breaking news
Crazy combinations
-
వెండితెరపై స్టార్స్ను కలిపిన సూపర్ హిట్ కథలు
కొన్ని కథల్లో అతిథి పాత్రలకు కూడా ‘స్టార్’ రేంజ్ యాక్టర్లు కావాల్సి వస్తుంది. కథలో ఆ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆప్రాధాన్యాన్ని గ్రహించి అతిథి పాత్రలకు స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ని కొన్ని కథలు కలిపాయి. ఆ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. కల్కి కలిపింది ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్హాసన్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండరీ నటులను, ఒక స్టార్ డైరెక్టర్ని ‘కల్కి’ కలిపింది. భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని ΄ోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్. అమితాబ్ క్యారెక్టర్ మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రను ΄ోలి ఉంటుందని భోగట్టా. అలాగే కమల్హాసన్ విలన్ పాత్ర ΄ోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిది అతిథి పాత్ర. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని జనవరి12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నప్పలో శివుడు? మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నారు. ఈ మూవీకి ‘మహాభారత’ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించ నున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు, నిర్మాత మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల శ్రీకాళహస్తిలోప్రారంభమైంది. శివ భక్తుడైన కన్నప్ప, ఆయన భక్తి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నప్పగా మంచు విష్ణు నటించనున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని టాక్. కోలీ స్టార్తో టాలీ స్టార్ ‘సార్’ వంటి హిట్ సినిమా తర్వాత తమిళ హీరో ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండో స్ట్రయిట్ ఫిల్మ్ ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. నాగార్జున పుట్టినరోజుని (ఆగస్టు 29) పురస్కరించుకుని ‘డీ 51’ చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రంలో ఆయన నటించనున్న విషయాన్ని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్రకి చాలాప్రాధాన్యం ఉందని టాక్. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తారు. వార్కి సిద్ధం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియాని మించిన స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు హీరో ఎన్టీఆర్. ఇప్పటివరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఆయన తొలిసారి పరభాషా చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ‘వార్ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ రూపొందనుంది. -
తండ్రీకూతుళ్ల చిత్రానికి 29న శ్రీకారం
క్రేజీ కాంబినేషన్ చిత్రాలు చాలానే తెరకెక్కుతుంటాయి. అయితే అసలు క్రేజీ అనే పదానికి నిర్వచనంగా ఒక చిత్రానికి శ్రీకారం జరగనుంది. విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు, అత్యంత పాపులర్ నటి శ్రుతిహాసన్ కలిసి నటిస్తే చూడాలన్న ఆసక్తి, ఆశ చాలా కాలంగా చాలా మందికి ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ కాంబినేషన్లో చిత్రం చాలా కాలంగా ఊరిస్తుందనే చెప్పాలి. అది ఇన్నాళ్లకు నిజం కానుంది. ఎస్ కమలహాసన్ ఆయన వారసురాలు శ్రుతిహాసన్ కలిసి నటించనున్న చిత్రం ఈ నెల 29న ప్రారంభంకానుంది. దీనికి కమలహాసన్ ఒక మంచి వినోదంతో కూడిన తండ్రీకూతుళ్ల అనుబంధాల కథను ఎంపిక చేసుకున్నారు. దీనికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఈయన కమలహాసన్తో ఇంతకు ముందు చాణక్యన్ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజా చిత్రాన్ని కమల్ రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 41వ చిత్రం అవుతుంది. దీనికి హాస్యనటుడు, కథకుడు క్రేజీ మోహన్ సంభాషణలు అందించడం విశేషం అయితే చాలా సుదీర్ఘ గ్యాప్ తరువాత ఇసైజ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనుండడం మరో విశేషం. వీరి కలయికలో ఇంతకు ముందు పలు భాషల్లో వందకు పైగా చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ముంబై ఎక్స్ప్రెస్నే కమల్, ఇళయరాజాల కాంబినేషన్లో రూపొందిన చివరి చిత్రం. ఇకపోతే ఇందులో ముఖ్య పాత్రను నటి రమ్యక్రిష్ణ పోషించనుండడం మరో విశేషం. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమలహాసన్ స్థానిక టీ.నగర్, హబిబుల్లా రోడ్డులో గల నడిగర్ సంఘం ఆవరణలో నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా వెల్లడించారు.