-
బాల్యాన్ని బందీ కానీయొద్దు.. బాల్య వివాహాల చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్ఓ అశోక్కుమార్, డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు
సాక్షి, అమరావతి: నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వీధి బాలలను కాపాడటానికి ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ ముగింపు సందర్భంగా బుధవారం వెబినార్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు.. 13 జిల్లాల పోలీస్ అధికారులు, వీధిబాలలతో నిర్వహించిన వెబినార్ను గుంటూరు నుంచి హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించే ముస్కాన్ గొప్ప కార్యక్రమమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 16,457 మంది బాలలను కాపాడామని చెప్పారు. -
బాల వికాసానికి 'మూలస్థానం'
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి చెంత బాల వికాసం పరవళ్లు తొక్కుతోంది. అధికారుల అంకితభావం అక్కడి బాలకార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. బాల్య వివాహాలను తరిమికొట్టింది. అంగన్వాడీల లాలన చిన్నారుల్లో రక్తహీనతను రూపుమాపి బాలల ఆరోగ్యానికి బాటలు వేసింది. శిశు మరణాలను దూరం చేసింది. గ్రామస్తుల సహకారం సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు తెచ్చింది. అదే ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలల సంరక్షణ విషయంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు గాను 2020 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘బాలమిత్ర (చైల్డ్ ఫ్రెండ్లీ) పంచాయతీ’ పురస్కారాన్ని దక్కించుకుంది. గౌతమీ గోదావరి చెంతన చెన్నై–కలకత్తా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ గ్రామమే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం పంచాయతీ. సమస్యల చీకట్లను జయించి.. ► నిత్యం తగాదాలతో మూలస్థానం తల్లడిల్లేది. మరోవైపు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం తదితర సమస్యలు గ్రామాన్ని పీడిస్తుండేవి. ► గ్రామంలోని అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 434 మంది, గర్భిణులు 51 మంది, బాలింతలు 44 మంది ఉన్నారు. ► గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి రుగ్మతలను రూపుమాపేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలతోపాటు మండలస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పనిచేశారు. ► అధికారులు, గ్రామంలోని ఉద్యోగుల కృషికి గ్రామస్తుల సహకారం తోడవటంతో ఏడాదిలోనే మంచి ఫలితాలను సాధించారు. ఆరోగ్య లోపాలను అధిగమించి.. ► మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచీ ప్రసవమయ్యే వరకూ అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలుఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయగలిగారు. ► చిన్నారులకు సకాలంలో టీకాలు వేయడం, వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువును నమోదు చేసి లోపాలున్న వారికి పౌష్టికాహారం అందించారు ► తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైద్య సిబ్బందితో కలిసి రక్తహీనత గల చిన్నారులను గుర్తించి రెట్టింపు పోషకాహారాన్ని అందించారు. ► ఏడాది క్రితం వరకు గ్రామంలో శిశు మరణాలు 3 శాతం వరకు ఉండగా.. అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ఏడాదిలో ఒక్క శిశు, బాలింత మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టారు. ► గతంలో గ్రామంలోని 10 శాతం మంది చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాల్య వివాహాలకు.. బాల కార్మిక వ్యవస్థకు చెక్ ► దగ్గరి బంధువులనో.. మంచి సంబంధమనో 10వ తరగతిలోపు బాలికలకు పెళ్లిళ్లు చేసేవారు. ► వీటిని అరికట్టే దిశగా అంగన్వాడీ కార్యకర్తలు 2015లో చర్యలు చేపట్టారు. వారికి పంచాయతీ, మండల అధికారుల సహకారం తోడవటంతో బెదిరింపులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించారు. ► గ్రామంలోని 80 వరకు ఇటుకల బట్టీలు, కూరగాయల సాగు విస్తరించి ఉన్నాయి. 2018 నాటికి 52 బాల కార్మికులు ఉండగా వారిని గుర్తించి బడిబాట పట్టించారు. అవార్డు రావడం గర్వంగా ఉంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’ అవార్డు మా గ్రామానికి దక్కడం చాలా గర్వంగా ఉంది. యు.రేణుక, పంచాయతీ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల వరకు వారికి నిర్ణీత సమయంలో వైద్య సేవలందించి శిశు మరణాలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించాం. ఎం.సుమలత, పీహెచ్సీ అధికారి, చొప్పెల్ల పౌష్టికాహార లోపం లేకుండా పర్యవేక్షణ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం. నిరంతరం ఆటపాటలు నేర్పించి చురుకుదనం పెరిగేందుకు కృషి చేశాం. ఎల్.విజయ కుమారి, అంగన్వాడీ కార్యకర్త -
పొంతలేని లెక్కలు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యావారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యాసంబరాలు, ఆచార్య జయశంకర్ చదువుల పండుగ.. ఇలా పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యమాలు నిర్వహించింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే.. బడీడు పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ.. అలా జరగలేదు. ఆరేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం సైతం పనిచేసినట్టు కన్పించడం లేదు. ఫలితంగా పలకాబలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లల్లో, ఇటుకబట్టీల్లో పానలు, పారలు పడుతున్నాయి. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకోవడం కనిపిస్తోంది. కరీంనగర్ఎడ్యుకేషన్: జిల్లాలోని 16 మండలాల్లో బడిబయట ఉన్న పిల్లల సర్వేను సెప్టెంబర్ 06 నుంచి అక్టోబర్ 28 వరకు రాజీవ్ విద్యామిషన్, మెప్మా ప్రాజెక్టు ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్, ఐఈడీ రిసోర్స్ టీచర్లు, పార్ట్టైం టీచర్లు నిర్వహించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 354 మంది బడికి వెళ్లని విద్యార్థులను గుర్తించినట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అందులోనుంచి బడిలో చేరి అర్ధాంతరంగా చదువు మానేసిన వారు 142 మంది ఉన్నారని, బడీడు ఉండీ.. ఇప్పటికి పాఠశాలల్లోకి వెళ్లనివారు 212 మంది ఉన్నట్లు అధికారులకు లెక్క అందజేశారు. అయితే సీఆర్పీలు ఆయా గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా.. చాలామంది గతేడాది నిర్వహించిన సర్వే లెక్కలనే ఈ ఏడాది కూడా చూపించి మమ అనిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేపై సందిగ్ధత నెలకొనడంతో మరోసారి సర్వే చేయాలని డీఈవో సీఆర్పీ, ఐఈడీ టీచర్లు, పార్ట్టైం టీచర్ల సమావేశంలో ఆదేశించారు. అయితే పిల్లల సంఖ్యను కొంత పెంచి ఆ నివేదికను ఎంఈవోలకు సమర్పించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించి వారి వివరాలు సమర్పించాలి. కానీ ఎక్కడా గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసిన బాల కార్మికులే... కరీంనగర్ నగరంలో బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యల్లోనే ఉంటారని లెక్కలే తేలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటుకబట్టీల్లో, హోటళ్లు, కాగితాలు ఏరుకుంటూ, భిక్షాటనలో బాలకార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నా.. ఇటు విద్యాశాఖ, అటు లేబర్ ఆఫీసర్లు చూసిచూడనట్లు ఉంటున్నారు. బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు విద్యాహక్కు చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్కూళ్లను నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అధికారులు.. ఆ తరువాత పట్టించుకోలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇటీవల బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం అధికారులు సర్వే చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదని ఆ శాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. సర్వే చేసిన వారిలో చాలామంది ఇంట్లో కూర్చోని కాకి లెక్కలు సమర్పించినట్లు తెలుస్తుంది. పొంతన లేని లెక్కలు బడిబయటి పిల్లల గుర్తింపు కోసం చేస్తున్న సర్వేలు ఏమాత్రమూ నమ్మశక్యంగా లేవు. ప్రతి బడీడు పిల్లవాడి పేరును చేర్చుకుంటున్న అధికారులు.. వారు బడికి వస్తున్నారో..? లేదో..? చూడడం లేదు. బడిబయటి పిల్లల విషయంలో ఒక్కొక్కరి సర్వేలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. జిల్లాలో రెండు వేల మందిబాల కార్మికులు ఆయా పనుల్లో కొనసాగుతున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఆరువేల వరకు ఉందని సాక్షర భారత్ కార్యకర్తలు గతేడాది నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇక స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 వేల మందికిపైగా పిల్లలు బడి బయట ఉన్నట్లు గతంలో నివేదికలు సమర్పించారు. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేదలకు విద్య అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పేద విద్యార్థుల దరిచేరడం లేదు. దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని విద్యావేత్త ‘కొఠారి’ ఏళ్ల క్రితమే చెప్పారు. కానీ.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 66 ఏళ్లు దాటినా పేదవాడికి విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. ఆరేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని సైతం పార్లమెంటు ఆమోదించింది. ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి..’ అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులను ఖర్చు చేస్తున్నా.. అనుకున్న లక్ష్యానికి చేరవ కాకపోవడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2016 నాటికి పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యావేదిక అభిప్రాయపడింది. దీంతో మన దేశం మరో అడుగు ముందుకేసి అందరికి విద్యను అందిస్తామని ప్రతిన బూనడంతోపాటు 2009 ఆగస్టు 27న పార్లమెంట్లో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్షత చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్భంద విద్య అమలుకాలేదు. ఫలితం బాలకార్మికుల సంఖ్య పెరిగి, నిరక్షరాస్యత శాతంలో కూడా అదేస్థాయిలో పెరిగి విద్యలో వెనుకబడ్డ విషయం ప్రభుత్వ లెక్కలే రుజువు చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టంలోని ప్రధానాంశాలు... 2010 ఏప్రిల్ నుంచి విద్యాహక్కు చట్టం అమలవుతోంది. 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో పిల్లలను కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. టీసీలు, రికార్డుషీట్లు, పుట్టినతేదీ నిర్ధరణ సర్టిఫికెట్లు లేవని, ప్రమాణాలు లేవని తిరస్కరించడం నేరం. సెక్షన్ 17 ప్రకారం విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దండించడం నేరం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి. మానవ వనరులను ఏర్పాటు చేయాలి కనీస విద్యాప్రమాణాలను పాటించాలి ప్రవేశ, పరీక్ష, స్పోర్ట్స్, టీసీలకు ఫీజులు వసూలు చేయరాదు. పాఠశాలల్లో చేర్పించుకునేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. కారణం లేకుండా విద్యార్థుల పేర్లను తొలగించరాదు. బడుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. పదిశాతం మించి ఉపాధ్యాయ ఖాళీలు ఉండరాదు. గుర్తింపులేని బడులకు మండల విద్యాధికారి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. బడిని మూసివేయించవచ్చు. ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో వినియోగించరాదు. (సెన్సెస్, ఎలక్షన్ విధులు మినహా). ఉపాధ్యాయులు ట్యూషన్లు చెప్పరాదు బడుల్లో 14 ఏళ్లలోపు పిల్లల వివరాలను, వివిధ కమిటీల వివరాలను ప్రదర్శించాలి. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వ బడుల సిఫార్సుతో భర్తీ చేయాలి. వీరి ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇంటివద్దనే విద్యాబోధన చేయడానికి శిక్షకులను ఏర్పాటు చేయాలి. బడికిరాని, డ్రాపౌట్ విద్యార్థులను విద్యా స్రవంతిలో కలపడానికి ప్రత్యేక ఆవాస శిక్షణ కేంద్రాలు, వర్క్సైట్ స్కూల్స్, ట్రాన్సిట్ హోంలు, హెల్ప్డెస్క్, సీజనల్ హాస్టల్స్, సంచార పాఠశాలలు ఏర్పాటు చేయాలి. బడీడు పిల్లలతో పనులు చేయించుకోవద్దు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దళిత విద్యార్థులకు, దారిద్య్ర రేఖ కు దిగువ బాలల యూనిఫాంలకు ఒక్కొక్కరికి రూ.400 చెల్లించాలి. పాఠశాలలు ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రాంతాల్లో దూరపు పాఠశాలలకు రవాణా చేయడానికి నెలకు రూ.300 చెల్లించాలి. తల్లిదండ్రులులేని పిల్లలందరికీ చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరైనా, సరిగ్గా బోధించకపోయినా సెక్షన్ 24 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. -
పటిష్టంగా బాలకార్మిక చట్టాల అమలు
- కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి - 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు - బాల కార్మిక నిర్మూలన పర్యవేక్షణకు ప్రత్యేక కార్యక్రమం - ఉపాధి కల్పనలో తెలంగాణ సర్కారు చొరవకు ప్రశంస సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణాను అరికడతామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) చేసిన రెండు కన్వెన్షన్స్పై (138–ఉపాధికి కనీస వయసు, 182–హీనమైన బాల కార్మిక విధానాలు) స్విట్జర్లాం డ్లోని జెనీవాలో ఇటీవల జరిగిన ఐఎల్వో సదస్సులో భారత్ సంతకాలు చేసిందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఇందుకు జిల్లా మేజిస్ట్రేట్లకు పూర్తి అధికారాలు కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు పర్యవేక్షణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికగా ‘పెన్సిల్’(ప్రొవైడింగ్ యాన్ ఎలక్ట్రానిక్ సపరేట్ ప్లాట్ఫాం)ను ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంస్థ జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయులు ఇక్కట్లు పడకుండా గల్ఫ్ దేశాలతో కలసి ఐఎల్వో తరహాలో ప్రత్యేక సంస్థను ఏర్పా టుకు నిర్ణయించినట్లు దత్తాత్రేయ తెలిపా రు. పనికోసం వీసాపై ఒక దేశానికి వెళ్లి అక్కడి నుంచి ఇతర గల్ఫ్ దేశాలకు అక్రమంగా వెళ్తుండటం వల్లే కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా మని అన్నారు. నిరుద్యోగుల రేటు తగ్గుతోంది... దేశంలో నిరుద్యోగుల రేటు ఏటా తగ్గుతోందని దత్తాత్రేయ వివరించారు. ఉపాధి కల్ప న కేంద్రమే కల్పించేది కాదని, దీనిపై రాష్ట్రా లూ కేంద్రంతో కలసి పనిచేయాలన్నారు. దీనిపై తెలంగాణ తీసుకుంటున్న చొరవను అభినందించారు. సంగారెడ్డిలో పరిశ్రమల హబ్ ఏర్పాటుతోపాటు పరిశ్రమలకు పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా అన్ని రాష్ట్రాలూ ప్రోత్సాహకాలిస్తే కేంద్రం తన వంతుగా సాయం చేస్తుందన్నారు.
Pagination
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement