breaking news
Cough medicine
-
చిన్నారులకు దగ్గుమందు వాడకండి: కేంద్రం
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు వికటించి 11 మంది చిన్నారుల వరకూ మృత్యువాత పడటంతో కేంద్రం అప్రమత్తమైంది. దగ్గుమందును రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దని తెలిపిన కేంద్రం.. అలాగే ఐదేళ్ల లోపు చిన్నారులకు సైతం దగ్గమందును డాక్టర్లు సిఫార్సు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్లకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ ద్వారా వెల్లడించింది.కొన్నిరోజుల క్రిత మధ్యప్రదేశ్లో 9 మంది చిన్నారులు, రాజస్థాన్లో 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. దగ్గమందు వికటించే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పలు మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నారులకు దగ్గు మందులపై మార్గదర్శకాలు2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వొద్దు: ఈ వయస్సులో శరీరం మందుల ప్రభావానికి అధికంగా స్పందించవచ్చు.5 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులు సిఫార్సు చేయరాదు: సాధారణ దగ్గు, జలుబు పరిస్థితుల్లో సహజ చికిత్సలు, డాక్టర్ సూచనలతో ముందుకు వెళ్లాలి.డెక్స్ట్రోమెథోర్ఫాన్ ఆధారిత ఫార్ములా: ఇది చిన్నారులకు సురక్షితంగా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమైన మందులు: ‘కోల్డ్రిఫ్’ వంటి కొన్ని సిరప్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి, అయితే కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో విష రసాయనాలు కనుగొనబడలేదు.గతంలోనే ఎగుమతులపై చర్యలుదగ్గు మందు ఎగుమతులకు ప్రభుత్వ ల్యాబ్ అనుమతి తప్పనిసరి: 2023 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఎగుమతికి ముందు ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి చేశారు.డబ్యూహెచ్వో హెచ్చరికల నేపథ్యంలో చర్యలు: గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారతీయ దగ్గు మందుల వల్ల చిన్నారుల మరణాలు సంభవించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.ప్రజలకు సూచనలుచిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి.OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.ఇదీ చదవండి: అమెరికా-పాక్లు! నాకు నువ్వు.. నీకు నేను! -
దగ్గుమందు కేసుపై సీబీ‘ఐ’
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన డీసీఏ - సీఐడీ నివేదికపై అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ఇతర దేశాలకు దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో నేర పరిశోధన విభాగం (సీఐడీ) సమర్పించిన విచారణ నివేదికపై ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దగ్గు మందు అక్రమ రవాణా అంశాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు డీసీఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు సరిగా దర్యాప్తు చేయలేదని పేర్కొంది. డీసీఏ ప్రతిపా దనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2015 అక్టోబర్లో అసోంలోని భారత సరిహద్దులో దగ్గు మందు సిరప్ను అక్రమ రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. హిమాచల్ప్రదేశ్ లోని ఓ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ మందుల లారీ హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కొన్ని దుకాణాలు, డీలర్ల వద్ద తనిఖీలు చేసి ఔషధ నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్న దగ్గు మందు కొనుగోలు బిల్లులను పరిశీలించగా మందును విక్రయించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నా, వాటిని ఎక్కడా సరఫరా చేయలేదని విచారణలో తేలింది. నేరుగా ఇతర దేశాలకు తరలించారని నిర్ధారించారు. విచారణలో లోపాలు.. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇక్కడే వ్యవహారం దారితప్పినట్లు తెలుస్తోంది. డీసీఏ విభాగం అధికారులు నమోదు చేసిన అభియోగాలకు అనుగుణంగా ఎలాంటి ఆధా రాల్లేవని సీఐడీ విభాగం కోర్టుకు తెలిపింది. దీంతో దీనిపై అభిప్రాయం తెలపాలని డీసీఏ కు కోర్టు సూచించింది. దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో సీఐడీ విభాగం సరిగా విచారించలేదని, దాదాపు రూ.300 కోట్ల విలువైన దగ్గు మందు తెలంగాణ నుంచి అక్రమ రవాణా అయిందని రాష్ట్ర ప్రభుత్వానికి డీసీఏ నివేదించింది. కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు వ్యవహారం బయటపడుతుందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి డీసీఏ ఈ అంశంపై కోర్టుకు నివేదించనుంది. కాసుల కక్కుర్తితో... మన రాష్ట్రంలోనే సరఫరా చేయాల్సిన దగ్గు మందు (ఫెన్సిడిల్) బంగ్లాదే శ్కు అక్రమంగా రవాణా అవుతోంది. ఈ మందును కొద్ది పరిమాణంలో తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇదే మందును ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మత్తు వస్తుంది. మన దేశంలో ఈ మందు నిల్వపై ఆంక్షలు ఉన్నాయి. ఒక్కో ఔషధ దుకాణంలో ఐదు సిరప్ల కంటే ఎక్కువగా అందుబాటులో ఉండనివ్వరు. హైదరాబాద్లో ఫెన్సిడిల్ మందు రూ.65కు లభిస్తోంది. బంగ్లాదేశ్ లో దీన్ని రూ.260కు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఫార్మా నిర్వాహ కులు కాసులకు కక్కుర్తి పడి బంగ్లాదేశ్కు అక్రమ రవాణా చేస్తున్నారు. -
తీగలాగితే.. డొంక కదిలింది!
కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమ దందా రాకెట్కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. కామారెడ్డి కేంద్రంగా సాగిన ఈ స్మగ్లింగ్తో ఇతర ప్రాంతాల మెడికల్ ఏజెన్సీలకూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గుంటూరులోనూ సోదాలు నిర్వహించారని ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఫెన్సిడిల్ అక్రమదందా వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. ఫెన్సిడిల్ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కామారెడ్డి అజంతా మెడికల్ ఏజెన్సీ అనుమతులను రద్దు చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ రాకెట్లో గుంటూరుకు చెందిన శేషు ఏజెన్సీకీ భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అక్కడికి వెళ్లి రికార్డులను సీజ్ చేశారు. ఆ ఏజెన్సీ నుంచి 3.20 లక్షల ఫెన్సిడిల్ బాటిళ్లు అక్రమ రవాణ అయినట్టు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ప్రముఖ మెడికల్ ఏజెన్సీగా శేషు ఏజెన్సీకి గుర్తింపు ఉంది. ఈ ఏజెన్సీకి ఫెన్సిడిల్ అక్రమదందాలో భాగస్వామ్యం ఉందని అనుమానించిన అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అలాగే భీమవరం, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన డ్రగ్ వ్యాపారులకూ ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల గుంటూరుకు వెళ్లి అక్కడి అధికారుల సాయంతో శేషు ఏజెన్సీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెన్సిడిల్ అక్రమ రవాణా వ్యవహారంలో సదరు ఏజెన్సీకి చెందిన బిల్లులు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్టు సమాచారం. అజంతాకు ఆగిపోయిన బిల్లుల చెల్లింపులు ఫెన్సిడిల్ అక్రమ దందా కేసులో అనుమతులు రద్దయిన అజంతా ఏజెన్సీకి వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన బిల్లులు నిలిచిపోయినట్టు సమాచారం. అజంతా ఏజెన్సీ నుంచి నాలుగైదు జిల్లాలకు చెందిన వందలాది ఏజెన్సీలు, దుకాణాలకు మందులు సరఫరా చేసేవారు. కోట్ల రూపాయల్లో వ్యాపారం నడిచేది. అయితే అజంతా ఏజెన్సీ కేసుల్లో ఇరుక్కోవడం, అందులో తమ వద్ద మందులు తీసుకునే రిటైలర్లకు ఫెన్సిడిల్ సరఫరా చేసినట్టు బోగస్ బిల్లులు తయారు చేసుకున్న వ్యవహారంలో ఆయా మెడికల్ షాప్ల వారు విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. తమకు సంబంధంలేని వ్యవహారంలో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహంతో ఉన్న సదరు దుకాణాదారులు అజంతాకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. బిల్లుల వసూళ్ల కోసం అజంతా ఏజెన్సీ యజమానులు ఒత్తిడి తెచ్చినా చాలా మంది ససేమిరా అంటున్నట్టు సమాచారం.