breaking news
CNN-IBN Survey
-
పవన్ కళ్యాణ్ సమాజ సేవ చేశారా?
హైదరాబాద్: సర్వే పేరుతో సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ఇంత మోసపూరిత సర్వే తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదంతా కుట్ర పూరిత సర్వే అని మండిపడ్డారు. అంకెల గారడీ తప్ప ఇందులో వాస్తవాలు లేవన్నారు. సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడిదారులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. పతనావస్థలో ఉన్న టీడీపీని భూతద్దంలో చూపేందుకు సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సర్వే తప్పుల తడకని ఆ ఛానెల్ చర్చలో పాల్గొన్నవారే చెప్పారని వెల్లడించారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలు ఎప్పుడూ వాస్తవాలకు దగ్గరగా రాలేదని గుర్తు చేశారు. నీల్సన్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నేతలు ఆ సర్వేపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీల్సన్ మార్గ్ 50 వేల శాంపిల్స్తో సర్వే చేస్తే, సీఎన్ఎన్-ఐబీఎన్ కేవలం1300 మందితో మాత్రమే సర్వే నిర్వహించిందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సినిమాల్లో నటించడమే తప్ప.. ఏ రోజైనా సమాజ సేవ చేశారా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
ఎన్డీఏదే ముందంజ!
లోక్సభ ఎన్నికల్లో యూపీఏకు భంగపాటు సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో వెల్లడి ఎన్డీఏకు 211-231 స్థానాలు... యూపీఏకు 107-127 స్థానాలు! న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారంలో వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, యూపీఏకు భంగపాటు తప్పదని సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 211-231 స్థానాలు లభించే అవకాశాలు ఉండగా, యూపీఏ వందకు పైగా స్థానాలను కోల్పోయి, 107-127 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో జనవరి తొలి రెండు వారాల్లో సీఎన్ఎన్-ఐబీఎన్, లోక్నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన ఈ సర్వేలో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీకి ఓటు వేస్తామని 34 శాతం ఓటర్లు చెప్పగా, 27 శాతం ఓటర్లు మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సర్వే అంచనా వివరాలు... - జనవరిలోనే లోక్సభకు ఎన్నికలు జరిగినట్లయితే, యూపీఏకు 28 శాతం, ఎన్డీఏకు 36 శాతం ఓట్లు లభిస్తాయి. ఇతరులకు మరో 36 శాతం ఓట్లు లభిస్తాయి. - గడచిన ఆరునెలల్లో బీజేపీకి మద్దతు పలికే వారి సంఖ్య 7 శాతం పెరగగా, కాంగ్రెస్కు మద్దతు పలికే వారి సంఖ్య ఒక శాతం తగ్గింది. - పల్లెల్లో కాంగ్రెస్ గణనీయంగా పట్టుకోల్పోయింది. గ్రామాల్లో బీఆజేపీకి 34 శాతం ఓటర్లు మద్దతు పలుకుతుండగా, కాంగ్రెస్కు 26 శాతం ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. - అట్టడు వర్గాల్లో 34 శాతం మంది బీజేపీకి మద్దతు పలుకుతుండగా, కాంగ్రెస్ వైపు 26 శాతం ఓటర్లు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. - ఎగువ మధ్యతరగతి ఓటర్లలో 37 శాతం, మధ్యతరగతి ఓటర్లలో 35 శాతం బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా, ఈ వర్గాల్లో కాంగ్రెస్కు 26, 29 శాతం మాత్రమే మద్దతు పలుకుతున్నారు. - ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు శృంగభంగం తప్పదని ఈ సర్వే అంచనా వేసింది.