breaking news
Chandra Prakash
-
పీఆర్ డీఈఈపై ఏసీబీ పంజా
చేర్యాల: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూరపాటి చంద్రప్రకాశ్ను అధికారులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ ప్రతాప్కుమార్ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప«థకం ద్వారా 2016లో రూ.74 లక్షలతో మంజూరైన చేర్యాల, రోళ్లబండ బీటీ రోడ్డు నిర్మాణ పనులను జనగామకు చెందిన ఈడీఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. పనుల నిర్వహణకు సంబంధించి చేర్యాలకు చెందిన ఎంఏ రహమాన్కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. 2017 ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత కాలంలో కాంట్రా క్టరు 90 శాతం పనులు పూర్తి చేశాడు. పనుల నాణ్యతపై ఢిల్లీకి చెందిన నేషనల్ క్వాలిటీ కంట్రోల్ బృందం క్షుణ్ణంగా విచారణ జరిపింది. ఈ పనుల్లో కొన్ని లోటుపాట్లను సవరించుకోవాలని సూచించింది. ఆ మేరకు కూడా కాంట్రాక్టరు చర్యలు తీసుకున్నాడు. రోడ్డు పనులు పూర్తి కావడంతో బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టరు రహమాన్.. డీఈఈ చంద్రప్రకాశ్ను కలిశాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ.85 వేలు ఇస్తానని రహమాన్ ఒప్పం దం కుదుర్చుకున్నాడు. ఆపై రహమాన్ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం చేర్యాలలోని డీఈఈ చంద్రప్రకాశ్ ఇంటి సమీపంలో మాటువేసిన అధికారులు.. రహమాన్ రూ.85 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడుల్లో ఏసీబీ ఎస్ఐలు బి.గంగాధర్, సీహెచ్ మురళీమోహన్, రఘునందన్ పాల్గొన్నారు. 1064కు ఫోన్ చేయండి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ప్రతాప్కుమార్ హెచ్చరించారు. ప్రజలు ఫిర్యాదుంటే టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. -
ఈ బాలుడికి ఎవరు ప్రాణం పోస్తారు?
మదురై: ఆ కుర్రాడికి ఇంజినీర్ కావాలని కల. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అనే తీరుగా పుట్టుకతోనే మదురైకి చెందిన చంద్రప్రకాశ్ అనే 14 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో అతడికి స్కూల్ వాతావరణం కన్నా ఆస్పత్రితోనే పరిచయం ఎక్కువైంది. స్కూల్లో కంటే ఆస్పత్రి పేషెంట్ రూమ్లోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా అతడి పరిస్థితి మరింత దిగజారింది. అయితే వైద్యులు ఆ బాలుడు బతుకుతాడని హామీ ఇచ్చారు. బోన్ మ్యారో సహాయం చేసే వాళ్లు ఉంటే అతడిని దక్కించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మెడికల్ సపోర్ట్ తో కాలం వెల్లదీస్తున్న ఆ కుర్రాడికి బోన్ మ్యారో సహాయం దానం చేసేందుకు ఒక వ్యక్తి వచ్చాడు కానీ.. అంతమొత్తానికి అయ్యే ఖర్చు భారాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి. దీంతో ఎవరైనా పెద్ద మనసుతో సహాయం చేస్తే తమ బిడ్డ బతుకుతాడని మొరపెట్టుకుంటున్నారు. తమిళనాడులోని థెని జిల్లాకు చెందిన ఈ బాలుడి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పటికే ఆ బాలుడిని బతికించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆస్తినంతా అమ్మేసుకున్నారు. -
‘రెడ్ ఎలర్ట్’ మూవీ స్టిల్స్