breaking news
Chicken Business
-
పీపుల్స్ ప్లాజాలో చికెన్, ఎగ్ మేళా
-
కోవిడ్ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’
సాక్షి, హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వైరస్ (కోవిడ్-19) వస్తుందనే అసత్య ప్రచారాలను నమ్మొద్దని, కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో.. భారత్లో కోడి మాంసం తిని ఎవరూ చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న పలు ఉదంతాల నేపథ్యంలో చికెన్, గుడ్ల విక్రయాలు, వినియోగం తగ్గిపోయింది. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి వ్యయం రూ.77 ఉంటే రూ.30 నుంచి 35 అమ్మాల్సి వస్తుంది. గుడ్డు ఉత్పత్తి రూ.4 ఉంటే 2.80 చొప్పున విక్రయించాల్సి వస్తుంది. గత రెండు మాసాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది’అని ఈటల పేర్కొన్నారు. చికెన్ ఎగ్స్ మేళాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రకాల వంటకాలు.. గంగ పుత్రులు, ముదిరాజులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్లో జరగుతున్న ఫిష్ ఫెస్టివల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఫెస్టివల్ లో 100రకాల చేపల వంటకాలు ఉన్నాయని తెలిపారు. బేగం బజార్, ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ప్రభుత్వం పెద్ద చేపల మార్కెట్ కట్టిస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్కు ఒక ఔట్ లెట్ ఇస్తున్నామని చెప్పారు. చేపలు,చికెన్ తింటే కరోన వైరస్ రాదని మంత్రి స్పష్టం చేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ -
‘ఐసిస్’ చికెన్ వ్యాపారం
కైరో: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తీవ్రవాద సంస్థ ఐసిస్ లిబియాలోని సిర్త్ నగరంలో చాలా తక్కువ ధరలకు కోడి పిల్లలు, గుడ్లు అమ్ముతోందని ఓ మీడియా నివేదిక తెలిపింది. ఐసిస్ సిర్త్ను ఆక్రమించుకున్నపుడు ఆ ప్రాంతంలోని కోళ్ల ఫారాలు, ఇతర ఆస్తులను స్వాధీనపరుచుకుంది. ప్రజలపై అద్దెలు, పన్నులు కూడా విధించింది. ఐసిస్ తీవ్రవాదులు ముఖానికి నల్ల గుడ్డ కట్టుకుని కేవలం రెండు దినార్లకే కోడి పిల్లలు,గుడ్లు అమ్ముతున్నారని స్థానికులు చెబుతున్నారు. సొంత దుకాణాలు కలిగిన యజమానుల నుంచి కూడా ఐసిస్ బలవంతంగా అద్దెలు వసూలు చేస్తోంది. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ సేవల కింద ప్రజల నుంచి వారానికి 10 లిబియన్ దినార్లను డిమాండ్ చేస్తోంది. సిర్త నగర తీరానికి సమీపంలోని బీచ్ అపార్టుమెంట్లలో నివసించే ప్రజల నుంచి కూడా ఐసిస్ అద్దెలను అడుగుతోంది. ఈ అపార్టుమెంట్లు మాజీ అధ్యక్షుడు గడాఫీకి చెందినవిగా భావిస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతంలోని సహజ వనరులు, పురాతన వస్తువులు, లైంగిక బానిసలను అమ్మడం తదితరాల ద్వారా ఐసిస్ కొంత కాలంగా ఆదాయం ఆర్జిస్తోంది. ఆర్థిక వనరుల అభివృద్ధికి గడాఫీ కాలం నాటి కరె న్సీ నోట్లను పునరుద్ధరించారు.