Cotton bales
-
భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ప్రపంచ వాణిజ్య సంఘర్షణలు, పెరిగిన సుంకాల అనిశ్చితులు, యూఎస్లో ధరలు తగ్గడం కారణంగా భారత్కు అమెరికా మెట్ట ప్రాంత పత్తి ఎగుమతులు అధికమయ్యాయి. ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఎగుమతులు గణనీయంగా పెరిగి 2.5 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. భారతదేశం ఉత్పత్తి లోటుతో ఇతర పరిస్థితులు యూఎస్ పత్తిని దిగుమతి చేసుకోవడానికి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్డీఏ) గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు భారత్కు పత్తి ఎగుమతులు 25,901 బేళ్ల నుంచి 1,55,260 బేళ్లకు పెరిగాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎగుమతులు రెండున్నరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చైనాకు అమెరికా పత్తి ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు. అసలు భారత్లో పత్తి గణనీయంగా పండిస్తున్నా యూఎస్ నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో కొన్ని కారణాలు తెలుసుకుందాం.పొడవైన పత్తి పీజలుచైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా, అత్యధిక పత్తి నూలు ప్రాసెసర్లు, ఎగుమతిదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. కానీ ఇటీవల కాలంలో భారత్తో పత్తి దిగుబడి తగ్గుతుంది. దాంతో దేశం పత్తి నికర ఎగుమతిదారు నుంచి దిగుమతిదారుగా మారింది. స్థానికంగా పండుతున్న పత్తి నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతుంది. మెరుగైన నాణ్యతతో యూఎస్ మెట్ట ప్రాంతాల్లోని పత్తికి గిరాకీ అధికంగా ఉంది. యూఎస్ పత్తి ముఖ్యంగా ఎక్స్ట్రాలాంగ్ స్టేపుల్ (ఈఎల్ఎస్)ను కలిగి ఉంటుంది. అంటే పీజల(పత్తి పువ్వులోని రెక్కల్లాంటి భాగాలు) పొడువు ఎక్కువగా ఉంటుంది. ఇది నాణ్యమైన వస్త్రాలకు అనువైనది.అధిక జిన్నింగ్ సామర్థ్యంయూఎస్ పత్తి అధిక జిన్నింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. యూఎస్లో భారత్లో మాదిరి కూలీల ద్వారా పత్తిని సేకరించరు. యంత్రాలతోనే దీన్ని ప్రాసెస్ చేస్తారు. దాంతో నాణ్యమైన పత్తి సమకూరుతుంది. భారత్లో పత్తి పంటకు అధికంగా రసయనాలు వాడుతారు. ఇది ఎక్కువ మలినాలకు దారితీస్తుంది. వస్త్ర తయారీ కంపెనీలు దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలేదు.ఇదీ చదవండి: మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లుధరలు క్షీణతయూఎస్ పత్తి ధరలు ఇటీవల క్షీణించాయి. ఇది భారతీయ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. భారత పత్తి ధరలు సాపేక్షంగా అధికంగా ఉన్నాయి. దాంతో దిగుమతులు పెరగడానికి దారితీసింది. దీనికితోడు చైనా కూడా అమెరికా దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఫలితంగా యూఎస్ పత్తిని భారత్లో మార్కెట్ చేసుకుంటున్నారు. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
-
పత్తి.. బుగ్గి
బూడిదైన పత్తి బేళ్లు తున్కిఖాల్సా స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం రూ. కోట్ల ఆస్తి నష్టం రెండు నెలల్లో రెండోసారి ప్రమాదం వర్గల్ : ఎగసిన అగ్ని కీలలు పత్తి బే ళ్లను బూడిద చేశాయి. చీకటి వేళ చెలరేగిన మంటలు పరిశ్రమ వద్ద కార్మికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సరిగ్గా రెండు నెలల వ్యవధిలో రెండో సారి అగ్ని ప్రమాదం సంభవించి భారీగా పత్తి బేళ్లు దగ్ధం కాగా రూ. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వర్గల్ మండలం తున్కిఖాల్సా సమీప స్పిన్నింగ్ మిల్లులో సంభవించింది. పత్తి బేళ్లు నిల్వచేసిన గోడౌన్లో శుక్రవారం రాత్రి 10.30 గం టల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. యాజమాన్యం వెంటనే సాయం కోసం గౌరా రం పోలీసులకు, అగ్నిమాపక విభాగం అధికారులకు తెలి పారు. వెంటనే జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్రెడ్డి గజ్వేల్, జీడిమెట్ల, మెదక్ నుంచి అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ఘటనాస్థలికి తరలించారు. ఏ మాత్రం ఆలస్యమైనా మంటలు గోడౌన్ పక్కనే ఉన్న జిన్నింగ్ మిల్లుకు వ్యాపించి అపారనష్టం సంభవించేదన్నారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది తేలాల్సి ఉన్నదన్నారు. నష్టం ఏమేర జరిగిందో ఇప్పటికిప్పుడు నిర్ధారించలేమని, మొత్తం మీద రూ. కోట్లలో ఉంటుందని చెప్పారు. ఎన్ఓసీ లేదు..కనీస భద్రత లేదు రెండు నెలల క్రితం మార్చి 15న ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి రూ. కోట్ల నష్టం వాటిల్లినప్పటికి యాజమాన్యం కనీస భద్రత చర్యలు చేపట్టలేదని తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు నివారించుకునేందుకు సేఫ్టీ కోసం కనీస అగ్ని మాపక పరికరాలు పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేయలేదన్నారు. నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తున్నదని స్పష్టం చేసారు. మొదట తాము వృత్తి ధర్మంగా మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగి సఫలికృతులమయ్యామని, అనంతరం చర్యల్లో భాగంగా పరిశ్రమ నిర్లక్ష్యం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని వైనంపై కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయిస్తామని చెప్పారు. వరుసగా రెండు సార్లు జరిగిన అగ్ని ప్రమాదానికి పరిశ్రమ నిర్లక్ష్యమో మరే కారణమో గాని రూ. కోట్ల ఆస్తి మాత్రమ బుగ్గిపాలైంది. పూర్తి స్థాయిలో మంటలు ఆరిపోయేందుకు మరో రోజు పట్టే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఘటనాస్థలిని గౌరారం ఎస్సై మధుసూదన్రెడ్డి సందర్శించి పరిశీలించారు.