breaking news
christian council
-
మత విద్వేషాలను రెచ్చగొడితే సహించం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): క్రైస్తవులు, హిందువుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (ఆర్కేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ ఓఫిర్ హెచ్చరించారు. క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్కేపీ, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజుకు తగదన్నారు. కార్యక్రమంలో సీఆరీ్పఎస్ జాతీయ అధ్యక్షుడు అప్పికట్ల జీవరత్నం, రాష్ట్ర అధ్యక్షుడు వై.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులపై నిర్లక్ష్యం తగదు
విజయవాడ (గుణదల) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉన్నా కేవలం ఒక సంప్రదాయానికే పెద్ద పీట వేసి రాజ్యాంగాన్ని కించపరుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేడెట్ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు గేరా హానోక్ విమర్శించారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మతాలకు చెందిన వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పుష్కరాల పేరుతో దుర్వినియోగం చేయటమే కాకుండా ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ దేశంగా పిలిచే భారతదేశంలో మత పరంగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం శోచనీయమన్నారు. అభివృద్ధి పేరుతో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తారాపేట చర్చిని కూల్చేయటం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బహిరంగ లేఖ ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జాతీయ గౌరవ అ«ధ్యక్షులు బిషప్ జాన్ ఎస్. డి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు ఎం ఎలీయూజర్, కొలమూరి ప్రభాకర్, సలహాదారు పీఎస్ రావు, యువజన విభాగం అధ్యక్షులు అభిలాష్, నగర అధ్యక్షులు కె. ప్రభాకర్, కోశాధికారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.