charlapalli central jail
-
చర్లపల్లి జైలులో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఓ ఖైదీ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్లో ఉంటున్న శిక్షా ఖైదీ వద్ద 120 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోహన్ రావు అనే వార్డరు, ఖైదీని విచారించగా ఓ పోలీసు అధికారే తన గంజాయి అందించాడని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు విచారణ చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చర్లపల్లిలో అధికారుల ఘర్షణ
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో ఓ అధికారి, వార్డర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఉప పర్యవేక్షణ అధికారి చింతల దశరథం, వార్డర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీలకు నిషేదిత వస్తువులు అందుతుండటంపై గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఇరువర్గాల మధ్య జైలు అధికారులు రాజీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.