-
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి
సాక్షి, బెంగళూరు: చెన్నై వండలూరు జూలోని తెల్లపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలను ప్రత్యేక బోనులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారు. కాగా ఓ పిల్లపై తల్లి పంజా తగలడంతో గాయమైంది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. మిగిలిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ సిబ్బంది తెలిపారు. -
షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి
చెన్నై: కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను సైతం వీడటం లేదు. కోవిడ్తో ఇటీవల(జూన్3) తమిళనాడులోని అరిగ్నర్ అన్నా జూపార్క్లో ఓ మగ సింహం(నీలా) చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని అదే జూలో బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో మరో సింహం మరణించిందని జూ అధికారులు తెలిపారు. పద్మనాథన్ అని పిలవబడే ఈ సింహం వయస్సు 12 ఏళ్లు. జూన్ 3న ఈ సింహం శాంపిల్స్ను భోపాల్లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని చెప్పారు. కోవిడ్ పాజిటివ్గా తేలడంతో సింహానికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందించామని జూ అధికారులు పేర్కొన్నారు. దీనిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. కాగా ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు. చదవండి: అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి కరోనా వైరస్తో సివంగి మృతి -
'ఆ మొసళ్లు కొట్టుకుపోలేదు..'
చెన్నై వరద నీటిలో మొసళ్లు కొట్టుకుపోయినట్టు వచ్చిన వార్తలను మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ తోసిపుచ్చింది. 'మొసళ్లు తప్పించుకోలేదు. ఆ వార్తలను దయచేసి నమ్మకండి. అన్ని మొసళ్లు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. భద్రతకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలియజేసింది. క్రొకడైల్ ఫామ్ చుట్టూ భారీ గోడ నిర్మించామని పేర్కొంది. చెన్నై జై పార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్టు వార్తలు రావడంతో మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. కాగా చెన్నై జూ పార్క్లోకి తొలిసారి వరద నీరు రావడంతో పాటు పార్క్ ప్రహారీ గోడ దెబ్బతింది. అయితే జూ పార్క్లో జంతువులన్నీ క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల చెన్నైలో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి పాములు, చేపలు, కప్పలు వస్తున్నాయి. ఓ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో చేపలు, కప్పలు ఈత కొడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement