breaking news
Chillapalli Mohan Rao
-
చేనేతను ప్రజలకు చేరువ చేయండి
సాక్షి, అమరావతి: చేనేత ఉత్పత్తులపై పెరుగుతున్న మక్కువను ఆసరా చేసుకుని విక్రయాలు మరింత పెంచుకునేందుకు దృష్టి సారించాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు సూచించారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్స్, షోరూం మేనేజర్లు, అధికారులతో గురువారం రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకుని ఆప్కో విక్రయాలను పెంచేలా మార్కెటింగ్ సిబ్బంది బాధ్యతలు తీసుకోవాలని కోరారు. రానున్న పండుగల సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగతంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. చేనేత రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిల్లపల్లి సూచించారు. చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండీ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ఆప్కో ఆధ్వర్యంలో నూతన విక్రయశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన ఒంగోలు షోరూమ్కు మంచి స్పందన వస్తుందన్నారు. త్వరలో గుంటూరు, కడపలో నూతన విక్రయశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు, ఆప్కో జీఎం కన్నబాబు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, ఉపసంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, ప్రత్యేక అధికారి జగదీశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
నేతన్నలకు ప్రభుత్వమే నేస్తం
ప్రాచీనకాలం నుంచీ చరి త్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయోద్య మంతోనూ విడదీయరాని బంధం కలిగుంది. గ్రామీణ భారతంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ. రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 80 వేల మగ్గాలు ఉండగా, ఉప వృత్తులు కలిపి సుమారు నాలుగు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కాలానుగుణంగా చేనేత రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పొందూరు, చీరాల, మంగళగిరి... ఇలా పలు చేనేత కేంద్రాల్లో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను స్వయంగా గమనిం చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా జగన్ చేనేతల సంక్షేమానికి నడుం బిగించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 24,000 వంతున రూ. 196.28 కోట్ల తొలి విడత సాయాన్ని జమ చేశారు. ఆ తరువాత కరోనా విజృం భించడంతో చేనేత కార్మికులు ఉపాధికి దూర మయ్యారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, రెండో విడత నేతన్న నేస్తం పథకాన్ని ఆర్నెల్లు ముందుగానే అమల్లోకి తెచ్చారు. 81,024 మంది అర్హులైన లబ్ధి దారులకు రూ.24,000 వంతున రూ.194.46 కోట్ల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా మూడోసారి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రాజకీయంగా కూడా చేనేత వర్గాలకు పెద్దపీట వేశారు. మునుపెన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి పాలక వర్గాలను కూడా నియమించి చరిత్ర సృష్టించారు. చేనేతకు ఏకంగా నాలుగు (పద్మశాలి, దేవాంగ, తొగటవీర క్షత్రియ, కుర్నిశాలి) కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విశేషం. నేటి ఆధునిక యుగంలో యువత, మహిళల అభిరుచికి తగ్గట్టుగా వీవర్స్ సర్వీస్ సెంటరు సహకారంతో ఆప్కో తరపున నూతన వెరైటీల ఆవిష్కరణకు కృషి జరుగుతోంది. డిజైన్ చీరల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసి, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధాన ముడిసరుకైన పట్టు (సిల్క్) కొరత రాష్ట్రంలో తీవ్రంగా వుంది. మలబారు సాగుకు అనుకూల పరిస్థితులున్న విశాఖ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరిం చిన రంగులను వినియోగించి వస్త్రాలను ప్రయోగాత్మకంగా నేయిస్తోంది. కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట తదితర ప్రాంతాల్లో ఆర్గానిక్ చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండ్, మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీ సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు దగ్గరగా ఉండే శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే మన దేశ ఖ్యాతి ఇనుమడించడంతోపాటు ఇక్కడి కార్మికుల ఉపాధి మెరుగవుతుంది. చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా శ్రమించిన చేనేత బంధు, దివంగత రాజ్యసభ సభ్యుడు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ చేనేత విభాగం ముందుకెళ్తోంది. - చిల్లపల్లి మోహనరావు వ్యాసకర్త ఆప్కో చైర్మన్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
‘టీడీపీ ప్రభుత్వంలో కలవరం’
-
‘టీడీపీ ప్రభుత్వంలో కలవరం’
విజయవాడ: చేనేత రంగానికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్రావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ధర్మవరం పర్యటనతో టీడీపీ ప్రభుత్వంలో కలవరం మొదలైందని అన్నారు. చేనేతలకు వైఎస్ జగన్ చేసిన ప్రకటన ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. లక్షలాది మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రణాళికను జగన్ ప్రకటించారని ప్రశంసించారు. చేనేతలంతా వైఎస్సార్ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.2 వేలు సిల్క్ రాయితీ ఇస్తామని మంగళవారం ధర్మవరంలో వైఎస్ జగన్ ప్రకటించారు. నేతన్నల రుణాలు మాఫీ చేస్తామని, రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని హామీయిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని.. పింఛన్ సొమ్మును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతామని భరోసాయిచ్చారు.