-
Congress Party: టార్గెట్ 72
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో.. అధికారం దక్కాలంటే కనీసం 60 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్న 72 స్థానాలు టార్గెట్గా పెట్టుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పకడ్బందీ కసరత్తు ప్రారంభించారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాలను ఏ (గెలిచే అవకాశం) బీ (ఓ మోస్తరు అవకాశం), సీ (అవకాశం లేదు) కేటగిరీలుగా వర్గీకరించిన రేవంత్ వాటిలో గెలిచే అవకాశాలున్న స్థానా లపై దృష్టి సారించారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా ఆయా స్థానాల్లో గెలుపొందేలా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆయన ఒక అంచనాకు వచ్చారని, గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను ప్రత్యేక కేటగిరీ కింద తీసుకుని గెలుపు వ్యూహాలను రచించే పనిలో పడ్డారని సమాచారం. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో రేవంత్ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణపైనే గురి.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అంచనా వేస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్లతో పాటు ఖమ్మంలోని మెజార్టీ స్థానాల్లో ఈసారి గట్టిపోటీ ఇస్తామని భావిస్తోంది. కచ్చితంగా టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ ఐదు జిల్లాల్లో కలిపి 50కి పైగా స్థానాలుండగా (రంగారెడ్డి జిల్లాలో గ్రేటర్ పరిధిలోకి వచ్చే స్థానాలను మినహాయించి) అందులో కనీసం 40 స్థానా ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇక నగర శివార్లలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్లతో పాటు హైదరాబాద్ జిల్లాలోకి వచ్చే నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్, సనత్నగర్, కంటోన్మెంట్ స్థానాలపై కీలక కసరత్తు ను ఇప్పటికే రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ స్థానా ల్లో గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. మొత్తం మీద ఈ 60కి పైగా స్థానాల్లో 45 గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంటుందనే అంచనాతో ఆయన ముందుకెళుతున్నారు. ఇక్కడ గట్టిగా ప్రయత్నించాలి ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందని, అయితే పార్టీ పరంగా కీలక నాయకులున్న స్థానాల్లో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం దక్షిణ తెలంగాణ కంటే ముందుగానే కార్యరంగంలోకి దిగాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని ముఖ్య నేతలు, వారు పోటీ చేయాలనుకునే స్థానాల జాబితా ఇప్పటికే తయారయింది. ఈ స్థానాల్లో కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమని, కాంగ్రెస్ నేతల వ్యక్తిగత చరిష్మాతో పాటు గత మూడు, నాలుగు సార్లుగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న టీఆర్ఎస్ నేతలపై ఉన్న వ్యతిరేకత ఇందుకు ఉపకరిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ కోణంలోనే ఉత్తర తెలంగాణలోని 45–50 నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. తాను టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత మెరుగుపడిందని భావిస్తున్న ఆయన.. ఇదే అదనుగా ఉత్తర తెలంగాణలో జోరు పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించారు. మూడో సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్లో నిర్వహించబోతున్నారు. గజ్వేల్లో విజయవంతంగా సభను నిర్వహించడం ద్వారా ఉత్తర తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేడర్ను ఎన్నికల పోరాటానికి సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. చురుగ్గా లేకపోతే గుర్తింపు ఉండదు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్న రేవంత్ వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. పనితీరు మెరుగుపడాల్సిందేనని, చురుగ్గా లేకపోతే పార్టీలో తగిన గుర్తింపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. గురువారం గాంధీభవన్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ సమన్వయకర్తల సమావేశంలో ఆయన బహిరంగంగానే పార్టీ నేతలకు చురకలంటించారు. ‘దండోరా కార్యక్రమాన్ని పార్టీ సీరియస్గా పరిగణిస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గాల వారీగా నివేదికలివ్వాలి. మండల అధ్యక్షుల పనితీరు బాగుంటేనే నియోజకవర్గాల్లో రాజకీయంగా ముందుకెళ్లగలుగుతాం. ప్రజాసమస్యలపై పోరాటాల్లో నాయకులు చురుగ్గా వ్యవహరించాల్సిందే..’అని రేవంత్ స్పష్టం చేశారు. వరంగల్ దండోరా సభకు రాహుల్! మరోవైపు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్న వరంగల్ పార్లమెంటు పరిధిలో వచ్చే నెల 7 నుంచి 17వ తేదీ మధ్య పెద్ద ఎత్తున ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని, దానికి రాహుల్గాంధీని తీసుకురావాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సభల తర్వాత ఉత్తర తెలంగాణ పార్టీ పరిస్థితిలో మరింత మార్పు కనిపిస్తుందనే ధీమా రేవంత్ శిబిరంలో వ్యక్తమవుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై కూడా రేవంత్ దృష్టి సారించారు. పార్టీకి పట్టుకొమ్మలైన అనుబంధ సంఘాలు నిర్లిప్తంగా ఉండకూడదని, అనుబంధ సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం. -
నేటినుంచి అధిక ధరలపై పోరు
దోమలగూడ,న్యూస్లైన్: రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 11,12,13 తేదీల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశ వివరాలను బుధవారం దోమలగూడ ఎస్ఎంఎస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టడడమే ఇందుకు నిదర్శనమన్నారు. వామపక్షాలు కూడా ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజామద్దతు అనుకున్నంత కూడగట్ట లేకపోతున్నామని, దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యత ఉందన్నారు. ధరల పెరుగుదలపై ఈనెల 16 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రం విడిపోకూడదనేదే తమ పార్టీ విధానమని, అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నట్లు వారు చెప్పారు. పార్టీ యువజన విభాగమైన ఆర్వైఎఫ్ జాతీయ మహాసభలు మార్చి 2 నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘మహా’ సంగ్రామానికి సిద్ధం
సాక్షి, ముంబై: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాస్వామ కూటమి (డీఎఫ్)ని గద్దె దింపేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి సిద్ధంగా ఉందని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మరోసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ మహాకూటమి నుంచి బయటకు రాదని బుధవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్సభ, శాసన సభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి పరాజయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మూడు లోక్సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం కావాలని అడుగుతున్నామన్నారు. ‘వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నాయకులతో అఠవలే ప్రాథమిక చర్చలు జరిపాం. గతంలో తాము ఇరు పార్టీల నాయకులతో ఏడు లోక్సభ స్థానాలు కావాలని కోరాం. కానీ కాషాయ కూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పట్టు సడలించి మూడు స్థానాలు కావాల’ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ తమకు ఎన్ని స్థానాలు ఇవ్వనుంది...? అవి ఏ నియోజక వర్గానివో...? వచ్చే వారంలో కాషాయకూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత తెలుస్తుందని అథవాలే స్పష్టం చేశారు. పుణే, లాతూర్, సాతార, వర్ధా, రామ్టేక్ తదితర నియోజక వర్గాలు ఆర్పీఐకీ అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీచేస్తే ఆర్పీఐని విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితుల ఓట్లపై కన్నేసిన డీఎఫ్ కూటమి ప్రకాశ్ అంబేద్కర్కు చెందిన బీఆర్పీ, జితేంద్ర కవాడేకు చెందిన పీఆర్పీలను అక్కున చేర్చుకుందన్నారు. అయితే వారి ప్రభావం మహాకూటమిపై ఉండదన్నారు. ఆర్పీఐ కాషాయకూటమిలో చేరే ముందు ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో అంబేద్కర్, కవాడేలు కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్నప్పటికీ దళితులు మాత్రం తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య ముంబై లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకుంటున్నానని, అయితే రాజ్యసభకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారని చెప్పారు. దీంతో వచ్చే వారంలో శివసేన, బీజేపీ నాయకులతో జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటు, రాజ్యసభ సీటు తదితర అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement