-
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి ఇమ్రాన్ఖాన్ రాజీనామా..?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారంలో ఉన్న ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే, గత వారం పాకిస్థాన్ పార్లమెంట్లో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇమ్రాన్కు షాకిస్తూ ఎంపీలు, మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇక, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని.. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. అవిశ్వాసానికి ముందు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
శిథిలావస్థలో పశువైద్య ఉపకేంద్రం
ఆందోళన చెందుతున్న సిబ్బంది పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి అలాగే సిబ్బంది కొరతతో అందని పశువైద్యసేవలు న్యాల్కల్: పశు సంవర్థక శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్న ఒకటి రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మంజూరైన భవనాల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నత్తనడకన కొనసాగుతుండడంతో ఇటు అధికారులు, అటు రైతులు, పశు పోషణాదారులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్దంగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది భయాందోళన చేందుతున్నారు. మంజూరైన భవనాల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి తోడు వైద్యులు, సిబ్బంది కోరత కారణంగా పశువులకు సరైన వైద్యం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని న్యాల్కల్, మిర్జాపూర్(బి)లో పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. న్యాల్కల్ పశు వైద్య కేంద్రం పరిధిలో డప్పూర్, చాల్కి, న్యాల్కల్, మిర్జాపూర్(బి) పశు వైద్య కేంద్రం పరిధిలో హద్నూర్, మెటల్కుంట, మిర్జాపూర్(బి)లలో పశు వైద్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాల్కి, హద్నూర్, మెటల్కుంట పశు వైద్య ఉప కేంద్రాల భవనాలు శిథిలాస్థకు చేరుకున్నాయి. చాల్కిలోని పశు వైద్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకొని పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయని గ్రామంలో నిర్వహించిన పలు సమావేశాల్లో గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. ముఖ్యంగా వర్షాలకు పైకప్పు పెచ్చులూడి కింద పడుతుండడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోని వైద్య సిబ్బంది ఆందోళన చెందుత్నున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వం చాల్కికి నూతన భవనాన్ని మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం భవన నిర్మాణ కోసం రూ.5.40 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర పనులు ప్రారంభించాడు. రెండున్నర ఏళ్లు గడిచినా నిర్మాణ పనులు పూర్తికాలేదు. నిధులు సరిపోకపోవడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఇటు వైద్య సిబ్బంది అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హద్నూర్లో కూడా పశు వైద్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. భవనం కురుస్తుండటంతో మందులు భద్రపరచలేకపోతున్నామని సిబ్బంది విచారం వ్యక్తంచేశారు. అలాగే మెటల్కుంటలో సొంత భవనం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలో ఒక గదిని పశు వైద్యశాల కింద ఉపయోగించుకుంటున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న భవనం నిర్మాణ పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల రైతులు, పశుపోషణాదారులు కోరుతున్నారు. సిబ్బంది కోరతతో అందని వైద్యసేవలు పశు వైద్య కేంద్రాలతో పాటు ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కోరతతో పశువులకు సక్రమంగా వైద్యం అందడం లేదని రైతులు, పశుపోషణాదారులు ఆరోపిస్తున్నారు. మండలంలో మొత్తం 39 గ్రామాలుండగా ఆస్పత్రులు మాత్రం ఆరు మాత్రమే ఉన్నాయి. అందులోనూ సిబ్బంది కోరత తీవ్రంగా ఉంది. ఇద్దరు డాక్టర్లు ఉండవలసి ఉండగా కేవలం ఒక డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. న్యాల్కల్లో ఉన్న ఒక్క డాక్టర్ను ఇతర ప్రాంతాల అదనపు బాధ్యతలను అప్పగించడంతో పశువులకు సరైన వైద్య అందడం లేదని రైతులు, పశు పోషణాదారులు ఆరోపిస్తున్నారు. అలాగే చాల్కిలో వైద్య సిబ్బంది సమయానికి రాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి పశువులకు చికిత్స చేయించాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని మరికొన్ని పశు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తగిన వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడూ మూసే ఉంటుంది గ్రామ సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఆస్పత్రి ఎప్పుడూ మూసే ఉంటుంది. సిబ్బంది సక్రమంగా రాకపోవడంతో చిన్న చిన్న జబ్బులు వచ్చినా పశువులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళుతున్నాం. కొత్తగా కట్టిన దవాఖాన కూడా చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. - సద్దాం, పశుపోషణాదారుడు, చాల్కి భవనం నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని భవనం పనులు త్వరగా పూర్తి చేయించాలి. - జైపాల్రెడ్డి, రైతు, చాల్కి నిధులకు అనుగుణంగా పనులు చేపట్టలేదు చాల్కి ఉపకేంద్ర భవన నిర్మానాణికి ప్రభుత్వం రూ. 5.40 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులకు అనుగుణంగా భవనం పనులు చేపట్టలేదు. పైగా నిధులు సరిపోకపోవడంతో పనులు మధ్యలోనే ఆపివేశారు. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. న్యాల్కల్లో ఉన్న డాక్టర్కు అదనపు బాద్యతలు అప్పగించారు. కొత్త డాక్టర్ను నియమించి న్యాల్కల్లో పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. - సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జహీరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement