breaking news
Clinical Tests
-
హైదరాబాద్లో హెల్త్ ఏటీఎం చూశారా? అన్ని పరీక్షలు ఇక్కడే!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, విపరీతమైన కాలుష్యం కారణంగా చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్లు, స్కూలు విద్యార్థులు కూడా గుండెజబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పని సరిగా మారిపోయింది. అయితే సాధారణంగా 30 ఏళ్లు నిండినవారు, కుటుంబాల్లో బీపీ,సుగర్, కేన్సర్, గుండె జబ్బుల చరిత్ర ఉన్నవాళ్లు క్రమంగా తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఉరుగుల పరుగుల జీవితంలో మనలో చాలామంది హెల్త్ చెకప్స్ను వాయిదా వేస్తుంటాం. అలాంటివారికి గుడ్ న్యూస్ ఈ హెల్త్ ఏటీఎం బ్యాంక్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) తరహాలోనే హెల్త్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. టచ్-స్క్రీన్ కియోస్క్ హార్డ్వేర్,ఇది ఏదైనా ఇంటర్నెట్-కనెక్ట్ చేయబడిన వెబ్ బ్రౌజర్ నుండి వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.హైదరాబాద్కు చెందినప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ డిజిటల్ హెల్త్కేర్ కియోస్క్ను తీసుకొచ్చింది. ఏటీఎం తరహాలో హెల్త్ పాడ్ ఎక్విప్మెంట్ ద్వారా బీపీ, టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్, బీఎంఐ, ఈసీజీ వంటి వివరాలను నిమిషాల్లో తెలుసుకోవచ్చు. రిపోర్ట్స్ వెంటనే వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా ప్రింటవుట్పై పొందవచ్చు. ఈ ఏర్పాటు ఆస్పత్రుల్లో రోగుల ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో BMI, BMR, ఎత్తు, బరువు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, ECG వంటి 75 కంటే ఎక్కువ విభిన్న ఇన్వాసివ్ అండ్ నాన్-ఇన్వాసివ్ పరీక్షలను నిర్వహించగలదు. ఏఐ ,మెషీన్ లెర్నీంగ్ సాఫ్ట్వేర్, సెన్సర్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎలాంటి సమస్యకైనా ఈ ఆటోమేటెడ్ టచ్ స్క్రీన్ కియోస్క్ ద్వారా వారు డాక్టర్తో టెలీకన్సల్టింగ్ పొందే వెసులుబాటు కూడా ఉంది. -
బ్రెజిల్లో కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు రద్దు
హైదరాబాద్: భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను బ్రెజిల్లో రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం శనివారం ప్రకటించింది. బ్రెజిల్ మార్కెట్లోకి కోవాగ్జిన్ను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రెసికా మెడికమెంటోస్, ఎన్విక్సా పార్మాస్యూటికల్స్ ఎల్.ఎల్.సీతో చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంవోయూ)ను రద్దుచేసుకున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. బ్రెజిల్కు ఈ ఏడాది రెండో, మూడో త్రైమాసికాల్లో 2 కోట్ల డోస్ల కోవాగ్జిన్ టీకాలను సరఫరా చేసే ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందనే వార్తల నేపథ్యంలో ఈ ఎంవోయూ రద్దయింది. టీకా సరఫరాలో ముడుపులు, అవకతవకల ఆరోప ణలపై బ్రెజిల్ సెనెట్ దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. ఒప్పందం రద్దుపై బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ (ఏఎన్వీఐఎస్ఏ)కు భారత్ బయోటెక్ ఓ లేఖ రాయడంతో క్లినికల్ పరీక్షలు రద్దుచేశారు. బ్రెజిల్లో భారత్ బయోటెక్కు ప్రెసికా మెడికమెంటోస్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. అనుమతి పత్రాల సమర్పణ, స్థానికంగా తోడ్పాటు, లైసెన్స్, పంపిణీ, ఇన్సూరెన్స్, మూడో దశ క్లినికల్ పరీక్ష తదితర బాధ్యతలను ప్రెసికా మెడికమెంటోస్ చూసుకునేది. ఇంత వరకూ బ్రెజిల్లో కోవాగ్జిన్ పరీక్షలు చేపట్టనేలేదు.