breaking news
chinnanna died
-
అజ్ఞాతంలోనే హతం
ఆత్మకూరు రూరల్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురానికి చెందిన మావోయిస్టు సుగులూరి చిన్నన్న (57) మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చిన్నన్నకు భవనాశి శంకర్, విజయ్ అనే మారుపేర్లు ఉన్నాయి. చిన్నన్న కర్నూలు జిల్లా వేంపెంట ఘటనతోపాటు కరువు దాడులు, సినిమా థియేటర్ల పేల్చివేత, వాహనం దహనం, సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత తదితర ఘటనల్లో నిందితుడిగా రికార్డులకెక్కారు. చిన్నన్న 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చిన్నన్న అజ్ఞాతంలోకి వెళ్లే నాటికి అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు క్రాంతి, రామకృష్ణ ఉన్నారు. -
భూ తగాదాలతో ఒకరి మృతి
చెన్నూర్(ఆదిలాబాద్): భూమి విషయమై తలెత్తిన వాగ్వాదం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్ చెన్నూర్ మండలం ముత్తారావుపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి చిన్నన్న(65), అతని సోదరుని కుటుంబానికి మధ్య భూ తగాదాలున్నాయి. ఇదే విషయంలో ఆదివారం మధ్యాహ్నం రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి చిన్నన్నను అతని అన్న కుమారుడు రాజిరెడ్డి బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నన్నకు కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రమై అతడు కొద్దిసేపట్లోనే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.