-
బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt — ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022 -
గో హత్యలు అరికట్టే వరకు పోరాటం ఆగదు
ఖైరతాబాద్: గో రక్షకులు, గో సైనికులపై పోలీసుల దాడులను ఖండిస్తూ, వారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 26న ఇందిరాపార్క్ వద్ద ‘గో రక్షా’ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు యుగతులసి చైర్మన్ కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు గో రక్షకులపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 125 కేసులు నమోదు చేశారన్నారు. ఆరు నెలల వ్యవధిలో 3500 గోవులను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి రక్షించి గో శాలల్లో చేర్చడం జరిగిందన్నారు. గో రక్షణలో చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గో రక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 26న ఉదయం 10గంటలకు ఇందిరాపార్క్ వద్ద గో రక్షా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గో రక్షణ కోసం హింధువులు, గో బంధువులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గో రక్షా దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న శివకుమార్ తదితరులు -
మనలో కరువైంది ఇదే.. ఆవును చూసి నేర్చుకోవాల్సిందే!
కొందరు వ్యక్తులు మూగజీవాలపట్ల కఠినంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను రాళ్లతో, కర్రలతో కొడుతూ.. పైశాచికానందాన్ని పొందుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా మన చుట్టు జరుగుతుంటాయి. చాలా వరకు.. మూగజీవాలపై ఎవరైన దాడిచేస్తుంటే..పక్కనున్నవారు వద్దని వారిస్తుంటారు. అయితే, ఒక్కొసారి ఇలాంటి దుర్మార్గులకు కాలం, కర్మ తగిన గుణపాఠం చెబుతాయి. తాజాగా, ఇలాంటి ఆసక్తికర వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి.. వీధిలో ఉన్న శునకాన్ని పట్టుకుని పైకి లాగి అమానుషంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దాని రెండు చెవులు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడు. పాపం.. ఆ బాధకు తాళలేక కుక్క గట్టిగా విలవిల్లాడిపోయింది. శునకం.. బాధతో అరుస్తుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఏ ఒక్కరు కూడా... అతగాడి చర్యలను ఆపటానికి ప్రయత్నం చేయడంలేదు. శునకం అరుపులు విన్న ఒక ఆవు అటుగా వచ్చింది. వెంటనే కుక్కను పట్టుకుని హింసిస్తున్న వ్యక్తిపై కొమ్ములతో దాడికి తెగబడింది. అతడిని.. తన రెండు కొమ్ములతో లేపి కిందపడేసి కుమ్మింది. ఆ శునకాన్ని దుర్మార్గుడి బారి నుంచి తప్పించింది. ఈ ఘటనతో అక్కడివారంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని అటవీశాఖాధికారి సుషాంత్ నందా.. ‘కర్మ ఫలం’ అనుభవించాల్సిందే.. అంటూ తన ట్విటర్ ఖాతాలో కామెంట్ను జతచేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు..‘పాపం.. శునకం.. ఎంత బాధతో అరుస్తుంది.. ’, ‘ నీకు చేతులేల వచ్చాయి.. ’,‘మనుషుల కన్నా.. నోరులేని జీవులే నయం..’,‘ కర్మఫలం.. అనుభవించాల్సిందే..’, ‘ఒక నోరులేని జీవి బాధ.. మరో మూగ జీవికే అర్థం అవుతోంది’ అంటూ ఆవుపై ప్రశంసలు కురిపిస్తూ... కామెంట్లు పెడుతున్నారు. Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6 — Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021 -
కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్నగర్, శ్రీనివాసనగర్ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. పార్క్ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
కొమ్ములతో పొడిచి.. గుండెలపై తొక్కి
సాక్షి, మునుగోడు(నల్గొండ) : పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం ఒక ఎద్దుతో పాటు ఒక ఆవును ఏడాది క్రితం కొనుగోలు చేశాడు. వాటిని వ్యవసాయ పనుల కోసం వినియోగించుకొని బావి వద్దనే కొట్టంలో కట్టేసేవాడు. ఆవు పాలు కూడా ఇచ్చేది. పాపయ్య రాత్రి వ్యవసాయ బావి వద్దనే పడుకుని ఉదయాన్నే ఆవుపాలు పిండుకుని ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లిన అతను మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో అతని కుమారుడు నరేష్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా, తండ్రి తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఆవు నరేష్ వెంట పడడంతో అతను తప్పించుకుని గ్రామానికి చేరుకున్నాడు. మరికొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి బావి వద్దకు వెళ్లి ఆవును పట్టుకుని కట్టేశారు. పాపయ్యను చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆవుకి నీళ్లు తాపే సమయంలో ఆయనని పొడిచి కింద పడేసి గుండెపై కాళ్లతో తొక్కడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆవు అప్పుడప్పుడు పొడిచేందుకు వచ్చేదని, ఇలా చంపుతదని అనుకోలేదని రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కె. రజినీకర్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement