వివిధ రంగాలు, ఉప-రంగాలకు సుమారు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.గత అనుభవాల దృష్ట్యా రుణాలను చౌకగా అందించేందుకు బ్యాంకుల వడ్డీ రేటును 9.25 శాతం, ఎన్బీఎఫ్సీల వడ్డీ రేటును 14 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉంది.అసలు మొత్తం తిరిగి చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం లభిస్తుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.విమానయాన, ఎంఎస్ఎంఈ రంగాలపై ప్రత్యేక దృష్టిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాల మళ్లింపు, ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ రంగానికి తక్షణ మద్దతు అవసరమని అధికారులు గుర్తించారు. ‘ప్రస్తుతం లిక్విడిటీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విమానయానం, ఎంఎస్ఎంఈలు, ఇతర కీలక వ్యాపారాలకు అండగా నిలవడమే మా ప్రాధాన్యత. ఇరాన్ సంక్షోభం వల్ల విమానయాన కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మద్దతు అవసరం’ అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
లఘు, చిన్న పరిశ్రమలకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా ఇచ్చే క్రెడిట్ గ్యారెంటీలను వచ్చే రెండేళ్లలో మరో రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదనపు కార్యదర్శి, డెవెలప్మెంట్ కమిషనర్ (లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) రజ్నీష్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, 22 సంవత్సరాల్లో క్రెడిట్ గ్యారెంటీలు రూ.2.6 లక్షల కోట్లు. అయితే గడచిన రెండేళ్లలో ఈ విలువ రూ. 4 లక్షల కోట్లకు పెరిగింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యమని ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. లఘు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంస్థాగత రుణలను భారీగా అందించడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ను సంబంధిత మంత్రిత్వశాఖ అలాగే సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. -
త్వరలో స్టార్టప్ ఫండ్కు గ్రీన్ సిగ్నల్
వచ్చే నెలాఖర్లో క్యాబినెట్ ఆమోదానికి అవకాశం న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన రూ. 2,000 కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ వచ్చే నెలాఖర్లోగా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పూచీకత్తు లేకుండా స్టార్టప్ సంస్థలు రుణాలు పొందేందుకు ఈ ఫండ్ తోడ్పడగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. నిధి ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ గత వారం ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. మూడేళ్ల వ్యవధిలో ఈ ఫండ్ కింద రూ. 2,000 కోట్ల రుణ వితరణ చేయనున్నారు. ఒకో స్టార్టప్నకు గరిష్టంగా రూ.5 కోట్లు లభిస్తాయని, సుమారు 7,500 స్టార్టప్ సంస్థలకు ప్రయోజనం చేకూరగలదని అభిషేక్ తెలిపారు. అదనంగా మరో రూ. 15,000 కోట్ల ఫండింగ్కు ఇది తోడ్పడగలదని చెప్పారు. 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన తర్వాత నుంచి వివిధ స్టార్టప్లకు రూ. 960 కోట్లు వితరణ చేసినట్లు తెలిపారు. సార్క్ స్టార్టప్ల సమావేశం... వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ సంస్థలు పరస్పరం సహకరించుకునేందుకు వేదిక కల్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణాసియా ప్రాంత దేశాల కూటమి (సార్క్)లోని స్టార్టప్ సంస్థల సదస్సు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. దీనికి స్టార్టప్స్ నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. వచ్చే కొద్ది నెలల్లో అభిప్రాయాలు అందితే.. డిసెంబర్లోనే స్టార్టప్ సదస్సు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.


